tag:blogger.com,1999:blog-20542650372086217032024-03-14T03:47:11.967-04:00శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంSripada Srivallabha Charitamrutam (Telugu)
Please do not stop buying the book. Having a copy of the book at home is beneficial and brings auspiciousness to the house. This internet version is only a substitute for those who cannot find the book, yet are eager to read it. I request each reader to donate the price of this book (Rs 200 or USD 15.00) to Sripada Srivallabha Mahasamsthanam, Pithapuram and provide your support.jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.comBlogger109125tag:blogger.com,1999:blog-2054265037208621703.post-44447376384268889732014-08-07T18:57:00.001-04:002014-08-07T18:57:35.164-04:00Chapter 23 Part 2 ( Last Part)<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="color: orange; font-size: large;">అధ్యాయము 23 భాగము 2</span></div>
<div style="text-align: center;">
<span style="font-size: large;"><br /></span></div>
<div style="text-align: center;">
<span style="color: #cc0000; font-size: large;">శివపూజా రహస్య వివరణము</span></div>
<div style="text-align: center;">
<span style="font-size: large;"><br /></span></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;">శివమహిమ, ఆంద్రప్రదేశమందలి ఏకాదశ శివ క్షేత్రములలోని శివ స్వరూపములు</span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #674ea7;"><i>శివుడు ఏకాదశ రుద్రస్వరూపము. ఆంద్రదేశము నందు పదునొకండు శివ క్షేత్రములు కలవు. వాటి దర్శనము మహాఫలమునందించును.</i></span></b> అవి 1) బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2) శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3) ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4) క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు 5) అమరావతి నందలి అమరలింగేశ్వరుడు 6)కోటీఫలీ క్షేత్రము నందలి కోటీఫలీశ్వరుడు 7) పీఠికాపురము నందలి కుక్కుటేశ్వరుడు 8) మహానంది యందలి మహానందీశ్వరుడు 9) కాళేశ్వరము నందలి కాళేశ్వరుడు 10)శ్రీకాళహస్తి నందలి కాళహస్తీశ్వరుడు మరియు 11) త్రిపురాంతకము నందలి త్రిపురాంతకేశ్వరుడు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
వాస్తవమునకు శివునకు మూర్తి లేదు. శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతిస్వరూపము గాక మరేమియు కాదు. సిద్ధి కలిగిన తదుపరి నిర్మలమనస్సు రూపములో నుండెడి నిర్మలతయే స్ఫటిక లింగము. మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానము కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును. మెదడు నుండి నరముల రూపములో మెడ క్రింది వరకూ వ్యాపించి యుండు నాడులను రుద్రజడలందురు. శివుని హఠయోగి రూపములో లకులీశుడందురు. శివుడు భిక్షాటనము చేసి జీవుల పాపకర్మలను హరించును. ఈ సృష్టియందు రాగతాళ బద్ధమయిన సృష్టి, స్థితి, లయములనెడి మహాస్పందనల కనుగుణంగా ఆనంద తాండవమును చేయును గనుక శివుని నటరాజు అని అందురు. శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కూడా యీయగలడు. చిత్ అనగా మనస్సు, అంబరమనగా ఆకాశము లేక బట్ట. ఆకాశ రూపములో ఉండువాడే చిదంబరుడు. నీవు చూచెడి యీ విశాల విశ్వములోని రోదసీస్వరూపము రుద్రస్వరూపమే! ద్వాదశ జ్యోతిర్లింగములు రాశి చక్రములోని 12 రాసులకు ప్రతీకలు. కనుక శివుడు కాలస్వరూపుడు. అష్ట దిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతములు అతని పంచముఖములు. పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు కలిసి ఏకాదశ రుద్ర కళలగుచున్నవి. వీరినే ఏకాదశ రుద్రులందురు. ఉమామహేశ్వర రూపము నిత్యప్రసన్న రూపము. త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతకరూపము. జ్ఞాననేత్రమే మూడవకన్ను సమాధిస్థితిలో ప్రసన్నమైన ధ్యానములో నుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివజటాజూటములోని ఆ పరమపావని గంగామాత. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #674ea7;"><i>అది మిధునమైన శివపార్వతుల స్వరూపమే మిధునరాశి. ఆర్ధ్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనం యిస్తాడు. మిధునరాశిని సమీపించుటకు ముందు వృషభరాశిని దాటి వెళ్ళవలెను గదా! ఆ వృషభమే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపము. భ్రూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ! యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ పురుష భేదము నాశనమై ఏకత్వ స్థితిని పొందుచున్న స్వరూపమే అర్థనారీశ్వరరూపము.</i></span></b> </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
సహస్రారంలో లింగోద్భవకాలములో కర్పూరకళిక భగవత్ జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. లింగమనగా స్థూల శరీరములో లోపల దాగియుండే లింగశరీరం. ఇది జ్యోతిరూపంలో వెలుగుతూ ఉంటుందని వేదము చెప్పుచున్నది. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శివపూజారహస్యములు అనుష్ఠానము చేతను, గురుకటాక్షము చేతను మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. <span style="color: #674ea7;"><b><i>భౌతికరూపమైన పీఠికాపురమెట్లుండునో జ్యోతిర్మయి స్వరూపమైన స్వర్ణపీఠికాపురమనునది ఒకటున్నది. అది నా చైతన్యముచే నిర్మితమయినది. దానిని నన్ను నిరంతరము స్మరించే భక్తులు, జ్ఞానులు అనుభవముతో తెలుసుకొనగలరు. వారు ఎంతెంత దూరములలో ఉన్ననూ స్వర్ణ పీఠికాపురవాస్తవ్యులే అగుదురు. వారికి నేను సర్వదా సులభుడను. </i></b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
భౌతిక పీఠికాపురములోని కుక్కుటేశ్వరాలయము నందు నీవు చూచిన అర్చకస్వాములు ప్రమధ గణముల అంశచే జన్మించినవారు. భూతప్రేత పిశాచాది మహాగణములు ఎన్నియో ఉండును. <b><i><span style="color: #674ea7;">యోగాభ్యాసము చేయుకొలదినీ, శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించు కొలదినీ, ఆయా భూతప్రేతములు అలజడి సృష్టించుచునే యుండును. ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు. నా పేరిట మహాసంస్థానము మా మాతామహ గృహమున ఏర్పడితీరునని అనేక పర్యాయములు చెప్పితిని. నా సంకల్పము అమోఘము. చీమలబారుల వలె లక్షోపలక్షల భక్త గణములు, యోగి గణములు నా సంస్థానమును దర్శించగలరు. ఎవరు, ఎప్పుడు, ఎంతమంది, ఏ విధానముగా రావలయునో నేనే నిర్ణయించెదను. పీఠికాపుర వాస్తవ్యులయినంత మాత్రమున శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనము పొందగలరనుకొనుట సర్వకల్ల. నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును. అయోగ్యులకు అది ఎండమావివలె నుండును. </span></i></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;">శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము! </span></div>
<div style="text-align: justify;">
</div>
<div style="text-align: justify;">
(అధ్యాయము 23 సమాప్తము)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-14013714534146873212014-07-03T01:46:00.004-04:002014-07-03T01:46:46.196-04:00Chapter 23 Part 1<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange;">అధ్యాయము 23 భాగము 1</span></b></div>
<div style="text-align: center;">
<b><br /></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">శివపూజా రహస్య వివరణము</span></b></div>
<div style="text-align: center;">
<b><br /></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d;">శివయోగి భక్తిమహిమ - వారికి శ్రీపాదుల వారి ఉపదేశములు</span> </b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను కృష్ణ యీవల ఒడ్డు నుండి కురుంగడ్డకు ప్రయాణమగునంతలో ధర్మగుప్తుడను సద్వైశ్యుడు తారసిల్లెను. అతను కూడా శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చుచుండెను. ప్రసంగవశమున వారు పీఠికాపుర వాస్తవ్యులయిన శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులని తెలిసినది. నాకు కలిగిన ఆశ్చర్యమునకు అంతులేదు. నాకు తారసిల్లెడి శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులందరునూ శ్రీపాదుల వారి దివ్య చరితమును, లీలలను, మహిమలను, వారు చేయు అద్భుత సంఘటనలను తెలియజేయుటలో ఒక్కొక్క ప్రత్యేకమైన వింత, విశేషత సంతరించుకొనియున్నవి. శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరము జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడెడివి. అవి ఒకదానికొకటి ఎంత మాత్రమూ సంబంధము లేని వింతవింతలు. ఇదివరకెన్నడునూ నేను వినియుండని చిత్రవిచిత్ర సంగతులు. నాకు ఇప్పటివరకు శ్రీపాదుల వారి పది సంవత్సరముల వరకూ జరిగిన లీలా విశేషములు ఒక క్రమపద్ధతిలో వారి భక్తుల ద్వారా బోధింపబడినవి. నేను నా మనసున యిట్లాలోచించుచుంటిని. ధర్మగుప్తులవారు శ్రీవారి 11వ సంవత్సరములో జరిగిన సంఘటనలను ఏవయినా నాకు తెలియజేతురేమోనని అనుకుంటిని. శ్రీపాదుల వారు క్షణక్షణ లీలావిహారి. అంతలోనే శ్రీ ధర్మగుప్తులు నాతో యిట్లు చెప్పనారంభించిరి. అయ్యా!శంకరభట్టూ! నేను శివభక్తుడను. శ్రీపాదుల వారి 11వ సంవత్సరములో శివయోగి ఒకడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు చాలా యోగ్యుడు. కరతలభిక్ష చేయువాడు. తనయొద్ద ఏ రకమైన సంచిని గాని, కంచమును గాని, మరే పాత్రను గాని ఉంచుకొనువాడు కాడు. అతడు చూపరులకు పిచ్చివానివలె నుండెను. అతడు తొలుదొల్త శ్రీ కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను. అతని పిచ్చివాలకమును, ధూళిధూసరిత విగ్రహమును చూచి అర్చకస్వాములు ఆలయములోనికి రానీయరైరి. అతడు దేహస్పృహయే లేని అవధూత. అతడు మాటిమాటికీ శివపంచాక్షరి జపించుచుండెను. ఆ సమయమున నేను మాకు బావగారి వరుస అయిన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుఱ్ఱము మీద వచ్చుచుంటిని. మార్గమధ్యమున శ్రీ కుక్కుటేశ్వరాలయమును దర్శించుట నాకు అలవాటు. నేను వైశ్య ప్రముఖుడనయిన కారణమున అర్చకస్వాములు నా పేరిట ఘనమైన పూజను నిర్వహించిరి. వారికి మంచి సంభావనలనిచ్చుట నా అలవాటు. నేను అయిదు వరహాలను అర్చకస్వాముల కీయదలంచితిని. ఆ అయిదు వరహాలను అర్చకస్వాములు పంచుకొందురు. వారి ఆర్థికపరమైన కష్టములను, వెతలను, బాధలను నాతో చెప్పుకొందురు. సనాతన ధర్మమును రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకమనిరి. ఇంతలో బయటనున్న శివయోగి విసురుగా లోనికి వచ్చెను. వానితో పాటు రెండు త్రాచుపాములు కూడా లోనికి ప్రవేశించినవి. అర్చకస్వాములకు ముచ్చెమటలు పట్టినవి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఆ శివయోగి, "అర్చకస్వాములారా! మీకు భయమేమియును వలదు. మనము ఆరాధించు కుక్కుటేశ్వరునకు యివి ఆభరణములు. తండ్రిని బిడ్డలు కౌగిలించుకొనునట్లు ఈ నాగుబాములు మన తండ్రియైన కుక్కుటేశ్వరుని కౌగిలించుకొనుటకు ఆతృతపడుచున్నవి. అవి మనకు సోదరులతో సమానమైనవి. మనము మన సోదరులను జూచి భయపడుట, పారిపోవుట, లేదా చంపబూనుట మహాపాపము. అర్చకస్వాములు చేయు విశేషపూజ వలన అవి యిక్కడకు ఆకర్షింపబడినవి. నాగాభరణుడైన కుక్కుటేశ్వరుని మనము మరింత శ్రద్ధగా ఆరాధించెదము గాక! నమకచమకములను సుస్వరముతో, రాగయుక్తముగా ఆలపించుడు." అనెను. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అర్చకస్వాములకు ఏమి చేయుటకునూ పాలుపోలేదు. అర్చకస్వాములకు కొంత వందిమాగధ జనముండెడివారు. అచ్చటికి వచ్చు భక్తజనులలో ఎవరయినా ధనవంతులైయుండి విశేషముగా సంభావనల నిచ్చువారయినచో వారిని సంతోషపెట్టు పెక్కు వచనములను పలికెడివారు. ఈ అర్చకస్వాములలో పీఠికాపురములో నున్న సూర్యచంద్రశాస్త్రి అనునతడు మంచి పండితుడే గాక నిష్ఠ గల అనుష్ఠానపరుడు. అతనికి శ్రీపాదుల వారి యందు భక్తి ప్రేమలు మెండు. అతడు శ్రీపాదుల వారిని స్మరించి నమకచమకములను సుస్వరముతో రాగయుక్తముగా ఆలపించుచుండెను. అచ్చటకు వచ్చిన నాగుపాములు కూడా రాగతాళ బద్ధముగా తమ పడగలను కదల్పుచూ తమ ఆనందమును వ్యక్తము చేసెను. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
సూర్యచంద్రశాస్త్రి శివయోగిని బాపనార్యుల యింటికి తీసుకుని వచ్చెను. శివయోగికి సంతృప్తి కరమయిన భోజనమొసంగబడెను. అనంతరము శివయోగికి శ్రీపాదుల వారి దర్శనము కూడా అయ్యెను. శ్రీపాదుల వారు వానికి శివశక్తిస్వరూపులుగా దర్శనమిచ్చిరి. ఆ శివయోగి మూడురోజుల పాటు సమాధిస్థితి నందుండెను. మూడు రోజుల తరువాత శ్రీపాదుల వారు తమ దివ్యహస్తముతో వానికి అన్నమును తినిపించి, తదుపరి వానికి, "నాయనా! సనాతన ధర్మమునందు చెప్పబడిన ధర్మకర్మలనాచరించి తరించవలసినది. పురాణములందలి విషయములు కల్పనలు గాని, అసత్యములు గాని కానేకావు. వాటిలోని సామాన్య అర్థము వేరు. నిగూఢమైన రహస్యార్థము వేరు. అనుష్ఠానము చేసెడి సాధకులకు మాత్రమే. దానిలోని అంతరార్థములు, నిగూఢ రహస్యములు, అంతఃకరణములో స్ఫురించును. ఋతుకారకులగు సూర్యచంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా, చంద్రుడు మనస్సుకు ప్రతీక. చిత్సూర్యతేజస్సు, మనోరూపమయిన చంద్రుడును కూడిననే గాని సృష్టి కార్యము నెరవేరదు. అమావాస్య అనునది మాయకు ప్రతీక. ఈ మాయా స్వరూపమే ప్రథమమున వసువులు అనెడి పేరుగల కళలను సృజించుచున్నది. చంద్రబింబమందు కళలను ప్రవేశపెట్టుట, తిరిగి వానిని తనయందు లయము చేసికొనుట జరుగుచున్నది. పరమాత్మ తేజస్సును మాయ మనోరూప చంద్రుని యందు ఏ విధముగా ప్రసరింపచేయుచున్నదో అదే విధముగా చంద్రుని యందు రవికిరణ ప్రసారము కలుగుచున్నది. మాయయునూ, అమావాస్యయును జడస్వరూపములయిననూ వాని వలన పుట్టిన జగత్తు మాత్రము చిత్సాన్నిధ్యమును బట్టి చిజ్జడాత్మకమయినది. వసంతాది కాలార్తవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్తవము కూడ శిశుజనాదులకు కారణభూతమగుచున్నది. బ్రహ్మ జ్ఞాన వాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవగణమునకే యుండును. స్త్రీలయందుండెడి రజస్సు అనగా ఆర్తవము బ్రహ్మకు వ్యతిరేకమయినది గనుక ఇది బ్రహ్మహత్య వలన పుట్టినది అని పండితులు చెప్పెదరు. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఛందస్సులచే కప్పిపుచ్చబడినది గనుక వేదరహస్యములను ఛాందసమందురు. వంక లక్షణము ఆర్తవమునకుండును గావున ఋతిమతియైన స్త్రీని మూడు రోజులు దూరముగా నుంచెదరు. స్వర్గమనునది స్వతసిద్ధ కాంతి గల తేజోగోళము. మర్త్యలోకమనునది చావుపుట్టుకలు గల లోకము. పాతాళములన్నియు సూర్యకాంతి వలననే కాంతివంతములగుచున్నవి గనుక వీనికి పృశ్నులు అని పేరు. సప్త పాతాళములకునూ జాతవేదాది అధిష్ఠాన దేవతలు కలరు. మనము నివసించు భూమి ఈ సప్తపాతాళములకునూ ముందున్నది. దీనికి అగ్నియను వాడు అధిదేవత. ఈ ఎనమండుగురు అధిదేవతలకునూ అష్టవసువులని పేర్లు గలవు. సూర్యకాంతి వలన శోభను పొందెడివారు గనుక వీరిని వసువులని పిలుచుచున్నారు. ఈ ఎనిమిది గోళములకునూ మధ్యనున్న వాయుస్కంధములను సప్తసముద్రములందురు. వాయువులకు సముద్రము అనెడి సంజ్ఞ కలదని యాచ్యమహర్షి సెలవిచ్చెను. సామాన్య మానవులు సప్తసముద్రములను జలస్వరూపముగా భావింతురు కాని అది సరికాదు." అని తెలియజేసిరి. </div>
<br />
(ఇంకా ఉంది..)<br />
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-39460530095113207612014-07-02T23:54:00.002-04:002014-07-02T23:54:17.973-04:00Chapter 22 Part 3 (Last Part)<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange;">అధ్యాయము 22 భాగము 3</span></b></div>
<div style="text-align: center;">
<b><br /></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">గురుదత్త భట్టు వృత్తాంతము</span></b></div>
<div style="text-align: center;">
<b><br /></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d;">జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులొక్కరే</span></b></div>
<br />
<div style="text-align: justify;">
<b><span style="color: #674ea7;">నేను కాశీ యాత్రకు పోవుచున్నాను, సదా కాశీలోనే నివసించెదను, అని ఎవడు మానసికముగా తాపత్రయపడుచున్నాడో వానికి కాశీవాస ఫలము లభించుచున్నది. కారణమేమనగా అతడు మానసికముగా కాశీలోనే నివసించుచున్నాడు. అందువలన భౌతికముగా అతడు ఏ దేశమందున్ననూ అతని మానసిక దేశము మాత్రము కాశీయే అయి ఉన్నది.</span></b> అటులని కాశీలో నుండి గోహత్య చేసిన వానికి కాశీవాసఫలము రాజాలదు, గంగాజలము నందుండి చేపల కోసము నిరీక్షించు కొంగలకు గంగాస్నానఫలము రాజాలదు ఒకడు భౌతికముగా పీఠికాపురమున నివసించుచున్ననూ, భౌతికముగా శ్రీపాదుల వారిని దర్శించిననూ, వాని యొక్క మానసిక కాలము, మానసిక దేశము తగు విధముగా లేకపోయిన యెడల వాడు పీఠికాపురనివాసిగా గాని, శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా గాని లెఖ్ఖలోనికి రాలేడు. యోగకాలము, యోగదేశము అనునవి ఆధ్యాత్మికశక్తి సంపన్నులకు మాత్రమే అవగతము అవగలిగెడి విషయములు. శ్రీపాదుల వారి అనుగ్రహమున ఎవనికి ఎప్పుడు యోగకాలము కలుగునో, ఏ ప్రదేశములో యోగదేశము అనునది ఏర్పడునో తెలీయరాని దివ్యరహస్యము. మానవునికి కర్మ చేయు అధికారమున్నది. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #674ea7;">సత్కర్మ వలన సుఖము, దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును. పూర్వజన్మ కర్మబంధములు మనలను వెంటాడి వేధించుచున్ననూ సద్గురుని కరుణ వలన యోగకాలము ఏర్పడును. ఆ కాలము వచ్చినపుడు, ఏ ప్రదేశములో ఆ కర్మ తీరిపోవలెనో ఆ యోగదేశము నందు ఆ కర్మ తీరిపోవును.</span></b> ఇది చాలా చిత్రమయిన విషయము. పీఠికాపురమున నరసింహవర్మ గారి వద్ద శివయ్య అను సేవకుడుండెడి వాడు. ఉన్నట్టుండి శ్రీపాదులవారు ఒకానొక రోజున వానిని తీవ్రముగా చూచిరి. వెంటనే వాని మనఃప్రవృత్తిలో ఎంతయో మార్పు వచ్చెను. వాడు నిద్రాహారములను త్యజించి, "నేనే సృష్టి స్థితి లయ కారకుడను. నేనే ఆదిమూలమును. ఈ సమస్త సృష్టియు నా యందే ఉద్భవించి, నా వలననే పెంపొంది తిరిగి నాలో లయమగుచున్నది." అని పిచ్చి పిచ్చిగా మాట్లాడజొచ్చెను. నరసింహవర్మ గారికి శివయ్య యందు ఎంతయో జాలి కలిగెను. వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసినదని ప్రార్థించిరి. అంతట శివయ్యను తీసుకొని శ్రీపాదుల వారు స్మశానమునకు పోయిరి. నరసింహవర్మగారు కూడా వెంటనుండిరి. ఔదుంబర వృక్షము యొక్క ఎండిన కర్రలను స్మశానములో పేర్పించి శివయ్య చేత దహనము చేయించిరి. అంతట శివయ్యకు ఆ వింత మనఃప్రవృత్తి నుండి విమోచనము కలిగెను. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నరసింహవర్మకు యిదంతయునూ వింతగా నుండెను. అపుడు శ్రీపాదులవారు "తాతా! దీనిలో ఆశ్చర్యపోవలసినదేమియూ లేదు. వాయసపురాగ్రహారము నందలి ఒక పండితునికి సదా నాపై, "ఎంతటి అపచారము! వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడ! పసికూన అయిన శ్రీపాదుడెక్కడా! ఇతడు సృష్టి, స్థితి, లయ కారకుడట. ఆదిమూలమాట. ఇదంతయునూ దంభము, అసత్యము.' అనువిధమైన ధ్యాస ఉండెడిది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించెను. వానికి బ్రహ్మరాక్షసత్వము కలిగెను. ఒకానొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ ఋణపడి ఉన్నాడు. నేను యోగకాలమును కల్పించి యోగదేశముగా శ్మశానమును నిర్ణయించి యోగకర్మగా మోదుగకట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మ రాక్షసత్వము నుండి విమోచనము కలిగించినాను. మన శివయ్యను ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి రక్షించినాను." అని వివరించిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాయనా! శంకరభట్టూ! పీఠికాపురమున అవతరించిన యీ మహాతేజస్సు, ధర్మజ్యోతి నేడు యీ కురుంగడ్డను పవిత్రము చేయుచున్నది. <b><span style="color: #674ea7;">శ్రీపాదుల వారి సంకల్పముననుసరించి గ్రహములు ఫలితముల నిచ్చుచుండెను. ఏ రకములయిన జ్యోతిష ఫలితములయిననూ నిర్దేశిత భౌతికాలము నందు భౌతికదేశము నందు జరిగి తీరవలెననెడి నియమము లేదు. అది యోగకాలమును బట్టి, యోగదేశమును బట్టి నిర్ణయింప బడుచుండెను. </span></b></div>
<br />
<div style="text-align: center;">
<span style="color: #38761d;"><b>శ్రీపాదుల వారు అనుగ్రహించి ప్రారబ్దకర్మ, మరణమును కూడా తప్పించగలరు. </b></span></div>
<br />
<div style="text-align: justify;">
శ్రీపాదుల వారు కల్పించిన జ్యోతిషశాస్త్ర రీత్యా వెయ్యి సంవత్సరముల తరువాత జరుగవలసిన సంఘటనలను యిప్పుడే జరిపించగలరు, అనగా యోగాకాలమున యిప్పుడే నిర్ణయించగలరు. ఎక్కడో సుదూరమున జరుగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలరు, అనగా యోగదేశమును నిర్ణయించగలరు. సంఘటనలు అన్నియునూ దేశకాలములందు సదా జరుగుచుండును. శ్రీపాదులవారు ఆ దేశకాలములను తమ యిష్టము వచ్చినట్లు మార్చి వేయగలరు. ఒక పర్యాయము శ్రేష్టిగారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదులవారు ఆ కాయను స్వయముగా తామే కొట్టిరి. ఆ కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా బ్రద్ధలైనది. దాని నిండుగా రక్తముండెను. అంతట శ్రీపాదులవారు <span style="color: #674ea7;"><b>"తాతా! నీకు ఈ రోజు మరణయోగమున్నది. నీ నెత్తి బ్రద్ధలై ముక్కచెక్కలయి నెత్తురు ప్రవహించవలసినది. నేను ఆ దేశకాలములను యీ కొబ్బరికాయకు ఆవహింపజేసి నిన్ను రక్షించితిని." </b></span>అని తెలిపి వారిని ఆశ్చర్యపరచిరి. ఇంతలో సాయంసంధ్య అయినది. ముగ్గురము శ్రీపాదుల వారి నుండి శెలవు తీసుకొని కురుంగడ్డ వదలి కృష్ణకు యీవలి ఒడ్డునకు చేరితిమి. </div>
<br />
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము! </span></b></div>
<br />
( అధ్యాయము 22 సమాప్తం) </div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-78853383006765765392014-06-25T04:26:00.002-04:002014-06-25T04:29:05.457-04:00Chapter 22 Part 2<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange;">అధ్యాయము 22 - భాగము 2</span></b></div>
<div style="text-align: center;">
<span style="font-size: large;"><br /></span></div>
<div style="text-align: center;">
<span style="color: #cc0000; font-size: large;">గురుదత్తభట్టు వృత్తాంతము </span></div>
<div style="text-align: center;">
<span style="font-size: large;"><br /></span></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d;">జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులోక్కరే</span></b></div>
<div style="background-color: white; color: #333333; font-family: Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; font-size: 14.666666984558105px; line-height: 13.860000610351563px; text-align: justify;">
<b><span style="color: #38761d;"><br /></span></b></div>
<div style="background-color: white; font-family: Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; font-size: 14.666666984558105px; line-height: 13.860000610351563px; text-align: justify;">
<br /></div>
<div>
<div style="text-align: justify;">
"నాయనా! శంకరభట్టూ! కుత్సితుల మాటలను విని నేను చెడిపోయి అఘోరీగా జన్మనెత్తెడి దౌర్భాగ్యము నుండి శ్రీపాదుల వారు నన్ను ఈ విధముగా కాపాడిరి. నన్ను కేవలము విధికే వదలివేసి యుండినచో నేను పూర్తిగా పతనమయి ఉండెడివాడను." అని గురుదత్తభట్టు చెప్పెను. సద్గురువులు మానవాళియందు తమకున్న అవ్యాజప్రేమ వలన పూర్వజన్మ కర్మఫలితముల నుండి మనలను ఇట్లే నేర్పుగా విడిపించెదరు. దీనికోసము వారు తమ అమూల్యమయిన శక్తిని, కాలమును వెచ్చించువారు. </div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
శ్రీపాదుల వారి జాతకము సాంద్రసింధువేదము నుండి గణింపవలెను. మామూలు గణితమునకు అది అందదు. తిథివార నక్షత్రములు కూడా సాంద్రసింధువేదము ననుసరించియే యుండును. శ్రీపాదులవారును, అప్పలరాజుశర్మగారును, బాపనార్యుల వారును యింటిలో తెలుగుభాషతో పాటు సంస్కృతము కూడా మాట్లాడుకొనువారు. వారు హిమాలయములలో సప్తఋషుల పవిత్రభూమిలో మాట్లాడుకొను సంధ్యాభాషలో మాట్లాడుకొనుట కూడ గలదు. శంబలలో మాట్లాడుకొను ఈ భాష సంస్కృతము కంటె భిన్నమైనది. ఆ భాష యొక్క మాధుర్యమును గాని, సౌకుమార్యమును గాని వర్ణింపతరము కాదు. శ్రీ పీఠికాపురములో శ్రీపాదుల వారును, బాపనార్యుల వారును, అప్పలరాజు శర్మ గారు మాత్రమే యీ భాషను మాట్లాడుకొనగలిగినవారు. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
సత్యఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యుల వారితో "తాతా! శ్రీకృష్ణుడు సత్యమును గాని, అసత్యమును గాని పలుకువాడు కాడు. అతడు కేవలము కర్తవ్య బోధకుడు మాత్రమే." అని శ్రీపాదులవారనిరి. అంతట బాపనార్యులు, "కన్నా! ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను. మాటవరుసకు కూడా అసత్యమును పలుకరాదు." అని శ్రీపాదుల వారితోననిరి. శ్రీపాదులవారు మందహాసము చేసిరి. అదేరోజు మధ్యాహ్నము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల వారి యింటికి వచ్చిరి. శ్రేష్ఠిగారికొక ప్రగాఢ కోరిక ఉండెడిది. అది బాపనార్యుల వారు తమ యింట భోజనము చేయవలయుననియూ, భోజనానంతరము తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించవలెననియూ, అది కూడా పరమపవిత్రమయిన మహాలయపక్షములలో జరుగవలెననియూ, దాని వలన తమ పితృదేవతలు ఎంతయో ఆనందించెదరనియూ వారి భావన. బాపనార్యుల వారు తమ కోరికను మన్నించెదరో, మన్నించరోయని శ్రేష్ఠిగారికి మనసున శంక కలదు. అయిననూ శ్రీపాదుల వారిని మదిలో తలంచుకొని బాపనార్యుల వారి ఎదుట తమ అభిప్రాయమును వెల్లడిచేసిరి. బాపనార్యుల వారు అప్రయత్నముగా తప్పక మహాలయ పక్షములలో శ్రేష్ఠిగారింట భోజనము చేసెదమనియూ, దక్షిణను కూడా స్వీకరించెదమనియూ తెలిపిరి. శ్రేష్ఠిగారి ఆనందమునకు అవధులు లేవు. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదులవారు బహు చమత్కారులు. మహాలయపక్షములు జరుగుచుండగా వాగ్ధానమును పొందిన శ్రేష్ఠిగారును, వాగ్దానమును చేసిన బాపనార్యులును కూడా యీ విషయమును మరచిపోయిరి. మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున బాపనార్యుల వారి యింటికి శ్రేష్ఠిగారు వచ్చిరి. శ్రీపాదుల వారు మందహాసము చేయుచూ, "వాగ్దానమును చేయనే కూడదు. చేసిన తరువాత తప్పక నెరవేర్చవలెను. వాగ్దానమును చేసి మరచినయెడల, వాగ్దానమును పొందినవారయిననూ జ్ఞప్తికి తేవలయును. ఈ విషయమును మీరిద్దరి నుండి నేను సంజాయిషీని అడుగుచున్నాను."అనిరి. అప్పుడు వారిద్దరికీ తాము చేసిన తప్పిదము తెలియ వచ్చెను. <b><span style="color: #674ea7;">జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో విస్మృతిని కలిగించుట;ప కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చెను. </span></b>చేసిన తప్పిదమునకు వారిరువురుకునూ చింత కలిగెను. వారినోదార్చుచూ, "మీ యిద్దరికీ విస్మృతి కలిగించుటలో నా ప్రమేయమున్నది. ప్రతీ మానవునిలోను, 'నేను' 'నేను' అనునది చైతన్యరూపమున ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా 'నేను' అను చైతన్యమును కూడా పొందుచున్నాడు. ఈ 'నేను' అను చైతన్యమునకు విశ్వప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకానొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుండి కుమారునికి, వాని నుండి వాని కుమారునికి, అదే విధముగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై యున్నది. గృహస్థాశ్రమమును వదలి సన్యాసాశ్రమమును స్వీకరించినపుడు మాత్రమే యీ కర్మబంధము నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన యీ వాగ్దానము, లేదా పొందబడిన యీ వాగ్దానము పరిమితమైన నామరూపములతో కూడిన యీ జన్మలోనే మీ యిద్దరి మధ్యనే రహితము కావలసిన అవసరము లేదు. ఇది బృహదాకార స్వరూపమైన 'నేను' అను చైతన్యమునకు బదలాయించబడినది గనుక, ఏదో ఒక దేశములో ఏదో ఒక కాలములో బాపనార్యుల వంశములోని ఒక వ్యక్తి, శ్రేష్ఠి వంశములోని ఏదో ఒక వ్యక్తి యింట మహాలయ పక్షములలో భోజనము చేసి దక్షిణను స్వీకరింపవచ్చును. అది ఎప్పుడు, ఎలా, ఏ విధముగా అని నన్ను మీరు అడుగరాదు. కర్మస్వరూపము చాలా సంక్లిష్టమయినది, సూక్ష్మమయినది. కొన్ని కొన్ని కర్మలకు భౌతికకాలము వేరుగాను, యోగకాలము వేరుగాను ఉండును. భౌతిక కాలరీత్యా యీ మహాలయ పక్షములలోనే ఈ కర్మ ఆచరించబడి తీరవలెను. అయితే యోగకాలము రాలేదు గనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడినది." అని శ్రీపాదులు వారిరువురికి హితవుచేసిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట నేను శ్రీపాదుల వారు హితవుచేసిన భౌతికకాలము, యోగకాలము అననేమో వివరముగా తెలుపవలసినదని శ్రీ భట్టుగారిని అడిగితిని. శ్రీ భట్టుమహాశయుడు, "భౌతికకాలము, భౌతిక దేశముతో పాటు మానసిక కాలము, మానసిక దేశము అనునవి కూడ కలవు. వీనికి తోడుగా యోగకాలము, యోగదేశము అనునవియునూ కలవు. ఒకనికి 60 సంవత్సరముల వయస్సు ఉన్నదనుకొనుము. అతడు 20 సంవత్సరముల వయస్సు వానివలె నిరంతర విద్యాశ్రమలో ఉన్నవాడనుకొనుము. అపుడు వాని భౌతికకాలము 60 సంవత్సరములను సూచించుచున్నది. అది అతని శరీరమునకు సంబంధించినది. అయితే అతని మానసిక కాలము మాత్రము 20 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అదే విధముగా 20 సంవత్సరముల యువకునకు 60 సంవత్సరముల వృద్ధునికుండెడి బరువు, బాధ్యతలున్నాయనుకొనుము. అపుడు వాని భౌతికకాలము 20 సంవత్సరములు సూచించుచున్నది. అది శరీరమునకు సంబంధించినది. అయితే వాని మానసిక కాలము మాత్రము 60 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. ఈ విధముగా భౌతికకాలము, మానసిక కాలము ఒకే కాలమును కలిగిఉండవలెననెడి నియమము లేదు. అవి వేరువేరుగా ఉండవచ్చును." అని తెలియపరచిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<span style="color: #674ea7; font-size: large;"><b>కాశీలో గాని, పిఠాపురములోగాని నివసించవలెనని సదా మానసికముగా ఎవరు తాపత్రయపడుదురో వారికి కాశీ వాసఫలము గాని పిఠాపురవాస సహితము గాని ప్రాప్తించును. </b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #674ea7; font-size: large;"><b>దేహము ఒక క్షేత్రమందు వుండినను, మనసు అచ్చట లేకున్న ఆ క్షేత్రవాస ఫలితము రాదు. </b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(ఇంకా ఉంది.)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<span style="background-color: white; font-family: Arial, Helvetica, sans-serif; font-size: 14.666666984558105px; line-height: 13.860000610351563px;"> </span><span style="background-color: white; font-family: Arial, Helvetica, sans-serif; font-size: 14.666666984558105px; line-height: 13.860000610351563px;"> </span></div>
</div>
<div style="background-color: white; font-family: Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; font-size: 14.666666984558105px; line-height: 13.860000610351563px; text-align: justify;">
<br /></div>
<div style="background-color: white; font-family: Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; font-size: 14.666666984558105px; line-height: 13.860000610351563px; text-align: justify;">
<br /></div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-53571272472409951492014-06-23T02:15:00.002-04:002014-06-23T02:15:12.272-04:00Chapter 22 Part 1<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange;">అధ్యాయము 22 - భాగము 1</span></b></div>
<div style="text-align: center;">
<b><span style="font-size: large;"><br /></span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: red; font-size: large;">గురుదత్తభట్టు వృత్తాంతము </span></b></div>
<div style="text-align: center;">
<b><span style="font-size: large;"><br /></span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d;">జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులోక్కరే </span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
గురుచరణుడును, కృష్ణదాసును, నేనును శ్రీపాదులవారి సమక్షమున తెలియరాని ఆనంద పారవశ్యమున ఉంటిమి. గురుదత్తభట్టు అనెడి జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థము వచ్చియుండెను. శ్రీపాదుల వారు అతనిని ఎంతయో ఆదరించిరి. ఒకానొక ప్రశాంతస్థలమున కూర్చొని సత్సంగము చేయవలసినదిగా మమ్ములను ఆదేశించిరి. మా యొక్క సంభాషణ జ్యోతిషశాస్త్రము వైపునకు మరలినది. నేను శ్రీ భట్టు మహాశయుని, "అయ్యా! జ్యోతిషశాస్త్రము నందు చెప్పబడిన ఫలములు ఖచ్చితముగా జరుగునా ? లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా ? మానవ జీవితమూ పూర్వ కర్మ నిర్దేశితమా ?లేక మానవ ప్రయత్నా నిర్దేశితమా ?" అని ప్రశ్నించితిని. అంతట శ్రీ భట్టు మహాశయులు, " 'భ' చక్రమనగా నక్షత్రక కక్ష్య. దీని ప్రారంభ స్థానము అశ్వినీ నక్షత్రము. ఈ నక్షత్రము ఉండవలసిన స్థానమునకు 8 కళలు తక్కువ గల స్థానములో నుండుటచే అది గ్రాహ్యము కాదు. అశ్వినీ నక్షత్రగోళమును గుర్తించుట కష్టము గాన దానికి 180 అంశలలో నున్న చిత్తా నక్షత్రము ఒకే గోళముగాను, ప్రకాశవంతముగాను, స్ఫుటముగాను ఉండుటచే దానికి 6 రాసులు కలిపిన యెడల అది అశ్విని యగును గాన చైత్రపక్షము గ్రాహ్యమయినది. అశ్వినీ నక్షత్రము 'తురగ ముఖాశ్వినీ శ్రేణి' అని మూడు గోళములుగా నిరూపించబడినది. శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రములో జన్మించుటకు కూడా విశేషకారణమున్నది. మూడు గోళములు ఒకే నక్షత్రముగా నున్న అశ్విని కూడా వారి స్వరూపమే. అదియే 'భ' చక్రమునకు ప్రారంభము. అది వారి దత్తాత్రేయ స్వరూపము. కలియుగమున వారి ప్రప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. ఇది అశ్వినీ నక్షత్రమునకు సరిగా సరళ రేఖలో నుండు 180 అంశల దూరములో నుండు వారి జన్మనక్షత్రమైన చిత్తానక్షత్రము. 180 అంశల దూరములో ఏ నక్షత్రము యొక్క గాని, గ్రహము యొక్కగాని శక్తి కేంద్రీకరింపబడుచుండును. మానవులు వారి పూర్వజన్మకృత ప్రారబ్ధమునకు గణితపరముగా యోగ్యమయిన గ్రహసంపుటిలో జననమందెదరు. గ్రహములు మానవుల యెడల ప్రేమభావమును గాని, ద్వేషభావమును గాని కలిగియుండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు, వివిధ స్పందనలు ఆయా కాలములలో, ఆయా ప్రదేశములలో, ఆయా జీవులకు సంఘటనలను కలిగించుటకు సశక్చమై ఉండును. అనిష్ట ఫలముల బారి నుండి తప్పించుకొనుటకు, ఆ కిరణములను, స్పందనలను నిలువరించి నిర్జించగల స్పందనలను, కిరణములను మనము కలిగి యుండవలెను. దీనిని మంత్ర తంత్రముల వలన గాని, ధ్యానము, ప్రార్థన మొదలయిన విధానముల ద్వారా గాని, లేదా తన స్వకీయమయిన యోగశక్తి ద్వారా గాని సాధించగలము. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమై యున్న, పైన చెప్పిన విధానములు ఏమియునూ పనిచేయవు. అట్టి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతలను మార్చి వ్రాయగలరు. ఆ విధముగా వారు మార్చివ్రాయుటకు మన వలన యీ లోకమునకు ఏదయినా ఒక మంచి ప్రయోజనము ఒనగూడు పరిస్థితి ఉండి ఉండవలెను. సాధారణ పరిస్థితులలో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపములోను, కర్మదేవతల కార్యకలాపములోను శ్రీపాదుల వారు అనవసరముగా కలుగజేసుకొనరు. అయితే <b><span style="color: #674ea7;">భక్తుని ఆవేదన శ్రీవారిని కదలించును. శ్రీవారి హృదయము నుండి ఉప్పొంగిన ప్రేమ, కరుణ అను మహాప్రభావముల ధాటికి కర్మదేవతలయొక్క శక్తి నిర్వీర్యమయిపోవును. కర్మ జడమైనది. శ్రీపాదుల వారి చైతన్యస్వరూపులు. తనకి అవసరమని తోచినపుడు వారు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనాఘటన సమర్థతను ప్రదర్శింతురు. ఇది వారికి అత్యంత సహజమైన విషయము.</span></b>" అని వివరించిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను అజ్ఞానదశలో జ్యోతిషములో మహాపండితుడని భ్రమించెడివాడను. నేను కన్నడ దేశీయుడను. తెలుగుభాషను అంతబాగుగా మాట్లాడలేను. సంస్కృతమున ధారాళముగా వ్యవహరించగలను. నా అదృష్టవశమున నేను పీఠికాపురమునకు పోవుట తటస్థించెను. కర్ణాకర్ణిగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి వింటిని. మా కులదైవము దత్తాత్రేయులవారు. నేను పాదగయాక్షేత్రమున కుక్కుటేశ్వర దేవస్థానమందున్న స్వయంభూదత్తుని దర్శించితిని. భక్తిశ్రద్ధలతో వారిని అర్చించితిని. నేను ధ్యానములో కూర్చునియుండగా నాకు, "ఓరి! మూర్ఖుడా! నీవు చచ్చి ఎంతసేపయినది? నీవు నా భక్తుడనని బీరములు పలుకుచున్నావు? ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులు కొట్టుచున్నావు. పాదగయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తమును కళ్ళజూచుటకేనా యిచ్చటకు వచ్చినది? " అని అంతర్వాణి స్పష్టముగా వినిపించినది. ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగెను. నేను జ్యోతిషపండితుడనగుటచే నా జాతకమును లెక్క గట్టితిని. నేను ఏ రోజున ఎన్ని ఘడియలకు యీ శరీరమును వదిలివేయవలసి ఉన్నదో సరిగా అదే సమయమున పాదగయాక్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షమున నుంటిని. నేను నా నాడీ స్పందనమును చూచితిని. నాడి కొట్టుకొనుట లేదు. హృదయస్పందనమును చూచితిని. గుండె కూడా పని చేయుట లేదు. నా ముఖమును అద్దములో చూచుకొంటిని. దానిలో జీవకళకు బదులుగా ప్రేతకళ ఉట్టిపడుచుండెను. నేను నవ్వునప్పుడు నా ముఖమును అద్దములో చూచుకొంటిని. ఏమున్నది గర్వకారణము ? వికృతమైన ప్రేతకళతో చచ్చిపోయిన మనిషి పిశాచత్వము నొంది నవ్వుచున్నట్లుండెను. స్వయంభూదత్తుని ఆలయములోని పూజారి బహు ధనాశాపరుడు. అతని సూక్ష్మశరీరమును చూడగలిగితిని. నా కంటెను అత్యంత వికారకళలతో వాని సూక్ష్మ శరీరమున్నది. నాలో ఏ మూలనో దాగియున్న వివేకము మేల్కొనినది. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము చేసిన గాని నా దురవస్థ తొలగదని తెలిసికొంటిని. దేవతలు ఆనందమయ స్వరూపులు. వారిది హృదయ స్పందనము, నాడీ స్పందనము లేకపోయిననూ ఆనందముగా ఉండెడి ఉన్నత స్థితి. నా స్థితి చాల అధ్వాన్నముగా నున్నది. నా ఆత్మకు ఆనందము ఎంతమాత్రమూ లేదు. పైపెచ్చు దుఃఖభారముగా నున్నది. ఆత్మ శరీరమును వీడినపుడు శరీరబాధలంతరించును. అయితే నా ఆత్మ శరీరమును వీడలేదు. అయితే జీవించి ఉండవలసిన నిర్బంధస్థితిలో హృదయస్పందనను నిలుపుదల చేసి, "శిలగా నున్న స్వయంభూదత్తుడే ఘండికోట వారింట అవతారమెత్తెనంట. మరి శిలకు నాడీస్పందనము, హృదయ స్పందనము ఉండవు గదా ? మరి శ్రీపాదునికి నాడీస్పందనము, హృదయస్పందనము కలవు కదా? మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమపవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించెనట. వారే దత్తాత్రేయులట. ఆ మహాప్రభువే మల్లాది వారి ద్రౌహిత్రుడిగా జననమాయెనట. ఏమి విడ్డూరము! ఎంతటి దగా! ఎంతటి వంచన!" అని పరమ నికృష్ఠులు, పాపాత్ములు అయినవారు పలికెడి మాటలను విని, నేను ఎంతో మోసపోయి, ఫలితముగా అనర్ఘరత్నమైన శ్రీపాదుల వారిని పోగొట్టుకొనుచున్నాననెడి వింత పరిస్థితిని శ్రీ గురుదేవులు నాకు కల్పించిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను శ్రీపాదుల వారింటికి వేగముగా పరిగెత్తుకొనిపోయితిని. పది సంవత్సరముల వయసు గల శ్రీపాదుల వారు వీధిలోనికి వచ్చి, "రారా! భడవా! రా! బ్రతికి ఉన్నట్లుగా నటిస్తూ, చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చుదద్దమ్మలకు, మానవరూప పిశాచాలకు సద్గతులు కలిగించడం కోసం, మీరు చేసే అకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోరబాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం, అవధూత వేషధారియై మహాలయ అమావాస్యనాడు ఈ పవిత్ర గృహము నుండి భిక్ష యాచించడానికి వచ్చినది ఎవరో తెలుసా ? దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా ? నేనే! ఎవరి పేరు చెబితే రాక్షస పిశాచగణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడను నేనే! నిన్ను శిలగా మార్చాను గాని ఆకలిదప్పులను ఉంచాను. ప్రాణం తీశాను గాని బ్రతికున్నవాడిగా లోకానికి కనిపింపజేస్తున్నాను. నేను దత్తుడనో, కాదో అనునది తరువాత తేలుద్దాం. ముందు యీ విషయం చెప్పు. నువ్వు నిజంగా చచ్చినవాడివి. కావున బ్రతికి ఉన్నవాడుగా మోసం చేయవచ్చునా ?" అని నన్ను గద్దించి ప్రశ్నించుసరికి నేను గజ గజ వణికిపోతిని. ఇంతలో సుమతీ మహారాణి వీధిలోనికి వచ్చినది. ఆమె నన్ను చూచి భయపడిపోతూ, "కృష్ణ కన్నయ్యా! నిండుగా ప్రేతకళ ఉట్టిపడే యీ అఘోరీ ఎవ్వరు? నువ్వు లోపలికి రా! కాస్త దిష్టి తీసి వేసెదను." అని కేకలేసినది. అంతట శ్రీపాదులవారు "అమ్మా! ఇతడు అఘోరీ ఇంకా కాలేదు. అఘోరిగా శవాల్ని కాల్చుకుని తినే జన్మ రానున్నది. రాబోయే ఆ జన్మకు ముందుగా ఇపుడు ఇతడు నా వద్దకు వచ్చాడు. మన యింటిలో కాస్త చద్ది అన్నము ఏమయినా ఉంటే పెట్టు అమ్మా!" అని తల్లిని బ్రతిమిలాడిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదుల వారికోసం వారి జనని అఖండలక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి కొలదిగా చద్ది అన్నము అనగా తరవాణీ అన్నము అట్టే పెట్టినది. శ్రీపాదులవారు ఆ తరవాణీ అన్నమును నాకు పెట్టి తొందరగా ఆ స్థలమును వీడి పొమ్మనిరి. నేను కుక్కుటేశ్వరాలయమునకు ఎదురుగానుండు ఖాళీస్థలములో ఆ తరవాణీ అన్నమును తింటిని. తిన్న వెంటనే నాకున్న దురవస్థ సర్వస్వము తొలగిపోయినది. నేను మరల శ్రీపాదుల వారి దర్శనార్థము పోయితిని. అయితే శ్రేష్ఠిగారు శ్రీపాదులవారిని తమ యింటికి తీసుకొనిపోయిరి. శ్రీపాదులవారు శ్రేష్ఠిగారి పచారీ కొట్టునందుండిరి. వారు స్వయముగా వరహాలను తీసుకొని గల్లాపెట్టెలో వేయుచుండిరి. శ్రేష్ఠిగారు స్వయముగా జొన్నలను, బియ్యమును కొలచి యిచ్చుచుండిరి. శ్రీపాదులవారు, తాతా! ఈ రోజు దస్త్రము కదా! నాన్నగారికి ఎంత దక్షిణ ? నాకెంత దక్షిణ? అని శ్రేష్ఠిగారిని అడిగిరి. అంతట శ్రేష్ఠిగారు, "కన్నయ్యా! నన్నగారికిచ్చెడిది పండిత బహుమానము. నీకిచ్చెడిది వేంకటేశ్వరస్వామి వారి ముడుపు. మనిద్దరికీ బేరసారములు లేవు. నీకు కావలసినది నీవు తీసుకొనవచ్చును. నాకు కావలసినది నీవు యీయవలెను." అని శ్రీపాదులతో ముచ్చటించిరి. ఆ దృశ్యము ఎంత మనోహరము? శ్రీపాదుల వారు కొంచెము బెల్లంముక్క తీసుకొని నోటిలో వేసుకొనిరి. ఒక బెల్లంముక్క నాకు ప్రసాదముగా యిచ్చిరి. తాతా! నేను చేయించెడి గణేశపూజ అయిపోయినది. గణేశుడు బెల్లంముక్క నైవేద్యమును నోటిలో కూడా వేసుకొన్నాడు. నీకు రుజువు కావలెనన్న నా నోరు చూడుము, అని తన వాదన గహ్వరమును చూపించెను. దానిలో శ్రేష్ఠిగారు ఏ మహాదృశ్యములను చూచిరో మనకు తెలియదు గాని కొంత సమయమైన తరువాత శ్రేష్ఠిగారు, "బంగారుకన్నా! గణేశునికి ఆకలయినపుడు మనల్ని అడుగకుండగనే తనకి కావలసినంత బెల్లమును నైవేద్యముగా స్వీకరించవచ్చును." అని చెప్పుమని శ్రీపాదులవారితో అనిరి. ఇంతలో అఖండలక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగన స్నానము చేయించుటకు తీసుకొని వెళ్ళినది. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(ఇంకా ఉంది.)</div>
<div style="text-align: justify;">
</div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-33992965000507087062014-06-22T17:22:00.004-04:002014-06-22T17:22:36.662-04:00Chapter 21 Part 3 (Last Part)<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange; font-size: large;">అధ్యాయము 21 భాగము-3</span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాదులు షోడశ కళాప్రపూర్ణులు</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాయనా! శంకరభట్టూ! ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినపుడు ఒక్కొక్క శకలము శూన్యమే కదా అగునది. ఇటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే గదా పరిమితమయిన ఆకారము కలుగునది. అందువలన శివకేశవులిరువురును అభిన్నులని ఎరుగుము. దశాంశాభాగహారము నందు పదింటిచే భాగింపగా మిగిలిన ఆరు దశాంశల నుండి, అయిదు దశాంశాంకల మొత్తము విష్ణుప్రతీకగా గ్రహింపబడినది. పంచభూతాత్మకమయిన సృష్టి అంతయునూ విష్ణుస్వరూపముగా భావింపబడినది. దక్షయజ్ఞమును విధ్వంసము చేసిన వీరభద్రునితో, "మూలప్రకృతి ఈశ్వరునకు భోగము నిమిత్తము పార్వతిరూపముగాను, రాక్షసయుద్ధ సమయమున దుర్గారూపము గాను, కోపావస్థలో కాళికాదేవి రూపముగాను, పురుషవేషమున నా వీరభద్రుని రూపముగాను ఉన్నది. శ్రీపాదుల వారు షోడశకళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశ్యమిదియే!" అని విష్ణువు చెప్పెను. 16 సంవత్సరముల వయస్సులోనే వారు పీఠికాపురమును వదలి వెళ్లిపోయిరి. వారు బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపులగుటచే వారిని షోడశ కళాప్రపూర్ణులుగా తెలిసికొనవలెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">దేవతల వివిధ స్వరూపములు</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ప్రకృతి విష్ణుస్వరూపమగుటచే అయిదు దశాంశలు విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశరూపుడాయెను. కారణము సుస్పష్టమే! చేతనస్వరూపుడయిన శివుడు ప్రధానుడు. మిధ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశరూపుడు. ఇట్టి దశాంశరూపబ్రహ్మకు ఏకాంకము ప్రతీకము. ఇటువంటి ఏకాంకము రెండు మొదలుకొని తొమ్మిది వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించియున్నది. అందుచేత బ్రహ్మకు నవప్రజాపతి స్వరూపము సిద్ధించెను. పదహారు, నూరు, వెయ్యి అనెడి మూడు పదములలో చివర రెండు పదములు ముక్తానుబంధరీతిగా గణింపబడి 116, 1116 అనెడి రూపము నందినవి. వీటిని పదిచే భాగించిన యెడల సృష్టి యందలి వివిధ వస్తుసముదాయములు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 11 అను రెండు పూర్ణాంకములు, బ్రహ్మకు 111 అను మూడు పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు. త్రిదక్షిణము దానము చేయువారికి బ్రహ్మజ్ఞానము కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణము దానము చేయుట వలన శరీరము, ధనము, మనస్సు అను మూడింటిని దానము చేసినవాడగును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యమగు ద్రవ్యమును దానము చేయుట గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది. పిండాండదానము జగత్తునకు ప్రతీకము. మన శరీరము సవనత్రయమే రూపముగా గలది. ప్రాతస్సవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అనునది గాయత్రీ - త్రిష్టుప్ - జగతీ ఛందస్సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24, త్రిష్టుప్ నకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన యీ పిండాండదానము (శరీర దానము) వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్య దానఫలము లభించును.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">సవితృ కాఠక చయన ఫలితమే శ్రీపాదుల అవతారము</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
సర్వబుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించునది సవితృమండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు. అదే గాయత్రీమాత. ఆమె 24 కు ప్రతీక. 9 అనునది బ్రహ్మ స్వరూపము. 8 అనునది మాయా స్వరూపము. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృకాఠక చయనము చేయుట వలన ఆనాడు యిచ్చిన వాగ్దానము ప్రకారము ఈనాడు పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఆవిర్భవించినది. శక్తి స్వరూపమును, శాక్త స్వరూపమును అర్థనారీశ్వరము నొంది జీవుల యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మమార్గమున ప్రవేశపెట్టుటకు వచ్చిన మహావతారమే తానని తెలియజేస్తూ 'దో చౌపాతీ దేవ్ లక్ష్మి' అని భిక్షనడిగిరి. వారి వాక్కులకు, లీలలకు, బోధనాపద్ధతులకు ఉన్న వ్యాకరణమును ఎవరునూ ఎరుగజాలరు. ఈ నవ్య వ్యాకరణమునకు వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణము. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
కృష్ణదాసు వలన నేను ఎన్నియో విషయములను వింటిని. మరెన్నో క్రొత్త సంగతులను తెలిసికొంటిని. పాండిత్య జనిత అహంకారము కలిగిన వారు ఎంత మాత్రమూ శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలరు. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
కృష్ణదాసు యిట్లు చెప్పనారంభించెను. "శ్రీపాదులవారు పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపించి యున్నారు. ఒకసారి నరసింహవర్మ గారి పొలములో శ్రీపాదులవారితో వర్మగారు విశ్రాంతి తీసుకొనుచుండిరి. అచ్చటకు ఎన్నో త్రాచుపాములు వచ్చినవి. శ్రీపాదులవారు విచిత్రముగా ప్రతీ త్రాచుపామునకు దాని మొండెము నుండి తలను విడదీసిరి. వాటినన్నిటినీ గుట్టలు గుట్టలుగా ప్రక్కకు వేచిరి. చాలా పెద్ద చీమలు, యిదివరకు ఎవరూ కనీ విని ఎరుగనివి అక్కడకు చేరినవి. వర్మగారు నిద్రావస్థలో నున్నారు. వారికి నిద్రాభంగము కలుగకూడదని ఆ చీమల నన్నిటినీ శ్రీపాదుల వారు చంపి వేసిరి. ఇంతలో వర్మగారు మేల్కాంచిరి. చచ్చి పడియున్న చీమలను చూసి జాలిపడిరి. శ్రీపాదుల వారు చిరునవ్వుతో యిట్లనిరి. "రాజు తన సేవకుని రక్షించి తీరవలెను. ఇది ప్రకృతిలోని నియమము. ఈ విచిత్ర పిపీలికములకు వింతరాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వచ్చుచున్నాడు చూడమనిరి." ఇంతలో వింతకాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చినది. అది ఆ చీమలన్నింటికీ ప్రదక్షిణము చేసినది. వెంటనే ఆ చీమలన్నియునూ బ్రతికినవి. శ్రీపాదుల వారు మందహాసముతో, "ఈ చీమలరాజునకు సంజీవినీ శక్తి ఉన్నది. ఆ శక్తితో తన వారిని అది రక్షించుకొన్నది. ఇటువంటి వింతవింతలు యీ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాతా! నీవు కోరితే ప్రతీ క్షణక్షణము ఈ రకమయిన లీలలను ఎన్నయినా చూపగలను." అనిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిపడి ఉన్న నాగుబాములను చూసి ఆశ్చర్యము నొందిరి. ఇది కూడా శ్రీపాదుల వారి పనేనని గమనించిరి. అంతట శ్రీపాదుల వారు ఒక నాగుబాము మొండెమునకు వేరొక నాగుబాము తలను చేర్చి తమ దివ్యహస్తములతో నిమిరిరి. వెంటనే అవి పునరుజ్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణము చేసి వెడలిపోయినవి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఆ నాగుబాములు ఎందుకు వచ్చినవో, వాటికి శ్రీపాదుల వారు ఎందుకు అట్లు చేసిరో ఎవరికెరుక ? ఈ విషయమును నేను శ్రీపాదుల వారినడిగినపుడు యిట్లనిరి. "రాహుగ్రహబలం చాలనపుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకములు ఎదురయి కొండచిలువ బంధములలో ఉన్నట్లు అనుభవమగును. దీనినే కొంతమంది కాలసర్పయోగమందురు. రాహువు సర్పములకు అధిదేవత. ఆ రకములయిన ఆటంకములను కలుగజేయు సర్పములు మన కళ్ళకి కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును యీ రకంగా పరిహరించి నా భక్తులకు సుఖసంతోషములను కలుగజేయుచుంటిని."</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మేము కురుంగడ్డకు క్షేమముగా చేరుకొంటిమి. శ్రీపాదుల వారు మమ్ములను చిరునవ్వుతో ఆశీర్వదించిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(అధ్యాయము 21 సమాప్తం) </div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-36980869058678637832014-06-19T02:42:00.003-04:002014-06-19T02:42:43.050-04:00Chapter 21 Part 2<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange;">అధ్యాయము 21 భాగము 2</span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;"><br /></span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట</span></b></div>
<div style="text-align: center;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d;">మోహము నశించుటతో మోక్షము</span></b></div>
<div style="text-align: center;">
<br /></div>
<div style="text-align: justify;">
పీఠికాపురములో అబ్బన్న అనునతడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచూ జీవించుచుండెడివాడు. నాగస్వరమును ఊదుకొనుచూ అతడు బాపనార్యుల యింటికి వచ్చెను. శ్రీపాదులవారు వేదఘోషను ఆపుచేయమనిరి. అబ్బన్నకు కడుపునిండుగా అన్నము పెట్టబడెను. శ్రీపాదులవారు అబ్బన్నను పిలిచి, "ఓయీ! ఇచ్చట నుండి నీ ముంత నిండుగా జలమును తీసుకొని కుక్కుటేశ్వరాలయమునకు పొమ్ము. దత్తప్రభువు యొక్క అవతారము కరచరణాద్యవయవములతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురమున సంచరించుచుండగా, అకారణ నిందచేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయమున నున్నారు. వారికి చిత్రగుప్తులు వారు మరణానంతరము పిశాచజన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాపపరిహార ఉపాయము చేయుచున్నాను. భూమాత కూడా అనుగ్రహించినది. నీవు అచ్చటికి వెళ్లి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనమునకు రాదలచినవారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలము ప్రోక్షింపవలసినది. చాటింపువేసిన మాదిగ సుబ్బయ్య యింటికి వెళ్ళి వానిని తోడ్కొని వాని ముంతలోని పెరుగు అన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినది." అనిరి. అబ్బన్నయునూ, సుబ్బయ్యయునూ అచటికి వెళ్లి, వారందరిని బాపనార్యుల యింటికి తీసుకొనివచ్చిరి. శ్రీపాదులవారు ఉగ్రస్వరూపమున, "ఓయీ! దండిస్వామినని ఎంత గర్వించితివి? నీవు ఆరాధించు దత్తుడే యిక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరుంగలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అనునట్లు నీకు తోడుగా శిష్యగణమొకటి. పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణమొకటి. నీవు నన్ను ఏమి చేయగలవు? సమస్త సృష్టినీ శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వమెంత? నీ సామర్థ్యమెంత? దైవదూషణ చేయుటవలన నీకూ, నిన్నాశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకొన్నది. మిమ్ములనందరిని కొన్ని వందల సంవత్సరములు పిశాచజన్మలో ఉండవలసినదిగా చిత్రగుప్తులవారు నిర్ణయించిరి. అవ్యాజకరుణతో నేను దానిని రద్దుపరచితిని. మానవజన్మకు వచ్చినపుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి కడగండ్లు పడవలెనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించితిని. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశ్యమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదములకు దారితీయును. నా మాయయునూ, నేనునూ అభిన్నస్వరూపులమై ఉండగా మోక్షమనునది ఏమో ఆలోచించుము. మోహము క్షయమగుటయే మోక్షము. ఏ జీవుడయినా సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలెనని కోరిన యెడల, వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహింతును. దివ్యానంద పారవశ్యముతో మాయకు అతీతముగా సుఖస్వరూపముగా ఉండవలెనని కోరిన, అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు, సగుణ సాకారమునక, మోక్షమునకు, బంధనమునకూ వ్యత్యాసమేమి యుండును. ప్రతీ క్షణముననూ అసంఖ్యాకములయిన నూతన లోకములు సృష్టి, స్థితి లయముల నొందుచుండును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు గాని, ఉన్నత ఆనందభూమికలకు గాని, పరిమితి గాని, హద్దులు గాని లేవు. మరణానంతరము నా వద్ద రాగోరువారు తప్పక రాగలరు. వారు ఎన్ని వందల దివ్య వర్షములు ఆయా స్థితులలో ఉండవలెనో, ఏయే లోకములకు తిరిగి పంపబడవలెనో, నా సంకల్పము నిర్ణయించును. కపటనాటక సూత్రధారినయిన నేను ప్రస్తుతము నరాకారముగా మీముందున్నాను. మీరు నన్ను చూచుచున్నారు. ఈ ఆకారము లేనిస్థితిలో కూడా నేను మిమ్ములను సదా చూచుచునే యుందునని తెలియజేయుటకు మాత్రమే నరాకారములో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగి వచ్చినది. మహా యోగుల యొక్క యోగశక్తులన్నియునూ లోకకళ్యాణము కొరకే వినియోగింపబడవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు. <span style="color: #674ea7;"><b>నీ కంటే తక్కువ స్థితిలో నున్న నిస్సహాయ జీవులకు సహాయము చేయుట నీ ధర్మము.</b></span> నేను ధర్మమార్గమును, కర్మమార్గమును, యోగమార్గమును, భక్తిమార్గమును, జ్ఞానమార్గమును బోధించుటకే అవతరించునది. నేను సర్వసత్యములకునూ మూలమైన ఏకైక సత్యమును, సర్వధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును. సర్వకారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పములో లేనిది యీ సృష్టిలో కానరాదు. నేను లేనిదే యీ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు. సృష్టి యున్నది. ఇంతకంటే సత్యమును ఏ విధముగా తెలుపమందువు? నీవు హిమాలయములకు పోయి నిస్సంగుడవై తపమాచరింపుము. శిష్య జంఝాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయిననూ, ఉద్ధరింపబడక పోయిననూ సృష్టికి గాని, నాకు గాని కలిగెడి నష్టమేమియునూ లేదు. సృష్టిలోని కార్యక్రమములు యధావిధిగా నిర్వర్తింపబడుచునేయుండును. ఇదీ అసలు ఉన్న విషయము. పీఠికాపురమున నూతనముగా ఏర్పడిన శిష్యగణము నీకు తోడుగా కదలి వచ్చుట, ఒంటెల వివాహమునకు గాడిదల సంగీత కచేరి వలె నున్నది. ఒంటెల అందమును గాడిదలు పొగడుచుండగా, గాడిదల సంగీత మాధుర్యమును ఒంటెలు పొగడుచున్నవి. పరస్పరము యీ విధముగా ప్రశంసించుకొన్ననూ యదార్థము మాత్రము వేరుగా నున్నది." అని హితబోధ చేసిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d;">అరుంధతి వశిష్టుల సంబంధము</span> </b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అరుంధతీ మాత ఛండాలవంశము నందు జన్మించెనని వింటిని. అట్లయిన ఆమెను వశిష్టమహర్షి ఎట్లు పెండ్లాడెనని నేను గురుచరణుని అడిగితిని. అపుడు గురుచరణుడు, "పూర్వము వశిష్ఠుడు వేయి సంవత్సరములు తపమాచరించెను. ఆ సమయమున అక్షమాల అను ఒక ఛండాలకన్యక వశిష్ఠునకు తాను చేయుటకర్హమైననట్టి ఉపచారములను చేసెను. సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదయినా కోరుకొనమనగా ఆమె వశిష్ఠుల వారినే భర్తగా కోరుకొనెను. నేను బ్రాహ్మణుడను. నీవు ఛండాలజాతి స్త్రీవి. మన యిద్దరికి భార్యాభర్తల సంబంధము ఎట్లు యోగ్యమయినది అగును ? అని వశిష్ఠుడు ప్రశ్నించగా, వరమును కోరుకొమ్మంటివి, కోరితిని. వరమిచ్చిననిమ్ము, లేనియెడల నేను మరలిపోవుటకు అనుజ్ఞనిమ్ము అని ఆమె అనెను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి, అట్లయినచో నీ దేహమును నా యిష్టానుసారము చేసుకొనుట నీకు సమ్మతమేనా? అని ఆమెనడిగెను. ఆమె వల్లెయనెను. ఆ మహర్షి ఆమెను భస్మముగా చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు ఏడు పర్యాయములు చేసెను. ఏడవ జన్మలో ఛండాలజాతి దోషమంతయునూ హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలాయెను. అంతట వశిష్ఠుడు ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలో ఇసుమంత పనిని కూడా వద్దని అడ్డు పెట్టలేదు గనుక ఆమె అరుంధతి యను పేరుతో ప్రసిద్ధి నొందెను. ఈ విషయమును ప్రసంగ వశమున వశిష్ఠ గోత్రోద్భవులయిన నరసింహవర్మతో శ్రీపాదులు సెలవిచ్చిరి. శూద్ర క్షేత్రము నందు బ్రాహ్మణుని వలన పుట్టినవానికి 7వ జన్మలో ఉపనయనమును చేసి బ్రాహ్మణజాతిలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారును వారి వారి గుణ కర్మ విభాగములననుసరించి నడుచుకొనుట శ్రేయస్కరము. <span style="color: #674ea7;"><b>బ్రాహ్మణుడు తానాచరించెడి దుష్కర్మల వలన క్రమశః పతనము నొంది శూద్రుడవవచ్చును. శూద్రుడు సత్కర్మాచరణ వలన క్రమశః ఉన్నతిని పొంది బ్రాహ్మణుడవవచ్చును. అయితే దత్తప్రభువు నందు అచంచల విశ్వాసము నుంచువారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారము శీఘ్రముగా పొందగలుగుదురు. తన భక్తుడు ఏ కులములో జన్మించిననూ, ఏ పరిస్థితులలో ఉండిననూ సుఖమయ జీవితమునకు కావలసిన ఆయురారోగ్యఐశ్వర్యములను పొందునట్లు దత్త ప్రభువు అనుగ్రహించగలరు. జన్మజన్మల కర్మబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల."</b></span> అని వివరించెను. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d;">దత్తభక్తులకు శ్రీపాదుల వారి అభయము </span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మేము శ్రీపాదుల వారి మహిమా విశేషములను పరస్పరము తెలియజేసుకొనుచూ మాంచాల గ్రామమును చేరితిమి. మాంచాల గ్రామదేవత మాకు దివ్యదర్శనమిచ్చి, మమ్ము తరింపజేసి, తన దివ్యహస్తములతో మా చేత ప్రసాదమును తినిపించి, "పూర్వము ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నున్నారు. శ్రీపాదుల వారి సంకల్పము అనూహ్యము. రాబోయే శతాబ్దములలో ప్రహ్లాదుడు గురుసార్వభౌముడుగా అవతరించుననియూ, యీ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియూ, శ్రీపాదుల వారే స్వయముగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యమూ తుంగభద్రాజలమును స్వీకరించువారు. మీకు శుభము కల్గును గాక." అని చెప్పుచూ ఆమె పూర్వరూపము లోనికి మారిపోయినది. మేము అచ్చట నుండి కదలబోవు సమయములో కృష్ణదాసు అను మాలదాసరియొకడు వచ్చెను. మాంచాల గ్రామదేవత కృష్ణదాసునకు కూడా ప్రసాదము పెట్టి పుష్పమాలికను ఒక దానిని తన అనుగ్రహ సూచకముగా నిచ్చి కురుంగడ్డకు ప్రయాణము కావలసినదని చెప్పెను. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మేము ముగ్గురమూ కురుంగడ్డకు ప్రయాణమైతిమి. దత్తభక్తులందరిదీ ఒకే కులము. వారికి దత్త ప్రభువుల ప్రసాదము ఏ కులము వారు సమర్పించిననూ అది స్వీకరీయమైనదే. మాతో పాటు కృష్ణదాసు చేరికతో నూతనోత్సాహములు కలిగెను. ప్రసంగవశమున కృష్ణదాసు, "యజ్ఞాదికర్మలలో నిచ్చెడి దక్షిణలకు 16, 116, 1116 అనెడి సంఖ్యాభేదములు ఎందున్నవో తెలిసిన యెడల శ్రీపాదులవారి సంఖ్య అయిన 2498 అను దానికి బోధపడగలదు. " అని చెప్పెను. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఆత్మయందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధముగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహసమయమందు వరుడు అగ్నిహోత్రుని ప్రార్థించుచూ, "ఓ అగ్నిహోత్రుడా! నీవు నాకు యీ వధువునందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము." అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా పదిమంది పిల్లల వరకూ కనుట ధర్మసమ్మతమే. ఆ తరువాత తన భార్యను తల్లిగా భావింపవలెను. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలియవలెను. దశాంశరూపులగు 10 మంది కలసిన పూర్ణాంకరూపుడగు తండ్రి అగుచున్నాడు. శివుడు ఆత్మరూపుడగుటచే పరిపూర్ణుడు. కావున దశాంశల రూపుడు 16 దశాంశలను పది సంఖ్యచే భాగించగా పూర్ణాంకము అనగా 1 అనునది శివప్రతీకముగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపము కలిగిన మూలప్రకృతిరూపుడు. ప్రకృతి అనునది పురుషునిలో అర్థభాగమే కదా! అందుచేత పదిలో సగము అయిదగుటచే మనకు శేషముగా వచ్చి ఆరును అయిదుచే భాగించగా విష్ణువు ప్రతీకముగా 1 పూర్ణాంకముగా వచ్చినది. అయితే శేషముగా 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతానరూపుడైన, బ్రహ్మ వారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషముగా మిగిలిన 1 ని 1 చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు 1 పూర్ణాంకము ఫలముగా వచ్చెను. శేషము ఏమియునూ మిగులలేదు. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
పూర్ణము అనగా సున్న అనునది నిర్గుణము కనుక అది రుద్రస్వరూపము సమస్తమునూ లయించినపుడు మహాశూన్యమే కదా విద్యమానమగునది. మహాశూన్యము నందు మాత్రమే సమస్తమును లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపము అనునది అనంతత్వ ధర్మమును కలిగియున్నది. సృష్టి యొక్క స్థితి స్వభావము నందు అనంతత్వము అనివార్యము. </div>
<br />
(ఇంకా ఉంది ..) </div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-14204001477157959462014-06-18T20:48:00.001-04:002014-06-19T02:42:57.025-04:00Chapter 21 Part 1<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: #e69138;">అధ్యాయము 21 భాగము 1 </span></b><br />
<b><span style="color: #e69138;"><br /></span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట</span></b></div>
<div style="text-align: center;">
<b><br /></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d;">సాధకులకు స్థానశుద్ధి, భావశుద్ధి ఆవశ్యము</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞమేరకు గురుచరణునితో కలసి మాంచాల గ్రామదర్శనమునకు బయలుదేరితిని. దారి మద్యములో శ్రీపాదుల వారి లీలలను గూర్చి ముచ్చటించుకొంటిమి. ఆధ్యాత్మవిద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుల నుండి తెలిసికొంటిని. గురుచరణునితో, "అయ్యా! వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చెదరని శ్రీపాదులవారు అంటిరి గదా! ఆ మహాభాగ్యుడెవరు ? అతడు ఏ కాలములో వచ్చువాడని" నేను ప్రశ్నించితిని. అంతట గురుచరణుడిట్లనియె! అయ్యా! శంకరభట్టు! అనేక శతాబ్దముల తరువాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానమేర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పము. దివ్యసంకల్పము వలన గాక మహాతపస్వులు అరుదెంచవీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్ఛారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానము వలన అచ్చట నున్న వాయుమండలము పరిశుద్ధము కావింపబడును. విశ్వాంతరాళము నందలి దిశదిశల నుండియూ భావతరంగములు ఎల్లప్పుడునూ ప్రసరించుచునే యుండును. పవిత్రభావము కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావము కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశమునందలి వాయుమండలమందుండు భావతరంగములు ప్రబలశక్తి సంపన్నములయినపుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసినది లేదు. ఒకానొక ప్రదేశము నందు దుష్టములైన భావతరంగములున్న యెడల దుష్ట పురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశములందు నివసింపవలెను. భావశుద్ధి కలిగినవాడుగా నుండవలెను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగియుండవలెను. ద్రవ్యశుద్ధి గలవారి నుండి మాత్రమే ధనమును గాని, అన్నమును గాని స్వీకరింపవలెను. వేదవేదాంతములందు మహాపండితుల మనుకొనువారు ఎందరో శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలకపోయిరి. కల్మషరహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతులు వారివలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓఢ్రదేశమునందలి జగన్నాథపూరీ మహాక్షేత్రమునకు వ్యాపారము నిమిత్తము పోయితిని. అచ్చట నేను జగన్నాధునకు బదులు శ్రీపాదులవారిని దర్శించితిని. నాతోబాటు ముగ్గురు నలుగురు శ్రీపాదభక్తులుండిరి. వారికి తమ యిష్టదేవతారూపములో దర్శనమిచ్చి, వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీదేవతా రూపములును తామేనని మౌనముగా బోధించిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d;">దండిస్వామికి గర్వభంగము</span></b></div>
<div style="text-align: center;">
<br /></div>
<div style="text-align: justify;">
అయితే మేము వెళ్ళిన రోజుననే దండిస్వామి యొకడు తన 108 మంది శిష్యులతో అచ్చటికి వచ్చెను. ఎవరయినా మహాత్ములు తటస్థించినపుడు వారి పాదములకు నమస్కరించుట మా అలవాటు. మేము దండిస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయెను. శ్రీపాద శ్రీవల్లభా! మహాప్రభూ! ఈ దండిస్వామికి తిరిగి నోరు వచ్చునట్లు చేయవలసినదని మేము ప్రార్థించితిమి. ఆ వెంటనే దండిస్వామికి నోరువచ్చినది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిసిన తరువాత వారు కుతర్కముతో "శ్రీపాదుడనెడి వాడు ఎవరో క్షుద్ర మాంత్రికుడు. వాని శిష్యులయిన వీరు కూడా క్షుద్ర మాంత్రికులే! తమ క్షుద్ర విద్యతో మా దండిస్వామికి నోరు పడిపోయినట్లు చేసిననూ, మా స్వాముల వారు మహాశక్తిమంతులు గనుక తిరిగి స్వస్థతను పొందిరి. మా మహాస్వాములు పీఠికాపురమునకు విచ్చేసి మీ శ్రీపాదుని బండారమును బయటపెట్టెదరు. శ్రీపాదుని మట్టికరిపించి విజయపత్రికను గైకొందురు. పీఠికాపుర గ్రామప్రజలు మా స్వామివారికి బ్రహ్మరథము పట్టెదరు." అని మాతో వాదించిరి. మేము నిరుత్తరులమయితిమి. <b><span style="color: #674ea7;">శ్రీపాదులవారి లీలావిధానములో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితులలో పడవేసి, వాడు శరణు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్త రక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించునదియును వారే! దానికి పరిష్కారమును చూపి ఆదుకొనువారును వారే! ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యము.</span></b> కొలది దినముల తరువాత దండిస్వాములవారు పీఠికాపురమునకు వచ్చిరి. నా భాగ్య విశేషమున అదే సమయములో నేను కూడా మార్గమధ్యమములోని పీఠికాపురమునకు వచ్చితిని. శ్రీ బాపనార్యులవారి యందుననూ, శ్రీ అప్పలరాజుశర్మ వారి యందుననూ, శ్రీపాదుల వారి యందుననూ ద్వేషభావమును విషముజిమ్ము స్వభావమును కలిగినవారు పీఠికాపురమునందు తక్కువేమీ కాదు. దండిస్వాముల వారు కుక్కుటేశ్వరాలయము నందలి దేవీదేవతలను దర్శించిరి. స్వయంభూదత్తుని కూడా దర్శించిరి. దండిస్వాములు, "ఇచ్చటనున్న స్వయంభూదత్తుని మహిమ అపారము. తనయొక్క అవతారమని చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వమణచుటకు స్వయంభూదత్తుడు నన్ను సాధనముగా చేసికొనెను. ఈ రోజు నుండి పీఠికాపురమునకు మంచిరోజులు వచ్చినవి. మీరు నిశ్చింతగా నుండుడు." అని పలికెను. ఈ విధముగా పలికి విభూతి, కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్పశక్తితో సృష్టించి తన ఆశ్రితులకిచ్చిరి. పీఠికాపుర బ్రాహ్మణ్యము వేదమంత్రఘోషతో దండిస్వామి వారిని ఊరిలోనికి తీసుకొనివచ్చుటకు కుక్కుటేశ్వరస్వామి దేవాలయమునకు పోయిరి. "తానూ స్వయముగా దత్తావతారమని పేర్కొనుచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండిస్వామికి సాష్టాంగమొనర్పవలెను. బాపనార్యుల వారు స్వయముగా దండిస్వామి ఎదుట హాజరయి క్షమాపణ చెప్పుకోవలయును. అప్పలరాజశర్మ గారు దండిస్వామి ఎదుట హాజరయి తానూ పరంపరాగతముగా అర్చించే కాలాగ్నిశమనదత్తుని విగ్రహమును దండిస్వామికి అప్పగించి స్వాములవారు విధించు శిక్షకు పాత్రులు కావలెను." అని ఊరంతయునూ చాటింపు వేయబడెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యమున ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైనది. ఎట్టి పరిస్థితులలోను, దండిస్వామికి శ్రీపాదులవారు గాని, అప్పలరాజు శర్మగారు గాని, బాపనార్యులు గాని తలవంచరాదనియు ఇటువంటి అకృత్యములకు మద్దతునీయరాదనియు తీర్మానించిరి. నరసింహవర్మగారి అధ్యక్షతను జరిగిన క్షత్రియమహాసభయు యీ విధముగనే తీర్మానించిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదుల వారు తమ మాతామహ గృహమున ఔదుంబర వృక్షచ్ఛాయలో విశ్రమించిరి. దివ్యకాంతులను వెదజల్లు వారి మోమును పరికించి శ్రేష్ఠి గారు దుఃఖభారమున కన్నీరు కార్చుచుండిరి. నరసింహవర్మగారును, శ్రేష్ఠిగారును, బాపనార్యులవారును మౌనముగా శ్రీపాదుల వారి వద్దనే కూర్చొనియుండిరి. అప్పలరాజుశర్మ చేష్టలుడిగి వెఱ్రివానివలె కూర్చొండెను. శ్రీకృష్ణ సదృశ్యు లయిన శ్రీపాదుల వారు నిద్ర మేల్కాంచి, తనకు ఆకలిగా నున్నదనియూ, పెరుగు అన్నము తినెదననియూ చెప్పిరి. వారి అమ్మమ్మ రాజమాంబ వెండిగిన్నెలో పెరుగు అన్నమును కలిపి తీసుకొని వచ్చినది. శ్రీవారు ఎంతో ఆత్రముగా దానిని భుజించిరి. శ్రీపాదుల వారు తమ తాతగారిని వేదఘోష చేయమనిరి. అప్పలరాజుశర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొనెను. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండిరి. నరసింహవర్మయునూ, శ్రేష్ఠిగారును మహానందముతో సుశ్రావ్యముగా నున్న ఆ పవిత్రవేద ఋచలను ఆలకించుచుండిరి. అచ్చటనున్న వాతావరణమంతయును పవిత్ర ఋష్యాశ్రమమువలె నుండెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
కుక్కుటేశ్వరాలయము నందలి స్వయంభూదత్తుని ముఖముపై పెరుగు అన్నపుముద్దలు కనిపించెను. పూజారి వాటిని తుడిచివేయగా అవి తిరిగి ఉద్భవమగుచుండెను. స్వయంభూదత్తుని విగ్రహము యిటువంటి లీల ప్రదర్శించుట వింతగా నుండెను. దండిస్వామి తన శిష్యులతోను, పీఠికాపురమునందలి తన నూతన శిష్యులతోను వేదఘోషతో అచ్చటినుండి బయలుదేరెను.వారు అడుగు తీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లు కనపించుచుండెను. చూపరులకు మాత్రము వారు కాళ్ళను కదుపుచూ, ముందుకు మాత్రముపోజాలక అచ్చటనే యున్నట్లు కనుపించుచుండెను. ఈ విధమయిన విచిత్ర విన్యాసముతో ఎన్నియో ఘడియలు గతించుచుండెను. అందరునూ యీ వింతను చూచి ఆశ్చర్య చకితులగుచుండిరి. ఇంతలో దండిస్వామి వద్ద నున్న బ్రహ్మ దండము రెండుగా ముక్కలయ్యెను. దండిస్వామికి వెన్ను రెండు ముక్కలయినట్లు తోచి నేలమీద చతికిలపడెను. పీఠికాపురవాసులకు యీ సంఘటన భయభ్రాంతులను కలిగించెను. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి కలవారనియూ, శ్రీపాదుల వారితో విరోధించిన అనర్థములు జరుగగలవనియూ వారికి తోచెను. అయితే ఆ ప్రదేశమును వదలి యింటిపట్టునకు ఏ విధముగా చేరుటయో తెలియరాకుండెను. </div>
<br />
(ఇంకా ఉంది.. ) </div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-20907088870108497862014-06-15T12:32:00.003-04:002014-06-15T12:32:57.554-04:00chapter 20 part 3(Last part)<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="color: #cc0000; font-size: large;"><b>అధ్యాయము 20 భాగము 3</b></span></div>
<div style="text-align: center;">
<span style="color: orange; font-size: large;"><b>విస్సావధాన్ల వృత్తాంతము</b></span></div>
<div style="text-align: center;">
<span style="font-size: large;"><br /></span></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;"><b>శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు. అన్నింటికి మూలము శ్రీపాదుడు</b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
తాతగారి నోటివెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధమనోహరముగా నవ్వి, "తాతా! ఇప్పుడే మీ కండ్ల ఎదురగనే ముండ్లచెట్టునకు సద్గతిని కలిగించితిని. నేను చేయు పనులకు శాస్త్రప్రమాణము ఉన్నదా? అనెడి విచికిత్స అనవసరము. నేను అన్ని యోగభూమికలందుననూ ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయినవాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనునది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టియందంతటను ఒకే భగవచ్చైతన్యమున్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమైయున్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమనునది అనుభవమున ఉన్నది. ఈ కాలమనునది సూర్యచంద్రాది ఖగోళములవలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయజ్ఞానము ఏకకాలముననే అనుభవములో గల వారు అత్రిమహర్షి. ఈ సృష్టి యందు అనసూయా తత్త్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణశరీరములు. భూత భవిష్యద్వర్తమానములు మొదలయిన సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. కావున నాది నిత్య వర్తమానము. జరిగినది, జరుగుచున్నది, జరుగబోవునది అంతయునూ ఏకకాలముననే అనుభవము, అట్టి స్థితియందు త్రిమూర్తులును, త్రిశక్తులును నా యందే యుండుటలో ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులును, త్రిశక్తులును సృష్టికి పూర్వము ఆదిపరాశక్తియందే యున్నారనెడి మాట యదార్థమే! నేనునూ, ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే యిచ్చట సూక్ష్మాంశమొకటి కలదు. సమస్త సృష్టియునూ మాతృగర్భము నుండే వెలువడవలననెడి మహాసంకల్పమొకటి యుండియుండుటచే ఆద్యపరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండియే త్రిమూర్తులునూ, త్రిశక్తులునూ ఆవిర్భవించినవి. అయితే ఆ ఆద్యపరాశక్తికి సృష్టింపవలెనను సంకల్పము గాని, సృష్టి రచన యీ విధముగా ఉండవలెననెడి సంకల్పము గాని ఏ విధముగ కలుగవలెను ? దాని ప్రభోదన శక్తియే నేను అనగా మహా సంకల్పస్వరూపము! ఆ మహాసంకల్పము ననుసరించియే ఆద్యపరాశక్తి ఆవిర్భావము, త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము. ఆ మహాసంకల్పస్వరూపమే పరమ గురుస్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏక కాలము లోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగెడి మూలశక్తిని నేనే! సృష్టియందు మాతాశిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యభర్త సంబంధము, అన్నాచెల్లెల్ల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీదేవతాస్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని, మాయాశక్తియును, మహాశక్తియునూ, యోగశక్తివలన మాత్రమే కలుసుకొనుట జరుగగలదు. ఆద్యపరాశక్తిగా గాని, మూలదత్తునిగా గాని ఆరాధించునపుడు త్రిమూర్తులునూ, త్రిశక్తులునూ అంతర్లీనస్థితిలో నుండును. ఈ దైవసంబంధములునూ, వాటి తత్త్వములునూ, ఆయాస్థితుల అనుభవములునూ కేవలము సాధనాసంపత్తి కలిగిన వారికే అవగతమగును."</div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;"><br /></span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాదులను ఆరాధించు వారి యొక్క సమస్త పాపములు హరింపబడును. </span></b></div>
<div style="text-align: center;">
<br /></div>
<div style="text-align: justify;">
మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలెనన్న ఆ నీచజన్మ నుండి విముక్తమై, మానవజన్మనొంది తగిన సమర్థత కలిగిన వ్యక్తినుండి అది నేర్వవలెను. <b><span style="color: #674ea7;">నేను ప్రతీ జీవితోడనూ అంతర్గతముగా సంబంధమును కలిగియుండుటచే జీవుల సంస్కారములను, మలినములను వారి నుండి స్వీకరించి, ప్రతీ నిత్యము స్నానజపాదులవలన వాటిని దగ్ధముచేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సలుపనవసరము లేదు. నన్నారాధించు వారి అనేక పాపసంస్కారములను నా యందు ఆకర్షించుకొని మనయింట కులదైవముగనున్న కాలాగ్నిశమనదత్తుని స్థూలపూజ చేసెదను. ఆ పూజ చేయుట వలన కలిగెడి మహాఫలమును నన్ను ఆరాధించువారికి ధారపోసేదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలులేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్యకర్మలను నేను ఈ శరీరముతో ఆచరించెదను. నేను అనంత చైతన్యంబును గనుక, నేనే చేసెడి కర్మలకు సద్యఃఫలితములు కలుగును గనుక, ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలుగజేతును. అందువలననే నాది ఆదిగురుస్వరూపము! తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడైయున్నాడో గురువు యొక్క తపః శక్తికి, ఆ గురువు యొక్క శిష్యులు కూడ వారసులై యున్నారు. </span></b>భగవద్గీతలో కూడా కర్మచేయుట అనివార్యమను విషయము తెలియ జేయబడినది. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">నా అవతారమునకు సమాప్తి లేదు </span></b></div>
<div style="text-align: center;">
<br /></div>
<div style="text-align: justify;">
దత్తుడనయిన నేను సులభసాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులయి వరముల నిచ్చెదరు. <b><span style="color: #674ea7;">అయితే గురుస్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండెడి దుష్టశక్తులను, దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి, వారిని అనుగ్రహించు పరమకారుణ్య స్వరూపము. </span></b>తాతా! అందువలననే నన్ను స్మృతిమాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములయిన గురువుల రూపమున నున్నది నేనే! ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. <b><span style="color: #674ea7;">నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చెదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు ఒక అడుగువేసిన, నేను నా భక్తునివైపు నూరు అడుగులు వైచెదను. నా భక్తులను కంటికి రెప్పవలె కాపాడి అన్ని విపత్తులనుండి, బాధల నుండి కాపాడుట నా సహజ నైజము. "</span></b> అని బాపనార్యుల వారికి శ్రీపాదుల వారు దివ్యోపదేశములు చేసితిరి. అంతట నేను ఆ మహాగురువులను, మహాప్రభూ! సోమలత గురించియూ, సోమయాగము గురించియూ నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి దాని వివరములను తెలుపవలసినదని అడిగితిని. అంతట శ్రీపాదుల వారు సోమలతనే సంజీవినీమూలిక అని అందురని చెప్పి, నీకు దానిని చూడవలెనని ఉన్నదా? అని అడిగిరి. నేను ఔనంటిని. వెంటనే వారి చేతియందు సంజీవినీ మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా నిచ్చిరి. అది వారి దివ్యప్రసాదముగా యీనాటికినీ నా వద్ద పూజామందిరములో భద్రముగా ఉన్నది. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదులవారు "ఈ సంజీవినీ వనమూలికలు హిమాలయ పర్వతశ్రేణులలోనూ, కాశ్మీరులోని మానస సరోవరంలోనూ, సింధూనదీ ఉద్గమస్థానం దగ్గర, మల్లిఖార్జున ప్రభువు నిత్యనివాసమైన శ్రీశైల పర్వతము వద్దను, సహ్యాద్రి, మహేంద్రదేవగిరి, వింధ్య పర్వతశ్రేణి, బదరీ అరణ్యప్రాంతములందునూ లభ్యమగుచున్నవి. దీని వలననే లక్ష్మణుడు మూర్ఛనుండి కోలుకొనినాడు. దీనిని సేవించుటవలన ఎన్నియో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశ గమనము అనెడి సిద్ధి కలుగును. కండరములు బలపడుటకునూ, నేత్రకాంతి పెరుగుటకు, శ్రవణశక్తి పెరుగుటకు యిది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్నివలన గాని, జలమువలన గాని, విషము వలన గాని ఏ రకమైన భయమును, దుఃఖమును కలుగజాలవు. దీని వలన అణమాద్యష్ట సిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్కకు శుక్లపక్షము మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జనించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షము మొదలుకాగానే ప్రతీరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులూ రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్ళలో తడిపి రాత్రి గదియందుంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వతశ్రేణి, భీమశంకరపర్వతముల దగ్గర క్రూరమృగాలు ఈ సంజీవినీమూలికను కాపలాకాయుచుండును. అర్థరాత్రి అమావాస్యరోజున దివ్యకాంతితో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలుండును. నాయనా! గురుచరణా! ఈ విధముగా 24 రకాలయిన దివ్య ఔషధమొక్కలు ఉన్నవి. ఇవి అన్నియూ చాలా పవిత్రమయినవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉండును. అందుచేత పవిత్రములయిన వేదమంత్రములను ఉచ్ఛరించుచూ, అత్యంత వినమ్రభావమున వీటిని త్రవ్వి తీసుకొనవలసినది. ఆ యిరువయినాలుగు దివ్య ఔషధమొక్కలు 1) సోమ 2) మహాసోమ 3) చంద్రమ 4) అంశుమాన్ 5) మంజువాన్ 6)రజితప్రభు 7) దూర్వా 8)కనియాన్ 9)శ్వేతాన్ 10)కనకప్రభ 11)ప్రతానవాన్ 12)లాల్ వృత్త 13)కరదీర 14) అంశవాన్ 15) స్వయంప్రభ 16)రుద్రాక్ష 17) గాయత్రి 18)ఏష్టమ్ 19)పావత 20)జగత్ 21)శాకర్ 22)అనిష్టమ్ 23)రైక్త 24)త్రిపదగాయత్రి. " అని తెలిపిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను శ్రీపాదుల వారి నుండి శలవుగైకొని పీఠికాపురము నుండి బయలుదేరితిని. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను శంకరభట్టునకు యీ వృత్తాంతమును వివరించుట పూర్తికాగానే మహాగురువుల మానససంచారము పూర్తి అయినట్లుగా, వారి దర్శనమునకు రమ్మనమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకొంటిమి. శ్రీవారి దివ్యహస్తముల నుండి ఫలములను, ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదులిట్లనిరి. "మీరు యిరువురునూ కృష్ణ దాటి ఆవలి వడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదముపొందిన తదుపరి తిరిగి కురుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్ననూ ఎంతదూరములోనున్ననూ, నేను మిమ్ములను ఎల్లప్పుడునూ గమనించుచునే యుందునని గ్రహింపుడు. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #674ea7;">భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవసమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. పీఠికాపురము స్థూలదృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురమున్నది. అదియే స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూలశరీరము నావరించియుండు తేజోవలయమున సుప్రతిష్ఠమైయున్నది. ఏ యుగములోని వారైననూ, ఏ దేశములోని వారైననూ, ఏ కాలములోని వారైననూ, నా కటాక్షమును పొందిన యెడల వారి చైతన్యము స్వర్ణ పీఠికాపురమునందు సుప్రతిష్టితమగును. ఇది యోగదృష్టి కలవారికెల్లరకూ అవగతము కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవచైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మజన్మలోనూ నేను వెన్నంటి కాపాడెదను. </span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాయనా! శంకరభట్టూ! అనేక వందల సంవత్సరముల తరువాత నా పేరిట మహాసంస్థాన మేర్పడగలదు. నా మాతామహ గృహమున నా జన్మస్థలమున ఔదుంబర వృక్షచ్ఛాయి క్రింద నా పాదుకలు ప్రతిష్ఠిoపబడును. నా యొక్క, నా ముందు అవతారము యొక్క, నా తరువాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్యదృష్టిని నిచ్చుచున్నాను. చూడుడు! అని గురుచరణుని, నన్నూ భ్రూమధ్యమమున తాకిరి. మేము ఆ సుందరదృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము. లీలలు విచిత్రములు. మేము బయలుదేరునపుడు వారిట్లనిరి. వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును. </div>
<div style="text-align: justify;">
<span style="color: #38761d;"><br /></span></div>
<div style="text-align: center;">
<b><span style="font-size: large;"><span style="color: #38761d;">శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!</span></span></b></div>
<div style="text-align: center;">
<br /></div>
<div style="text-align: center;">
(అధ్యాయము 20 సమాప్తం ) </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
</div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-1862021783897231222014-06-13T01:54:00.001-04:002014-06-13T01:54:19.188-04:00Chapter 20 Part 2<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange;">అధ్యాయము 20 భాగము 2</span></b></div>
<div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">విస్సావధాన్ల వృత్తాంతము </span></b></div>
</div>
<div>
<div style="text-align: center;">
<b><span style="font-size: large;"><br /></span></b></div>
</div>
<div>
<div style="text-align: center;">
<span style="color: #38761d;"><b><span style="font-size: large;">ఔదుంబర వృక్ష మహిమ</span></b> </span></div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
అంతట హరిదాసు బిగ్గరగా నవ్వి, "నీవు చెప్పునది నిజమే! కాదనను! ఈ సృష్టి యొక్క మర్మమంతయునూ ఆదిగురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము! ఉత్తర క్షణములో వారు ఏమి చేయసంకల్పించెదరో సప్తర్షులు కూడనూ గ్రహింపజాలరు. అట్టిది నీవెంత ? నేనెంత ? మనుష్యుడు శారీరకముగా మరణించిననే మరణమనుకొనుచున్నావు. <b><span style="color: #674ea7;">జాతకునికి మారకదశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసికక్షోభకు, ఘోరమైన అవమానములకు, భరించశక్యముగాని కష్టనష్టములకు గురిచేసి కర్మక్షయమొనరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును. అవతారపురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురిచేసి పునర్జన్మ నీయవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించెడి ఔదుంబర వృక్షమునకు ఆకర్షించి, ఔదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించెదరు. అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరము నందలి ప్రాణశక్తి ద్వారా తానూ జీవించుచున్నానని అనుకొనును. అయితే యథార్ధమేమనగా ఆ ప్రాణశక్తి ఔదుంబరము నుండి వెలువడి, భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపజేయుచున్నది. మారకదశ తొలగిన తక్షణము ఔదుంబరము నుండి వెలువడు ప్రాణశక్తి మరల భక్తుని యందు సుప్రతిష్టితమై మరికొంతకాలము ఆ భక్తుడు జీవించును. ఔదుంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడిననూ అది పరిపూర్ణముగనే యుండును. దానికి కారణము శ్రీదత్తాత్రేయుల వారు ప్రతీ ఔదుంబర వృక్షమూలమున సూక్ష్మరూపముగా సుప్రతిష్టితులై యుండుటయే!" </span></b>అని విశదపరచెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాకు హరిదాసు చెప్పునదంతయూ ఆశ్చర్యముగానుండెను. కృష్ణదాసు అను పేరుగలిగిన ఆ హరిదాసు తన దారివెంట వెడలిపోయెను. నేను ఆ ఔదుంబరమును మహాప్రేమతో, భక్తితో మా యింటి పెరటియందు పెంచసాగితిని. కొలది దినములు మామూలుగనే గడచిపోయెను. మా దూరపు బంధువొకడు పట్టుబట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడైపోయెను. అతనికి పిల్లలు లేరు. నాయందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగెను. అతడు మా యింటనే నివసింపమొదలిడెను. నాకు కొంత ధనమొసగి పట్టుబట్టల వ్యాపారము చేయమని సలహానిచ్చెను. అతడు కూడా మా యింటనున్న ఔదుంబరమునకు ప్రదక్షిణలు చేయుట, మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించుట చేయ మొదలిడెను. <b><span style="color: #674ea7;">మా యింట ఏమి ఇబ్బందులు తలయెత్తిననూ ఔదుంబరమునకు ప్రదక్షిణచేసి ఆ వృక్షరాజమునకే మా బాధలు చెప్పుకొనెడి వారము. మా ఆవేదన దత్తప్రభువునకు చేరేడిది. మా బాధలు ఊహించనివిధముగా తీరేడివి. దత్తాత్రేయుల వారికినీ, మాకునూ మధ్య స్నేహవారధిగా ఔదుంబరముండెడిది. అయ్యో! దత్తభక్తులకు ఔదుంబరవృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదుంబరము గృహమునందున్న దత్తాత్రేయులవారు సాక్షాత్తు మనయింట ఉన్నట్లే! ఔదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించిననూ అది తక్కువేయగును.</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">పాపకర్మల ఫలితముగా ముళ్ళచెట్టుగా జన్మించుట</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను నా వ్యాపార నిమిత్తము ఓఢ్ర దేశమునకు పోవుచూ నా అదృష్టవశమున పీఠికాపురమునకు చేరి శ్రీ బాపనార్యుల ఇల్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదులవారు బాపనార్యులతో కలిసి పెరటియందుండిరి. వారి పెరట్లో ముండ్లచెట్టు యొకటున్నది. శ్రీపాదులవారు దానికి శ్రద్ధగా నీరు పొయుచుండిరి. బాపనార్యులు శ్రీపాదుల వారిని "బంగారు కన్నా! నీకు యింత ప్రీతిపాత్రమైన యీ ముండ్లచెట్టు సోమలతయో లేక సంజీవినీ మొక్కయో అనునట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించిననూ, వహింపకున్ననూ అది పెరుగుట మానదు." అనిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట శ్రీపాదులవారు "తాతా! పూర్వజన్మమున మన వీధిలోనే ఉండి, 'స్వయంభూదత్తుడే బాపన్నావధాన్ల గారి మనుమడుగా అవతరించెనట! ఎంతటి విడ్డూరము? ఎంతటి దైవద్రోహము? అని పరిహాసము చేసిన విస్సావధానులు తాతయే - యీ ముండ్లచెట్టు.' అమ్మయునూ, నేనునూ, అన్నలునూ, శ్రీవిధ్యాధరి రాధ సురేఖలును వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి యింటనూ, నరసింహవర్మ గారి యింటనూ భోజనము చేయు సందర్భమున 'మల్లాది వారునూ, ఘండికోట వారునూ బొత్తిగా అనాచారవంతులు, ధర్మభ్రష్టులు. ఈ రెండు కుటుంబముల వారినీ బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయ వలెనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విస్సావధానులు తాతయే - యీ ముండ్లచెట్టు.' 'శ్రీపాదుడే దత్తాత్రేయుడా? దీనికి ప్రమాణమేది? శాస్త్రములలో ఉన్నదా? వేదములలో ఉన్నదా?అని కుతర్కములాడిన విస్సావధాన్లు తాతయే - యీ ముండ్లచెట్టు.' 'సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతీ మహారాణిని తమ పుట్టింటి ఆడుబిడ్డగా భావించి భోజనముపెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే 'వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతనూ, నరసింహవర్మ తాతనూ అను నిత్యమూ దుమ్మెత్తి పోసిన విస్సావధానులు తాతయే - యీ ముండ్లచెట్టు.' మరణానంతరము ఉత్తరక్రియల లోపములవలన, మహాపాపభారమున, తన స్వభావమునకు తగినట్లుగా ముండ్లచెట్టుగా జన్మించిన ఈ విస్సావధాన్లు తాతను చూచి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను." అని తెలిపిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
కొలదిసేపటిలో పెరటిలో నుండి వీధిలోనికి వచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభుల ముగ్ధమనోహరరూపమును చూడగనే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినవి. కన్నులవెంట ఆనందభాష్పములు వెల్లువలు కాసాగెను. నేను శ్రీపాదులవారి దివ్యపాదపద్మములపై వ్రాలిపోయితిని. శ్రీపాదులవారు నన్ను ప్రేమతో వెన్నుతట్టి, నాయనా! లే! లే! ఏమిటి ఈ పిచ్చిపనులు? చచ్చి, తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా? అనిరి. నేను పట్టుబట్టల వ్యాపారము చేయువాడనని గ్రహించి బాపనార్యులవారు నాతో, ఓయీ! మా బంగారుబుడతడికి తగిన పుట్టములేమైనా కలవా? అని ప్రశ్నించిరి. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టుపుట్టముల నిచ్చితిని. గురుచరణా! నీకొక వింత చూపెదను రమ్మని వారు నన్ను లోనికి తీసుకొనిపోయిరి. బాపనార్యుల వారు కూడా శ్రీపాదుల వెంటనుండిరి. శ్రీపాదుల వారు మమ్ములను ముండ్లచెట్టు వద్దకు తీసుకొనిపోయి "విస్సన్నతాతా! నీ సంతానము శ్రాద్ధకర్మలవలననూ, బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించుటవలననూ నీకిట్టి నీచమైన జన్మ కలిగినది. ఈ గురుచరణుడనెడి వాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీనిచేత నీకు శ్రాద్ధకర్మను ఆచరింపజేసెదను. నీకు సమ్మతమేనా?" అని అడిగెను. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్లచెట్టును ఆచ్చాదించి యుండి వాయురూపమున ప్రేతాత్మగా నుండిన విస్సావధానులు అంతకంటెనూ మహాద్భాగ్యము కలదా ? అని స్పష్టముగా చెప్పెను. శ్రీపాదులవారు నా చేత ఆ ముండ్లచెట్టును సమూలముగా పీకివేయించిరి. తన చేతిలోనికి రావిపుల్లను, మేడిపుల్లను తీసుకొని అగ్నిని సృష్టించమనిరి. ఆ రెండింటి ఘర్షణలవలననూ అగ్ని జనించినది. నేను ఆ ముండ్లచెట్టును దగ్ధము చెసితిని. శ్రీపాదుల వారు నన్ను స్నానము చేయమని ఆదేశించిరి. స్నానానంతరము శ్రీపాదులవారు నాకు విభూతినిచ్చి ధారణ కావించుమని చెప్పి, "శివుడు కాటిలోని బూదిని వంటికి అలుముకొనునని లోకులనుకొందురు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మమును చెందునపుడు వారిని దహనము చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమునావరించియున్న తేజోవలయములో వారు ఐక్యస్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరబాటున మనచే హతమైనపుడు తప్పకుండా వాటికి ఉత్తరక్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనముచేసి, అన్నార్తులకు భోజనము పెట్టిన చాలును. మంత్రపూర్వకముగా చేయవలసిన విధి ఏదిన్నిలేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి ఋణానుబంధమో కలిగియున్న ఆ జీవులు ఏదో ఒక పొరబాటువలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయుట వలన మనకు కర్మశేషము నశించును. వాటికి సద్గతి కలుగును. పూర్వయుగమున ఒకసారి కరువు కాటకములతో లోకము తల్లడిల్లుచుండెను. గోగణాభివృద్ధి యుండిననే గాని గోఘ్రుతము వంటి పవిత్రపదార్థములు ఉత్పత్తి కానేరవు. యజ్ఞయాగాదులు లేకపోయినయెడల దేవతలకునూ, మానవులకునూ విశ్వనియంత చేత ఏర్పరుపబడిన పరస్పర సహకారము అనునది నిరర్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును. మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు. అందువలన గౌతమమహర్షి తన ఆశ్రమము నందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. గౌతమమహర్షికి కారణాంతరమున సంప్రాప్తించిన మాయాగోహత్య పాతక నివారణార్థము వారిచే గోదావరీ అవతరణము గావింపబడినది. కావున గౌతమమహర్షికి లోకమెంతయో ఋణపడియున్నది. గౌతమమహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఈ విస్సావధానులు గౌతమ గోత్రమున జన్మించినాడు. గౌతమమహర్షికినీ, విస్సావధానులకునూ ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రము నందు జన్మించుటయే! ఇది అత్యంత స్వల్పమైన ఋణానుబంధమే అయిననూ, త్రేతాయుగములో యిదే పీఠికాపురములో సవిత్ర కాఠక చయనములో గౌతమమహర్షి కూడా పాల్గొనియున్న కారణముననూ, విస్సావధాన్లు అదృష్టవశమున పీఠికాపురమున జన్మించుటయే గాక, అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణముచేతనూ, అయోగ్యునకు కూడా అవ్యాజకరుణతో సద్గతిని యీ దత్తుడు ప్రసాదించగలడనెడిది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతనూ, యీ సంఘటన జరిగినది. <b><span style="color: #674ea7;">ఋణానుబంధము లేనిదే శునకము కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్ధమై వచ్చినచో వీలు కలిగిన సహాయము చేయుము. వీలు లేకపోయిన శాంత వచనములతో నీ అసమర్ధతను తెల్పుము, అంతేగాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపుదవేని సర్వభూతాంతర్వర్తినైన నేను కూడా నీ యెడల నిర్ధాక్షిణ్యముగా నుందును. నీవెంత సత్యమో, యీ లోకమెంత సత్యమో, యీ సర్వ సృష్టియునూ ఎంతటి సత్యమో, ఈ సమస్తమునకునూ నేనే మోలకారణమనెడిది కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకునూ సత్యమైన పరమసత్యమును. </span></b>వేదమునందు కూడా 'సత్య జ్ఞానమనంతం బ్రహ్మ ' అని చెప్పబడినది. " అను విషయములను సవివరముగా తెలిపిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను నిశ్చేష్టితుడనై చూచుచుంటిని. బాపనార్యుల చెక్కిళ్ళపై ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదులవారు తాతగారి చెక్కిళ్ళపై జాలువారు ఆశ్రువులను తమ చిట్టిచేతులతో తుడుచుచూ "తాతా! ఈ మధ్య నీవు సదా నా ధ్యానములోనే యుంటున్నావు. నీ జన్మ ధన్యము! అచ్చముగా నీ రూపములోనే నృశింహసరస్వతి అవతారము ధరించెదను. యిది సత్యము!" అని చెప్పి బాపనార్యుల వారి చేతిలో చేయివైచిరి. అంతట బాపనార్యులు, శ్రీపాదా! ఎన్నియో రోజుల నుండి సందేహము నా మనస్సున నున్నది. అడుగమందువా ? అని సందేహమును వేలబుచ్చిరి. తక్షణమే శ్రీపాదుల చిరునవ్వు నవ్వుతూ, తాతా! నీయంతటి వాడికి సందేహమా? పది సంవత్సరముల బుడతడినయిన నేను తీర్చుటయా? అయిననూ ప్రయత్నించెదను, అడుగుము అనెను. సృష్టి స్థితి లయములను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కదా చేయునది ? శ్రీపాదుడు 'ఔను' అనెను. వారియొక్క శక్తిస్వరూపములే కదా సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు. శ్రీపాదుడు 'ఔను' అనెను. ఈ త్రిమూర్తులను, వారియొక్క యీ త్రిశక్తులను ఆదిపరాశక్తియే గదా సృష్టించినది. మరల శ్రీపాదుడు 'ఔను' అనెను. "అయిన యెడల నీవు ఎవరు?" అని బాపనార్యులు శ్రీపాదులవారిని ప్రశ్నించిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(ఇంకా ఉంది.. ) </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
</div>
</div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-76830775230707689872014-05-13T01:52:00.002-04:002014-05-13T01:52:24.874-04:00Chapter 20 Part 1<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="color: #990000; font-size: large;"><b>అధ్యాయము 20</b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #e69138; font-size: large;"><b>విస్సావధాన్ల వృత్తాంతము - భాగము 1</b></span></div>
<div style="text-align: center;">
<span style="font-size: large;"><b><br /></b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;"><b>శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన</b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్ధము కురుంగడ్డకు వచ్చితిని. శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. శ్రీవారి దివ్యనేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతిస్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలో నున్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభుస్వరూపము, నిరాకారతత్త్వము, సాకారమై, సగుణమై మానవాకారముతో కళ్ళయెదుటనే కన్పించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్త్వమును ముంచెత్తుచుండెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదులవారు అనుగ్రహముతో తమవద్దకు వచ్చి వారికి నమస్కరించుకొనుమని మమ్ము సైగచేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్య హస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములుద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీ చరణములను భక్తితో స్పృశించితిని. నా శరీరము తేలిక అయినది. నా కన్నులనుండి నల్లని తేజస్సు బయటకువచ్చుట గమనించితిని. ఆ తరువాత, నా శరీరములోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయల్వెడలినది. ఆ తేజస్సంతయునూ వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి యున్నది. శ్రీపాదుల వారు చిరునవ్వుతో, నీ వలెనేయున్న ఆ నల్లటి ఆకారము ఎవరో గమనించితివా ? అని నన్ను ప్రశ్నించిరి. నేను "స్వామీ! ఆ ఆకారము నన్ను పోలి ఉండుటను గమనించితిని కాని, ఆ ఆకారము నా శరీరము నుండి ఏల బయల్వెడలినదో నాకు తెలియదు. ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు." అని జవాబిచ్చితిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట శ్రీపాదులిట్లనిరి. "నాయనా! ఆ ఆకారము నీ పాప శరీరము. అతడు నీ పాపమయ పురుషుడు. ఇంక నీ శరీరములో మిగిలినది పుణ్యమయ పురుషుడు. <b><span style="color: #674ea7;">ప్రతీ మానవశరీరము నందునూ పాప పురుషుడును, పుణ్య పురుషుడును ఉందురు. పాపపుణ్యములు రెండింటినుంచి విడుదల లభించినచో ముక్తియే! </span></b>బ్రాహ్మణ జన్మనెత్తిన వాడు నిష్ఠావంతుడై తన పాపశరీరమును దహించుటయే గాక తన పుణ్యబలము తో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్త్వగుణప్రధానుడై ఉండవలెను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారిచేత ఆచరింపచేయుచూ తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారినుండి తీసుకొనవలెను. ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనునపుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలయును. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అట్లు కాని యెడల అతడు జాతి మాత్రము చేతనే బ్రాహ్మణుడు గాని, బ్రహ్మజ్ఞానవంతుడయిన బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు. మా మాతామహులయిన బాపనార్యుల వంటివారును, మా పితృదేవులయిన అప్పలరాజశర్మ వంటివారును సద్బ్రాహ్మణులనిపించు కొనగలిగినవారు. <b><span style="color: #674ea7;">మా మాతామహి రాజమాంబయును, మా మాతృదేవి సుమతీ మహారాణియును పరమపవిత్రులు. అటువంటి వారి స్మరణమాత్రముచేతనే జీవుల శరీరమునందలి వేలవేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. "</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఈ మాటలను పలికి శ్రీపాదులవారు క్షణకాలము మౌనముద్ర వహించిరి. చేతివ్రేళ్ళతో తమ భ్రూమధ్యమును తాకి, తమ కుడి హస్తమును చాచిరి. వారి అరచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించెను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్రవస్తువులు ఉద్భవించెను. కొన్ని మధురఫలములు పుష్పములు కూడా ఉద్భవించెను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించెను. అటు తదుపరి దివ్యాగ్ని ఉద్భవించెను. నా శరీరము నుండి వెలువడిన పాపపురుషుడు మహాభయకంపితుడై అరచుచుండెను. శ్రీపాదులవారు తమ నేత్రముల కదలికతో పాపపురుషుని దివ్యాగ్ని యందు పడి దగ్ధము కావలసినదాని ఆజ్ఞాపించిరి. వాడు అయిష్టముగనే ఆ అగ్ని యందు పడెను. నా శరీరము నందంతటను మంటలుద్భవించెను. నేను స్వామీ! నేను దహింపబడుచున్నాను! రక్షింపుడు! రక్షింపుడు! అని అరచుచుంటిని. శ్రీపాదుల వారి దివ్య నేత్రముల నుండి కాంతి తరంగమొకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యెను. హోమాగ్ని పాపపురుషుని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములయిన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కుండలిని జాగృత మగుటను గమనించితిని. నా నాడీ స్పందనమాగిపోయెను. హృదయ స్పందనమాగిపోయెను. నేను సమాధి స్థితి లోనికి జారుకొంటిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మధ్యాహ్నసమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదులవారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితులై యుండిరి. భక్తజనులు సమర్పించిన భిక్షాన్నమును శ్రీపాదులవారు తమ దివ్యహస్తముతో స్పృశించిరి. తమ కమండలమునుండి జలమును భక్తజనులపై ప్రోక్షించిరి. అష్టదిక్కులయందు కొంత అన్నమును బలిగా నుంచిరి. కోటికోయిలల కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనము చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలము కనులను మూసికొని తిరిగి కన్నులను తెరచి నావైపు తమ విలాస దృక్కులను సారించిరి. వారి చేతిలో రజత పాత్ర యొకటి ఆవిర్భవించినది. దాని నిండుగా 'హల్వా' అని పిలువబడు ఉత్తరదేశ వంటకమొకటి యున్నది. అది శ్రీపాదుల వారికి యిష్ట పాత్రమైన వంటకము. శ్రీపాదులవారు "శంకరభట్టూ! నన్ను నా భక్తులు తమ భక్తి పాశములతో బంధించెదరు. నేను నిష్కల్మషమైన భక్తీ శ్రద్ధాలకు మాత్రమె బద్ధుడను. శ్రేష్ఠిగారి యింట వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ యీ వంటకమును నా నిమిత్తమై తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసెదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనుమరాలు లక్ష్మీ వాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకము నందు మారక యోగమున్నదని జ్యోతిష్కులనుచున్నారు. నీకు నేను రక్షా బంధనము కట్టిన మాట యదార్థమేని నీవు యీ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించ వలసినదని పట్టుబట్టి నిరశనదీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీవాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించితిని. మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చితిని. ఈ మధుర ప్రసాదము అనేక జన్మలనుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల యింట నాకు నివేదన చేయబడిన ప్రసాదమును నేను స్వయముగా సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుదును. అయితే శ్రేష్ఠిగారి యింట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవునూ ఈ ప్రసాదమును స్వీకరించవలసినది." అనిరి. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరి తరము? ప్రసాదము నందు కొంత భాగమును పైకి విసిరిరి. అది నభోమండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో జారవిడిచిరి. అపుడచ్చటి భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి యిచ్చెను. ప్రసాదము భూమి లోనికి పోయిన తదుపరి బ్రద్దలైన భూమి మరల యధాస్థితికి వచ్చెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాంఛించిరి. శ్రీపాదులు ఎవరినీ నిరాశ పరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టిననూ అది ఇంకనూ అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కులసంభవుడైన గురుచరణుడను భక్తుడేతెంచెను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదము పెట్టిరి. ఆ రాజిత పాత్రను కృష్ణానదిలోనికి విసిరివైచిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
