Thursday, November 17, 2011

అధ్యాయము-6 భాగము-6

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము -భాగము 6 


నరసావధానులు తన యింటిలో తోటకూరను పెంచుచుండెడివారు. వారి ఇంతనుండేది తోటకూర అత్యంత రుచికరమైనది గా ప్రతీతి. ఎంత అరచి గీపెట్టిననూ ఎవ్వరికినీ వారు తోటకూర యిచ్చేదివారు కారు. ఎవరినుండి అయిననూ తనకు విశేష ప్రతిఫలము ఉన్నాడని తోచిన యెడల మాత్రమే వారికి తోటకూరను యిచ్చెడివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండిపెట్టమని కోరెను. అదికూడా నరసావధానులు గారింటి నుండి తెమ్మనేను. ఇది అసంభవమైన విషయముగా కనపడ సాగెను. తాతగారైన శ్రీ బాపనార్యులిట్లనిరి."నాయనా! శ్రీపాదా! రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావదాన్లు తాతగారిని తోటకూర యిమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకుని వారింటి వద్దకు  వెళ్ళెదను. ఒకవేళ నరసావధాన్లు తోటకూర యివ్వని పక్షమున యింక నీవు ఆ విషయమై పట్టు పట్టరాదు." దానికి శ్రీపాదులు అంగీకరించిరి. ఉదయముననే బాపనార్యులు వారు శ్రీపదుని ఎత్తుకుని నరసావధాన్లు యింతివద్దకు వచ్చుచుండిరి. పెద్దలను గౌరవించ వలెననియూ వారి ఆశీస్సులను పిల్లలు కోరుకో వలయుననియూ బాపనార్యులు చెప్పిరి. శ్రీపాదులు వల్లెయనిరి. నరసావధానులు వీధి అరుగు పైనుండెను. వారికి చాల పొడవైన శిఖ (పిలక) ఉండెడిది. అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నములో నుండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు, నరసావధాన్లుగారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించెను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధాన్లు నివ్వేరపోయిరి. శ్రీపాదుల తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నముగా నరసావదానుల వారి శిఖ ఊది క్రింద పడిపోయెను. శిఖ దానంతట అది ఎట్లు ఊడిపోయినదో అర్థము గాక వారు అయోమయస్థితిలో నుండిరి. అపుడు శ్రీ చరణులు తన తాతగారితో "తాతా! నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతట అదే ఊడిపోయెను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమ పాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏమి బాగుండును? అసలే మహా దుఃఖముతో ఉన్న నరసన్న తాత ను నేను యింకా ఎందుకు బాధపెట్టవలెను? మనము మన యింటికి పోవుదము." అనిరి. ఆ తరువాత శ్రీపాదులు తనకు తోటకూర కావలెనని ఎన్నడు అడుగలేదు.

శ్రీపాదులు తనకు నమస్కరించుటలో జరిగిన మోసము నరసావధానులకు తెలియవచ్చెను. వారు ధ్యానములో కూర్చున్నప్పుడే వారినే పోలిన వర్చస్వి అయిన ఒకానొక వ్యక్తీ వారిలో నుండి బయల్వెడలెను. నీవెవ్వరివి? ఎక్కడకు పోవుచున్నావని నరసావధానులు అతనిని అడిగెను. అంతట ఆ వర్చస్వి, "నేను నీలో ఉన్న పున్యశారీరమును. నీవు యింతదాక ఎన్నోమార్లు వేదములు పఠించితివి. స్వయంభూ దత్తుని ఆరాదిన్చిటివి. సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీ వల్లభునిగా అవతరించినపుడు అవమానించితివి. నీవు నీ శిఖ మీదను, నీ తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములలో లక్షాంశమైనను శ్రీ వల్లభుని యందు ఉన్న యెడల నీ జన్మ కడతేరి ఉందును. మోహము క్షయిన్చుతయే మోక్షము. నీవు మొహపాశములచే బద్ధుడవయి ఉన్నావు. నీకు ఆనతి కాలములో దరిద్రాదశ రాబోవుచున్నది. దానిని నివారించుటకే శ్రీపాదులు నీ నుండి శాకదానమును కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను సమర్పించి ఉన్న యెడల నీకు రాబోవు దారిద్ర్యదశ నిర్వీర్యము చేయబడటమే గాక ఐశ్వర్యము కూడా అనుగ్రహింపబడి ఉండెడిది. అటువంటి అవకాశమును నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు. అయిననూ శ్రీపాదులు కరుణా సముద్రులు. వారు ఈ అవతారమును గుప్తపరచి మరియొక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దారిద్ర్య బ్రాహ్మణుడిగా జన్మించేడవు. అప్పుడు కూడా నీవు నీ యింటిలో తోటకూరను పండించెదవు. సరి అయిన సమయము ఆసన్నమయినపుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరములోనికి ప్రవేశించేడను. తదుపరి శ్రీచరణులు నీ యింటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు. నీలోని పుణ్య స్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావున యిప్పుడు మాత్రము నేను నిన్ను వదిలి వెళ్ళిపోవుచున్నాను. శ్రీపాదుల చేత నమస్కరింప బడుట వలన నీలోని పుణ్య రూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలినది నీలోని పాపపురుషుడు మాత్రమే." అని పలికి అతనిలోని పుణ్య పురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయెను.

