Thursday, December 8, 2011

Chapter 10 Part 1

అధ్యాయము - 10 
నరసింహ మూర్తుల వర్ణనము - భాగము 1 

నేను తిరుమలదాసు అనుజ్ఞను గైకొని కురువపురం దిశగా ప్రయాణము కొనసాగించితిని. శ్రీపాదుల వారి లీలలను మనసున తలచుకొనుకొలదిని నాకు రోమాంచితమవసాగినది. ప్రయానమార్గామందు అల్లంత దూరమున అశ్వత్థవృక్షము కానవచ్చినది. అది అపరాహ్ణ సమయము. నాకు ఆకలి మిక్కుటముగా నున్నది. దరిదాపులలో ఏదయినా బ్రాహ్మణ అగ్రహారమున్నచో మాధూకరమును తెచ్చుకోవలయును. ప్రయాణమునందు కలిగిన అలసట తీర్చుకొనుటకు పవిత్రమైన అశ్వత్థవృక్షమున్నది గదాయని ఆలోచించ సాగితిని. అశ్వత్థ వృక్షచ్ఛాయయందు ఎవరో విశ్రాంతి తీసుకొనుచున్నట్లు కానవచ్చినది. కొంచెము దూరము పోవుసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపవీతమున్నట్లు కనిపించినది. 

నేను అశ్వత్థ వృక్షము దరిదాపులకు వచ్చితిని. ఆ నూతనవ్యక్తి నన్ను సాదరముగా ఆహ్వానించి కూర్చొనమనెను. అతని కన్నులయందు కరుణారసము చిప్పిల్లుచుండెను. అతని ముందు జంగిడీ ఒకటుండెను. దానియందు ఆహారపదార్థములు ఏమియునూ లేవు. ఒక రాగిపాత్ర మాత్రముండెను. అతడు శ్రీపాదవల్లభ నామమును తరచూ పలుకుచుండెను. నేను అతనిని, "అయ్యా! మీరు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణాశ్రితులా? మీరు ఆ మహాపుణ్యపురుషుని దర్శించితిరా!" అని ఆతురతతో ప్రశ్నించితిని. 

అంతట అతదిట్లు పలికెను. "అయ్యా! నేను సద్వైశ్యకులమునందు జనించినవాడను. నన్ను సుబ్బయ్యశ్రేష్ఠి అని అందురు. నాకు చిన్నతనముననే మాతాపితృవియోగము సంభవించినది. మా యింట వలసినంత ధనరాశులున్నవి. నేను సుదూర ప్రాంతములకు పోయి అనేక క్రయ విక్రయములను జరుపువాడను. నేను తరచుగా కాంచీపురమునకు పోవుచుండెడివాడను. అచ్చట చింతామణి నామధేయము కలిగిన వేశ్యకాంతతో పరిచయమేర్పడినది. నేనెంతయో ధనమును విచ్చలవిడిగా ఖర్చుపెట్టితిని. మళయాళదేశమునందున్న పాలకాడు అను పట్టణము నుండి బిల్వమంగళుడు అను బ్రాహ్మణుడు కూడా కాంచీపురమునకు వ్యాపారార్థియై వచ్చేదివాడు. సుగంధ ద్రవ్యాదులను అరబ్బు దేశములవారికి అమ్మి వారినుండి రత్నరాశులను, గుఱ్ఱములను అతడు స్వీకరించెడివాడు. ఒక్కొక్క పర్యాయము మేమిరువురమునూ కలిసి వర్తకవాణిజ్యములను చేసెడివారము. మా వద్ద మేలుజాతి గుఱ్ఱములను రాజులు, మహారాజులు కొనుచుండెడివారు. దుష్కర్మవశమున మేమిరువురమూ కూడా వేశ్యా సాంగత్యమున భ్రష్ఠులమైతిమి. 

అరబ్బుదేశములవారితో మేమిరువురమునూ చేయు క్రయవిక్రయములు కొంతకాలము ఉత్సాహ భరితముగానే సాగెను. తదుపరి వారు మా యొద్దనుండి విశేషధనమును స్వీకరించి మేలుజాతి గుఱ్ఱములనీయక బహు నాశిరకము గుఱ్ఱముల నిచ్చిరి. మేము వ్యాపారములో ఎంతగానో నష్టపోయితిమి. వ్యాపారములో నష్టమువచ్చిన మేము మా ఆస్తులను కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు మతి స్థిమితము లేని ఒక కుమారుడుండెను. వాడును అకాలమరణము చెందెను. 

నాయనా! తీర్థములలోకెల్లా శ్రేష్ఠమని పిలువదగిన పాదగయా తీర్థరాజమును కలిగిన శ్రీ పీఠికాపురము మా స్వగ్రామము. నేను నా అజ్ఞానదశవలన దేవ బ్రాహ్మణ నిండా చేసెడివాడను. బాకీలు వసూలు చేయుటయందు కాఠిన్యమును ప్రదర్శించెడివాడను. ఒక పర్యాయము శ్రీపాదుల వారి తండ్రిగారయిన అప్పలరాజశర్మ గారింటికి అయినవిల్లి నుండి బంధుగణము విశేషముగా వచ్చిరి. వారందరికీ భోజనభాజనములనేర్పాటు చేయుటకు అప్పలరాజు గారివద్ద రోఖ్ఖము లేకుండెను. శ్రేష్ఠిగారి వద్దకు వెచ్చములకు వెళ్ళినచో, శ్రేష్ఠి గారు వారి కుల పోరోహితులగుట వలన ఉదారముగా వ్యవహరించి రోఖ్ఖమును స్వీకరింపక వెచ్చములను ఉచితముగా యిచ్చెదరు. అప్పుడది దానముగా అగును. కాని అప్పలరాజశర్మ గారు దానమును స్వీకరింపరు. విధిలేని పరిస్థితిలో వారు ఒక వరహా ఖరీదు చేయు వెచ్చములను నా దుకాణము నుండి తీసుకొనివెళ్ళిరి. బంధుగణములు వెళ్లిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించితిని. చేతిలో చిల్లి గవ్వ అయిననూ లేదనియూ, తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించెదననియూ రాజశర్మ బదులిచ్చెను. నేను చక్రవడ్డీ వసూలు చేయుటలో కడునేర్పరిని. కాలము గతించుచుండెను. నేను వడ్డీ కి వడ్డీ లెక్కవేసి దొంగ లెఖ్ఖలేసి పది వరహాలు యివ్వవలెనని తేల్చితిని. అంత ధనమును నాకీయ వలెనన్న రాజశర్మ గృహమును అమ్మివేయవలెను. అప్పుడున్న ధరవరుల ప్రకారము వారి గృహమును నేను తీసుకొని ఒకటి, రెండు వరహాలు వారికిచ్చిన సరిపోవును. యీ విషయమును పదుగురెదుట చెప్పుచుండెడివాడను. రాజశర్మను గృహవిహీనునిగా చేయుట నా సంకల్పము. నా దూరాలోచనను గమనించిన వెంకటప్పయ్య శ్రేష్ఠి "ఓరీ! దురాత్ముడా! ధనమదాంధముతో యిష్టము వచ్చినట్లు వదురుచున్నావు. మా కులపురోహితులను అవమానించిన మమ్ము అవమానించినట్లే! నీ పద్ధతులను మార్చుకొననిచో నీవు తీవ్రముగా నష్టపోయెదవు. అగ్ని హోత్రము కంటెను పవిత్రుడైన రాజశర్మను నీవు యీ విధముగా హింసించుట వలన రౌరవాది నరకములకు పోయెదవు. " అనెను.

ఒక పర్యాయము శ్రీపాదులవారు వెంకటప్పయ్య శ్రేష్ఠి యింటివద్ద నుండిరి. నేను శ్రేష్ఠి గారితో వెటకారముగా, "రాజశర్మ నా బాకీని తీర్చలేనిచో వాని కుమారులలో ఎవరినయిననూ నా దుకాణము వద్ద ఊడిగము చేయుటకు పంపించవలయును, లేదా తానే ఊడిగము చేయవలయును. ఒక కొడుకు గ్రుడ్డివాడును, రెండవ కొడుకు కుంటివాడును, మూడవ కొడుకైన శ్రీపాదుడు మూడు సంవత్సరముల పిల్లవాడును. మరి నా బాకీ తీరుటెట్లు?" అంటిని. వెంకటప్పయ్య శ్రేష్ఠి మనస్సు ఎంతగానో నొచ్చుకొనెను. వారి కన్నులవెంట నీరు దారాపతముగా వర్షించుచుండెను. శ్రీపాదులవారు తమ దివ్య హస్తములతో వారి కన్నీటిని తుడిచి, "తాతా! నేనుండగా భయమెందులకు? హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల సంహరించిన వాడను నేనే! సుబ్బయ్య బాకీ తీర్చుట నాకేమంత కష్టము?" అనిరి. శ్రీపాదుడు నా వైపు చూచి "ఓయీ! నీ బాకీని నేను తీర్చెదను. పద! నీ దుకాణమునకు. నేను నీ దుకాణములో సేవచేసి నా బాకీ నివృత్తి చేసెదను. బాకీ తీరిన తరువాత లక్ష్మి మాత్రము నీ యింట నివసింపదు. ఆలోచించుకొనుము." అనెను.

గర్వాంధుడను, దుర్మార్గుడను అయిన నేను సరేనంటిని. శ్రీపాదుల వారి నెత్తుకొని నా దుకాణమునకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చి, "సుబ్బయ్యా! నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణమున పని చేసెదను. నీకు సమ్మతమేనా?" అనిరి. నేను వల్లెయంటిని. ఇంతలో జటాధారి అయిన సన్యాసి యొకడు నా యొద్దకు వచ్చి, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణమెక్కడ? అని అడిగెను. నేను సుబ్బయ్య శ్రేష్ఠిని. ఇదే నా దుకాణము అని అంటిని. అంతట అతడు "అయ్యా! నాకు అత్యవసరముగా ఒక రాగిపాత్ర కావలయును. వేల ఎక్కువయిననూ పరవాలేదు. daya యుంచి నాకు అత్యవసరముగా రాగిపాత్రనిచ్చినచో తీసుకొని వెళ్లిపోయెదను." అనెను. నా వద్ద 32 రాగిపాత్రలున్నవి. కాని నేను నా వద్ద ఒకే ఒక రాగిపాత్ర ఉన్నాడని, 10 వరహాలు ఇవ్వగలిగిన యెడల దానిని యిచ్చెదనంటిని. అతడు వెంటనే అంగీకరించెను. అయితే ఒక షరతును మాత్రము విధించెను. వెంకటప్పయ్య శ్రేష్ఠి ఒడిలో నున్న శ్రీపాదుల వారు తమ స్వహస్తములతో ఆ రాగిపాత్రను యీయవలెను. దానికి శ్రీపాదులవారు అంగీకరించిరి. శ్రీపాదులవారి హస్తముల నుండి జటాధారి రాగిపాత్రను అందుకొనెను. శ్రీపాదులవారు నవ్వు చుండిరి. జటాధారి కూడా నవ్వసాగిరి. శ్రీపాదులవారు జటాధారితో, "ఓయీ! నీ కోరిక తీరినది. నీ యింట లక్ష్మి స్థిర నివాసముండును. నీవు నీ సన్యాసదీక్షను విరమించి నీ స్వగృహమునకు పొమ్ము. నీ భార్యాబిడ్డలు నీ కోసము  ఎదురు చూచుచున్నారు." అనెను. జటాధారి ఆనంద భరితుడై వెడలిపోయెను. 

నాకు వెంకటప్పయ్య శ్రేష్ఠిని, అప్పలరాజశర్మని అవమానించవలెననెడి కోరిక ఉండెడిది. నా కోరిక ఈ నాటికి తీరినది.నేను గర్వముతో, "యీ రోజున రాగిపాత్ర విక్రయముతో నాకు విశేషధనము సంప్రాప్తించినది. అప్పలరాజశర్మ నాకు యీయవలసిన 10 వరహాల అప్పు తీరిపోయినదని భావించుచున్నాను. కావున ఈ క్షణము నుండి శ్రీపాదుడు బంధవిముక్తుడు." అని పలికితిని. అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రిసాక్షిగా చెప్పమనిరి. మందభాగ్యుడను నేనట్లే చెప్పితిని. 

(ఇంకా ఉంది..)                  

No comments:

Post a Comment