Monday, October 31, 2011

అధ్యాయము-3 భాగము-3

 అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం- భాగము 3 
కాణాద మహర్షి కణ సిద్ధాంతము 

"స్వామీ! నన్ను క్షమింపుడు. కాణాదమహర్షి గురించి, వారి కణసిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహు స్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినదని స్వామికి తెలియని విషయము కాదు." అని అంటిని.

కరుణాస్వరూపులైన శ్రీ పలనిస్వామి యిట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమములయిన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ కేంద్ర బిన్డువుననుసరించి మహా వేగములతో తమ తమ కక్ష్యలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగాముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన యీ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షనక్షము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటెను కూడా సూక్ష్మ స్థితిలో దత్త ప్రభువుల వారి చైతన్యముండును. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభాసధ్యమో అంత కష్ట సాధ్యము కూడా. ప్రతీ కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన యెడల ఒక్కొక్క కణ భాగము శూన్య సమానమగుచుండెను. అనంతములైన మహా శూన్యముల సంయోగ ఫలితమే యీ చరాచర సృష్టి, పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉందును. ఇవి రెండునూ కలిసినపుడు వ్యతిరేకపదార్థము నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకొనును. అర్చావతారములలో ప్రాణ ప్రతిష్ట జరిగినపుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగనే యుండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థ  వంతమగును. సర్వమంత్రములును కుండలిని యందే కలుగును. దాని యందే గాయత్రీ కూడా కలిగినది. గాయత్రి మంత్రము నందు మూడు పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రీ మంత్రము నందలి నాలుగవ పాదము 'పరోరజసి సావదోమ్' అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించునది అయి ఉన్నది. కుండలినీశక్తి 24 తత్త్వములలో యీ జగత్తులు సృష్టి చేయును. గాయత్రీ యందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు.'గో' అనగా 2. కులము అనగా 4 . బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక తొమ్మిది సంఖ్యచే సూచితము. ఎనిమిది అనునది మహామాయా స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు యిష్టమైన వారి నుండి "దో చౌపాతీ దేవ్ లక్ష్మీ" అని అనుచుండెడివారు. జీవులందరికీ పాటి స్వరూపము పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనునది తొమ్మిది సంఖ్యను, లక్ష్మీ అనునది ఎనిమిది సంఖ్యను, 'దో' అనునది రెండు సంఖ్యను 'చౌ' అనునది నాలుగు సంఖ్యను సూచించునవి అయి ఉన్నవి. 'దో చపాతీ దేవ్ లక్ష్మీ' అనుటకు మారుగా అపభ్రంశముగా, విచిత్రముగా 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ' అని పిలుచుచూ 2498 సంఖ్యను జీవులకు గుర్తుచేయు చుండిరి. గోకులము నందలి పరబ్రహ్మము, పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీ కృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. గాయత్రీ మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించెదము.


"నాయనా! శంకరా! స్థూల మానవ శరీరము నందు 12 రకముల భేదములు కలవు. అందరికినీ అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదాని కంటెను మరియొకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు ద్వాదశాదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును.అయితే శ్రీవల్లభులు ద్వాదశ ఆదిత్యుల కంటెను కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనలను కలిగి ఉండును.

మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు యీ ప్రదేశమునకు విచ్చేసిరి. నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురువపురమున ఏ రూపముతో నున్నారో అదే రూపముతో వారు యిచ్చతకు విచ్చేసిరి. వారి దివ్యలీలలకు అంతెక్కడిది? శ్రీవల్లభులు యిచ్చతకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయమునందలి మహాయోగులు బదరీ మహాక్షేత్రములో శ్రీ బదరీ నారాయణుని బ్రహ్మకమలములతో పూజించిరి. ఆ బ్రహ్మకమలము లన్నియు ఇచ్చట శ్రీ చరణముల కదా పడుచుండుట గమనించితిని. వారు దేశ కాలములకు అతీతులు." అని వచించెను.

నేను శ్రీ పళని స్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొందితిని. "స్వామీ! బ్రహ్మ కమలములనగా నేమి? అవి ఎచ్చట లభించును? వానిచే పూజించిన శ్రీదత్త ప్రభువు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియుచున్నది. దయచేసి నా సందేహము తీర్చగోరెదను." అని కోరితిని.

(ఇంకా ఉంది..)  

No comments:

Post a Comment