అప్పటినుండి నరసావధాన్లు జీవన పరిస్థితులు క్షీణించ సాగెను. అతని మాటను లేక్కచేయువారు లేకపోయిరి. పూర్వము అతనిలో ఉన్న వర్చస్సు యిప్పుడు మరుగాయెను. పీఠికాపురం గ్రామములో విషూచి(కలరా) ప్రబలెను. అనేకమంది జనులు మరణించసాగిరి. జలదోశము వలన క్రిములవ్యాప్తి జరుగుచుండెననియూ, ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండెననియూ వైద్యులు తెల్చిరి. భయవిహ్వలులైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించ వలసినదనియూ, జనహితార్థము శాస్త్రములలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొన వలసినదనియూ బాపనార్యులను ప్రార్థించిరి.

బాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి యిది జలదోశము వలన కాదనియూ, వాయుమండలము నందలి కాలుష్యమువలన అనియూ తెలిసికొనిరి. శ్రీ బాపనార్యులు చెప్పుండి వైద్య శాస్త్ర విషయములకు వ్యతిరిక్తమనియూ, అందువలన ఆమోద యోగ్యము కాదనియూ వైద్యులు నిర్మొహమాటముగా తెల్పిరి.

జనులు గ్రామదేవతకు రకరకముల జంతుబలులు, వివిధములయిన పూజలను చేయసాగిరి. తాంత్రికులు జంతుబలులను విశ్వసించెదరు.  జంతుబలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును. మంత్రోచ్ఛాటనము వలన ఆ ప్రాణశక్తి బలియిచ్చు వ్యక్తికి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగప్రక్రియలున్నవనియు, సాత్వికారాధనా పద్ధతులు అనేకములున్నవనియూ, గ్రామదేవతను ప్రసన్నము చేసుకొనుటకు సాత్విక పద్ధతులను అవలంబించా వచ్చుననియూ బాపనార్యులు సెలవిచ్చిరి. అయిననూ జనులు జంతుబలిని యిచ్చుట మానరైరి. శ్రీపాదవల్లభులయందు, వారి దివ్యలీలల యందు విశ్వాసము గల కొందరు శ్రీ చరణుల వారిని ఈ విషయమై అడిగిరి. అంతట శ్రీ చరణులు గ్రామదేవతను బలిని కోరవద్దని తాను ఆదేశించినట్లును, ఆ గ్రామదేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానము చేయుటకు వెళ్ళెననియూ, కేవలము పాలపొంగళ్ళు సమర్పించిన, రక్షా కాలికారూపము శాంతిన్చునని ఈ విషయమును గ్రామ ప్రజలకును, పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారునొకని పిలిచి చర్మవాయిద్యముతో దండోరా వేయమని చెప్పవలసినదియూ తెలియజేసిరి. దండోరా ఎవరిచేత వేయించమందురని అడుగగా విషూచి సోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పిరి.

శ్రీ వల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయిరి. వెంకయ్య మరణాసన్న స్థితిలో ఉండెను. శ్రీ చరణుల వారి ఆజ్ఞను తెలుపగా అతడు మూర్ఛిల్లెను. ఒక గడియసేపటికి ప్రక్రుతిస్థుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యెను. ఈ వార్తా పీఠికాపురములో బహుధాచర్చనీయాంశమయ్యెను. వెంకయ్య చేత దండోరా వేయించాబడెను.

శ్రీ బాపనార్యులు జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిలో ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రములను ఉచ్ఛరించిరి.ఆ విషక్రిములు తపతపమని శబ్దము చేయుచూ వాయుమండలము నుండి వచ్చి జలపాత్రలో పడినవి. వాయుమండలము నందలి కాలుష్యము హరించబడెను. విషూచి మహమ్మారి పీఠికాపురమును వీడిపొయెను.

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment