Wednesday, November 16, 2011

అధ్యాయము-6 భాగము-5

అధ్యాయము-6 
నరసావధానుల వృత్తాంతము- భాగము 5
శ్రీపాద జన్మసమయమున గోచరించిన అద్భుత దృశ్యములు 

అంతట నేనిట్లంటిని. "అయ్యా! మీరు కనులారా గాంచిన శ్రీపాదుల వారి లీలలను మరికొన్నింటిని తెలిపి నన్ను ధన్యులజేయుడు." అప్పుడు తిరుమలదాసు "అయ్యా! శంకరభట్టూ! నరసావధానులు గార్కి బాపనార్యులపై కోపము వచ్చెను. ఏదో ఒకరీతిన వారిని అవమానింపదలచెను. తనకు భగళాముఖీ దేవత అనుగ్రహము లేకుండా పోవుటకు బాపనార్యులే కారణము అని అతడు తలపోసెను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనార్యులు తన మంత్రసిద్ధిని హరించెనని ప్రచారము చేయసాగెను. నాడీ గ్రంధములు శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గూర్చిన వివరములు అతనిని మరింత బాధింపసాగెను. నాడీగ్రంధములు విశ్వసనీయములు కావనియూ, మత్స్యభుక్కు అయిన బంగాళీ బ్రాహ్మణునకు బాపనార్యులు అన్నము పెట్టుట అనాచారమనియూ వాదింపసాగెను. మనుష్యమాత్రుడు ఎవ్వడునూ పూర్ణబ్రహ్మము యొక్క అవతారము కాజాలడనియూ, పసిబాలుడైన శ్రీపాదుడు సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభువు కాజాలడనియూ వాదించసాగెను. శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయము నుండియూ ప్రణవమును ఉచ్ఛరించుటయూ, ఉయ్యాలలో పసిబాలుడుగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగము చేయగలుగుటయూ, వయస్సునకు తగని అసాధారణ ప్రజ్ఞాపాటవములు ప్రదర్శించుటయూ, ఎవరైనా వేదపండితుడైన బ్రాహ్మణుడు ఆశరీరిగా ఉండి యీ బాలుని శరీరమును ఆసరాగా చేసుకొని మాట్లాడుచుండెననియూ ప్రచారము చేయదొడగెను. శ్రీ కుక్కుటేశ్వరాలయము  స్వయంభూ దత్తుడే నియమైన వరప్రదాట అనియూ, బాలుని దత్తస్వరూపముగా భావించుట తప్పనియూ ప్రచారము చేయదొడగెను. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినపుడు మూడుతలల నాగుబాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టిననూ పడగ పట్టుచుండెడిది. వారు మాత్రు గర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెలువడిరి. పుట్టిన ఉత్తర క్షణముననే సుమతీ మహారాణి సొమ్మసిల్లిపోయెను. పురుటిగదిలో నుండి మంగళ వాయిద్యములు వినబడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్య వాణి అందరినీ పురుటిగది నుండి బయటకు పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధికి నాల్గువేదములు, 18 పురాణములు, మహాపురుషులు, జ్యోతిస్వరూపులై ఏతెంచిరి. పవిత్ర వేదమంత్రములు బయటకు వినబడుచుండెను. కోతసేపతి తరువాత నిశ్శబ్ద మావరించెను. ఈ అద్భుత సంఘటన బాపనార్యులకు కూడా అగమ్యగోచరముగను అయోమయముగను ఉండెను.

శ్రీపాదుని బాల్యలీలలు

శ్రీపాదుల వారు జన్మించి ఒక సంవత్సరము పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్తు సమావేశములకు హాజరగుచుండెడివారు. 

శ్రీచరణులు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడచి వెళ్ళుటయూ, శాస్త్రప్రసంగములను చేయుటయూ, చిత్రవిచిత్రములైన లీలలను చేయుటయూ జరుగుచుండెడిది. ఎవరో మహా పండితుడు మరణించిన తదుపరి యీ బాలునిలో ప్రవేశించి యీ రకములయిన పనులను చేయుచుండెననియూ, బాలునికి తగిన వైద్యము చేయించక బాపనార్యులు మరియు రాజశర్మయు  వానిని దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియూ, యిది అంగీకార యోగ్యము కాని విషయమనియూ పీఠికాపురవాసులు తలపోయుచుండిరి. పీఠికాపురము పాదగయాక్షేత్రాముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రముగనుకనూ, పీఠికాపురములో విగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలననూ యీ రకములైన వాదములకు బలము చేకూరుచుండెను. నేను మాల్యాద్రిపురము నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి యింట్లోని దుస్తులను నేను ఉతుకుచుండెడి వాడను. నరసావధానులు గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనదమని పిలువబడు వాయసపుర అగ్రహారము (కాకినాడ) నకు వలసపోయెను. అందువలన నరసావధానులు గారింటి బట్టలను ఉతుకుతకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండియూ బాపనార్యుల కుటుంబముతో సాన్నిహిత్యము వలన నేను కొంత శుభేచ్ఛ కలిగినవాడుగా మార్పునోన్దితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగసాగెను. నరసావధానులు గారి బట్టలను నేను స్వయముగా ఉతుకక నా పెద్ద కుమారుడైన రావిదాసును ఉతకమని చెప్పితిని. ఏ రోజయిననూ నేను నరసావధానులు గారిని చూచినా యెడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమె ఉతకగలుగుచుంటిని. 

తిరుమలదాసుపై శ్రీపాదుల వారి దివ్యానుగ్రహము 

రావిదాసు నా పెద్ద కుమారుడు. నా మొదటి భార్య కొడుకు. నరసావధాన్లు గారి బట్టలను నేను ఉతుకకుండ రావిదాసు చేత ఉతికించేవాడను. ఈ విషయము ఎట్లో నరసావధాన్లు గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నీ ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యము కదా! నేను శ్రీపాద నామస్మరణము చేయుచూ వారి బట్టలను ఉతికితిని. రావిదాసు వాటిని వారి యింటికి తీసుకొని వెళ్ళెను. అదేమీ చిత్రమో గాని, ఆ యింటిలోని వారికి ఎవ్వరికినీ ఏమీ కాలేదు కాని నరసావధాన్లు గార్కి మాత్రమూ నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్లంతయూ, తేళ్ళు, జెర్రెలు పాకినట్లుండెను. ఆయన శరీరము నిప్పులమీద పెట్టినంత బాధ కలిగించు చుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్నివస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఎదియో క్షుద్రవిద్యతో మంత్రశక్తిని తమ వస్త్రముల లోనికి ప్రవేశపెట్టినాననియు యిటువంటి నీచమైన పనికి శిక్ష విధింప బడుననియు తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చెను. నాయనా! శంకరభట్టూ! శ్రీపాదుల లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్దనుండి యింటికి వచ్చిన తరువాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరముల నవయవ్వన రూపమున వచ్చిరి. శ్రీపాదులు పుట్టినప్పటినుండియూ తనకు యిష్టమొచ్చిన వయసులో భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీ చరణుల లీలలతో ప్రత్యెక సంబంధము కలవారాలకు యిది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాశ్చర్యములతో "అయ్యా! మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించినవారు. రజకులు ఉండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు." అని అంటిని. దానికి శ్రీపాదులు "ఓయీ! నరసావధానులు ఎవరనుకొంటివి. వారు చాకలి మూట అంత పాపమును నిట్టిన పెట్టుకొని జీవన యాత్ర చేయుచున్న రజకుడు. రాజకుడవైన నీవు బ్రహ్మజ్ఞానము కొరకు తపించే ఉత్తమ బ్రాహ్మణుడవు. అందుచే నేను ఇక్కడకు వచ్చుట అసంగతము కాదు కదా!" అనిరి. అంతట నేను శ్రీ చరణుల పాదములపై బడి వెక్కి వెక్కి ఎద్చితిని. శ్రీ చరణులు అమృత దృష్టితో చూచుచూ నన్ను తమ దివ్య హస్తములతో లేవనేట్టిరి. వారి దివ్య హస్తములను నాపైనుంచిరి. అంతట నాకు నా గత జన్మనంతయునూ గుర్తుకు వచ్చినది. నాలోని యోగాశాక్తులు చలనావస్థను పొందినవి. కుండలినీ శక్తి జాగృతమవ సాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసికోనుచూ అంతర్ధానమయిరి.

(ఇంకా ఉంది..)                     

No comments:

Post a Comment