తరువాత శ్రీపాదుల వారు "పద్మశాలీలు మార్కండేయ గోత్రము వారే! కారణాంతరమున వారు మాంసభక్షకులయిరి. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగనేరదు. గురుచరణా! నీవు ఎన్నియో రోజులనుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచూ, శ్రీ గురుచరణములే సర్వదా శరణు శరణు అనుచూ, జీవనమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీ గురు కరకమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకరభట్టునకు గురుతత్త్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగనిద్రలో నుండి మానస సంచారము చేసెదము. మమ్ములనూ ఎవ్వరునూ దర్శింపరాదు. మా విశ్రాంతికి భంగము రానివ్వరాదు. " అని శెలవిచ్చిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను శ్రీ గురుచరణుడనెడి మహాభక్తుని కలియుట నిజముగా శ్రీగురుని సంకల్పమే! శ్రీ గురుచరణుడు యోగామార్గాములో పరిణితి చెందినవాడు. శ్రీపాదులవారి తత్త్వమును నాకు తెలియజేసి ధన్యులనొనర్పుడు అని నేను వారిని ప్రార్థించితిని. అంతట గురుచరణుడు, <b><span style="color: #674ea7;">"అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయముల నొందించు మహాసంకల్పమేదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్త్వమే, సాకార సగుణ స్వరూపమై పూర్వము యుగమునందు శ్రీ దత్తాత్రేయుడిగా అవతరించి, ప్రస్తుతము ఈ యుగమున, ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారము నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతాస్వరూపముగా తోచు సర్వదేవతాస్వరూపము, అన్ని యొగమార్గములకునూ గమ్యము. సృష్ట్యాదినుండియూ మహర్షులు తమతమ సాధనావిశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నియూ శ్రీపాదులవారి యొక్క దివ్యస్వరూపములే !</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్య శక్తులుండెడివి. వసిశ్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కరలేకుండగ యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు అనుసరించెడి వారు. <b><span style="color: #674ea7;">ఏదేని ఒక కర్మమును చేయుటకుగాని, ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్రరహస్యమును తెలిసినవాడే సమర్థుడగును. శ్రీపాదులవారు సర్వసమర్థులు. అయితే వారు కర్మరహస్యమును ఎరిగినవారు గనుక ఆయా వ్యక్తుల యెడల వారు ప్రవర్తించు విధానములో వ్యత్యాసములు కనుపించును. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్ఠమైనది. దానికున్న శక్తి అనంతమైనది. </span></b>బాపనార్యులుగాని, నరసింహవర్మగాని, వెంకటప్పయ్య శ్రేష్ఠిగాని విచిత్రయోగసంపన్నులు. వారు ముగ్గురికీ శ్రీపాదులవారి యెడల వాత్సల్యభక్తి మెండు. వారు తమ ప్రేమశక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదులవారు కూడా తలయొంచక తప్పదు. శ్రీపాదులవారు <b><span style="color: #674ea7;">ప్రతీ స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజస్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరయిననూ శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో శ్రీపాదులవారు కూడా వారి యిండ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు.</span></b> ఇదియే మహామాయ. యోగులు, జ్ఞానులు పదేపదే వల్లించిచెప్పెడి నిర్గుణ, నిరాకార పరబ్రహ్మము దివ్యశిశువుగా పీఠికాపురములో దివ్యలీలలను చూపుత తర్కమునకందని విషయము. వేదశాస్త్రముల ఆధ్యయనము ద్వారానూ, యోగమార్గము ద్వారానూ, జ్ఞానమార్గముద్వారానూ దైవము లభించుననెడి అభిప్రాయముతో సాధన చేయువారికి, ఆ దైవము ఆయా మార్గములద్వారా మాత్రమే లభించును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింప వచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీతమార్గమున కూడా దైవానుభవములు కలుగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదులవారి లీలలు అతర్క్యములు. అశ్రుత పూర్వములు." అని వివరించిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట నేను, అయ్యా! మీకు శ్రీపాదుల వారి దర్శనము ప్రప్రథమమున ఏ విధమున లభించెను. ఆ కథా ప్రసంగము చేసి నన్ను తరింపజేయుడు, అని శ్రీ గురుచరణుని కోరితిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట గురుచరణుడు "బ్రాహ్మణోత్తమా! మీరెంతయో ధన్యులు. శ్రీపాదులవారి సమక్షమున వారి దివ్యలీలలను మీకు తెలియజేయు భాగ్యము నాకు కలుగుత కేవలము నా పూర్వజన్మ సుకృత విశేషము వలననే. మీరు శ్రీ గురుని అవ్యాజ కరుణా కటాక్షము." అని పలికి తనకు శ్రీపాదులవారి దర్శనము కలిగిన విధమును సంగ్రహముగా వివరించిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను దైవభక్తి గల కుటుంబము లోనే జన్మించితిని. చిన్నతనము నుండియూ నేను మా కులదైవమైన దత్త ప్రభువునే కొలుచుచుంటిని. కుటుంబమునందు ఆర్ధికచింతలు మెండుగానుండెడివి. దత్త ప్రభువుల వారిని ఎంత వేడుకొన్ననూ నా కష్టములు తీరలేదు సరి కదా మిక్కుటము కాజొచ్చెను. కొంతమంది పెద్దలు నీకు దత్త ప్రభువుని అనుగ్రహము లేదు. నీవు కులదైవముగా వేరొక దైవతము నెంచుకొని పూజించుకొనిన నీ కష్టములు తీరవచ్చును, అని సలహా యిచ్చిరి. నేను కూడా ఏ దైవమును కులదైవముగా ఎంచుకొన్న నా కష్టములు కడదేరునా యని తలంచుచూ నిద్రపోతిని. కలలో భయంకరాకారుడైన కసాయి వానిని చూచితిని. అతడు మిక్కిలి ప్రేమతో మేకలమందను పెంచుచుండెను. ప్రతీ రోజునూ కొన్ని మేకలను తన కసాయికత్తికి బలిచేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతుని చేయుచుండెను. అతడు మేఘగంభీర స్వరమున, <b><span style="color: #674ea7;">"నేను దత్తుడను. నీవు ఏ దేవీదేవతలను ఆరాధనము చేసిననూ ఆ స్వరూపములన్నియూ నేనే! నీవు ఆరాధించు దైవము యొక్క నామరూపములను మార్చినంత మాత్రమున నేను మారెడివాడను కాను. నేను నిన్ను వదలువాడను అంతకంటెను గాను. నీవు నా నీడవు. నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు ? సమస్త దేవీదేవతల సంకల్పములను, సమస్త మానవకోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేనే! భగవదవతారములన్నియూ ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడునో ఆ బ్రహ్మమును నేనే! పులినోట చిక్కిన జంతువు తప్పించుకొన గలుగునేమో గాని నా చేత చిక్కిన నీవు తప్పించుకోలేవు. దత్తభక్తులు సింహకిశోరముల వలె నుండవలెను గాని పిరికిపందలు కాకూడదు. నేను సింహము వంటివాడను. సింహకిశోరములకు సింహము వద్ద భయముండజాలదు. అవి తమ తల్లిని తమ ఆటపాటలతో మురిపించును.</span></b> ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయము. ముల్లోకములందునూ నిన్ను రక్షింపగలుగువారు ఎవ్వరునూ లేరు. " అని పలికెను. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను భయభ్రాంతుడనై వెఱ్ఱికేకలు వేయసాగితిని. ఇంతలో కల చెదిరినది. ఇంటిలోని వారు విషయమేమిటని అడిగిరి. నేను నా స్వప్న వృత్తాంతము వారికి తెలిపితిని. ఏ జన్మలో చేసికొన్న కర్మ ఫలమో ఈనాడు యీ దరిద్రావస్థను అనుభవించుచుంటినని వాపోయితిని. మా ఆర్ధికబాధలు మరింత మెండాయెను. నేను చనిపోయిననూ బాగుండునని భావించితిని. తెల్లవారగానే మా యింటిముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమాయెను. అతని చేతుల్లో చిరతలుండెను. అతడు హరినామమును గానము చేయుచుండెను. నెత్తిమీద బియ్యమును పోసుకొను పాత్ర యొకటుండెను. ఇతడొక వింత హరిదాసు. ఆ ఒఆత్ర యందాతడు ఒక చిన్న మేడిచెట్టు మొక్కను కలిగి యుండెను. హరిదాసు యింటి ముంగిట నిలచినప్పుడు బియ్యము వేయకపోవుట అశుభసూచకమందురు. అందుచేత యింటిలో బియ్యము ఏమయినా ఉన్నవేమోనని వెదికి, కనిపించిన గుప్పెడు నూకలను హరిదాసు కిచ్చితిని. హరిదాసు ఆ గుప్పెడు నూకలను స్వీకరించి, "అయ్యా! నిన్నరాత్రి ఒక కసాయివాడు గురుచరణుడనెడి దత్తభక్తుని హత్య చేసినాడు. చిత్రమేమనగా ఆ మనిషి ప్రాణములు శరీరము నుండి విడివడి యీ మేడిమొక్క యందు నిలిచినవి. ఔదుంబర వృక్షమూలమున దత్తాత్రేయుల వారుందురని ప్రమాణము. ఈ మొక్క సామాన్యమైనది కాదు. గోదావరీ మండలమున శ్రీ పీఠికాపురమను మహాక్షేత్రము కలదు. అచ్చట స్వయంభూదత్తుడు శ్రీపాద శ్రీవల్లభుడనెడి మారువేషమున తిరుగుచుండునని ప్రతీతి. శ్రీవల్లభుల వారి మాతామహగృహమున నుండు ఔదుంబరవృక్షము యొక్క సంతతి యీ మొక్క. ఈ మొక్క మీ యింటనాటి సర్వశుభములను పొందుము." అని పలుకగా నాకు తలతిరిగి పోయినట్లయినది. అంతట నేను హరిదాసుతో, "అయ్యా! గురుచరణుడనెడి వాడను నేనే! నేను హత్యకు గురికాలేదు. నేను దత్తభక్తుడినే! నేను స్వప్నమున కసాయివానిని చూచితిని. అతడు తనకత్తితో నన్ను సంహరించెదనని చెప్పినాడు. ఏ మానవుడైనా విగత జీవుడైనపుడు అతని శవము సంప్రాప్తముకానపుడు మేడికర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తరక్రియలను చేయుట వినియున్నాను, అంతేకాని ఒక మనిషి ప్రాణములను ఔదుంబరవృక్షములోనికి ఆకర్షించి, అదే సమయములో అదే మనిషియందు ప్రాణములను నిల్పుట ఎచ్చటనూ వినలేదు, కనలేదు. " అంటిని. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(ఇంకా ఉంది) </div>
<div style="text-align: justify;">
</div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-83227164424464183932013-11-05T22:07:00.006-05:002013-11-05T22:08:31.850-05:00Chapter 19 part 2 ( Last Part)<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">అధ్యాయము 19</span></b></div>
<div>
<div style="text-align: center;">
<b><span style="color: orange; font-size: large;">గురుచరణునితో సమాగమము - భాగము 2</span></b></div>
</div>
<div>
<div style="text-align: center;">
<b><span style="font-size: large;"><br /></span></b></div>
</div>
<div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాదుల విరాట్ స్వరూపము </span></b></div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
నేను బృహత్ శిలానగారమని పిలువబడు పెనుగొండ గ్రామమునకు చెందినవాడను. నన్ను గణపతిశాస్త్రి అని అందురు. నేను వేదాధ్యయనము చేయునిమిత్తము వాయసపుర (కాకినాడ) అగ్రహారమునకు వచ్చితిని. గురుశుశ్రూష చేయుచూ వేదమును నేర్చుకొనుచుంటిని. మా గురుదేవులకు వారి గృహమునకు సమీపముననే భూములు కలవు. వారికి గోగణము కూడా విస్తారము. నేను గోవులను మేపుటకు పొలమునకు పోయితిని. ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్న దివ్యతేజోవిరాజితుడైన పది సంవత్సరముల వయస్సుగల బాలకుడొకడు మా భూమిలోనికి వచ్చెను. అతడు మెడలో జందెమును ధరించియుండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడని నిశ్చయించుకొని నిర్ధారణ కొరకు అతనిని అడిగితిని. </div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
అంతట ఆ బాలకుడు "నేను నేనే! నాలో సమస్త తత్త్వములునూ ఉన్నవి. అన్నింటికీ ఆధారభూతుడనయిన మాత్రము నేనే! నాలోని బ్రాహ్మణ లక్షణములను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడనని భావించిన అది తప్పు కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో క్షత్రియ లక్షణములను గాంచి నన్ను క్షత్రియుడననుకొన్న అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో వైశ్య లక్షణములను గాంచి నన్ను వైశ్యుడనని అనుకొన్ననూ అదో అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో శూద్ర లక్షణములను గాంచి నన్ను శూద్రుడననుకొన్ననూ అది తప్పు కాదు. అయితే అది మాత్రమే యదార్థము కాదు. నన్ను నీవు ఛండాలునిగా భావించిననూ తప్పుకాదు. కాని అది కూడా యదార్ధముకాదు. నేను సమస్త పరిమితులకు అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమసత్యమును. ఆ సత్యతత్త్వము అన్ని అవధులకునూ ఆవలనుండునది. నా యొక్క ధర్మము, పరమధర్మము. అది సమస్త ధర్మములకునూ అతీతము. ఆధారభూతము కూడనూ. నాది పరమప్రేమతత్త్వము. సృష్టిలోని జీవులలో నుండే ప్రేమతత్త్వములన్నింటి కంటే సుదూరములో నుండును. అంతే కాకుండా వాటి అన్నింటికినీ ఆధారముగా నుండును. నన్ను నీవు పురుషునిగా భావించిన స్త్రీవలె ప్రవర్తించును. స్త్రీగా భావించిన పురుషునివలె ప్రవర్తించెదను. నన్ను అర్థనారీశ్వరుడననుకొందువా ఆ రెండు రూపములు వ్యక్తమగుటకు ముందున్న మనోవాచామగోచరమైన దివ్యానందతత్త్వమని రుజువు చేసెదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు ?" అని ప్రశ్నించెను. </div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
నాకు అతడు చెప్పునదంతయునూ మహోగ్ర జ్వరపీడితుని సంధిప్రలాపమువలె తోచినది. పైత్యము మితిమీరినపుడు అవాక్కులు, చవాక్కులు వచ్చునని తలంచితిని. నా మనో అవస్థను గమనించుచున్న ఆ బాలుడు, "నేను ఇప్పుడు శనైశ్చ్వరుడు, నేను యీ గణపతిశాస్త్రిని ఎంత చమత్కారముగా చిత్రవిచిత్రములయిన బంధనములలో పడవేసి హింసించెదనో ఆ వేడుకను తమరు వీక్షించుడు ప్రభూ! అని నాతో అనుచున్నాడు. కాని నేను గణపతిశాస్త్రి కర్మఫలమును గోక్షీరరూపములో గ్రహింపబోవుచున్నాను. ఇతనిని నీవు బంధనములలో పడవేయజాలవని శనైశ్చ్వరునితో అంటిని." అని గణపతిశాస్త్రికి తెలిపెను. </div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
ఆ మాటలు విన్నవెంటనే నాలో కంపరము బయలుదేరినది. వాస్తవమునకు ఆ సమయములో నా జాతకములో చాల చెడుదశ జరుగుచుండెను. నేను ఏమి మాట్లాడలేని స్థితిలో ఉండగనే ఆ పశువుల కాపరి ఒక ఆవువద్దకు పోయి గాయత్రీ! నాకు ఆకలిగానున్నది. పాలివ్వగలవా? అని ప్రశ్నించెను. ఆ గోమాత ఆవునని సూచించు అర్ధములో తన తలను త్రిప్పెను. దాని పొదుగు పాలతోనిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువులకాపరి తృప్తిగా పాలను త్రాగెను. వాస్తవమునకు అది గొడ్డు ఆవు. అయిననూ ఆ పశువులకాపరికి పాలిచ్చెను. ఇది అంతయునూ నాకు అయోమయముగా నుండెను. ఆ పశువులకాపరి తృప్తిగా అచ్చటనున్న ఒక మామిడిచెట్టు క్రింద కూర్చుండెను. నేను తిరిగి అతనివైపు యాదృచ్చికముగా చూడగా ఆ పశువులకాపరితో పాటు ఎవరో పదియేండ్ల రైతు బాలిక వేషము లోనున్న కన్య కూడా ఉండెను. చూపరులకు వారిరువురూ నయనానందకరముగా నుండిరి. వారి సరససల్లాపములు, వినోద భరితములైన సరస సంభాషణలు చూడచక్కని జంటగా కన్పించెను. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు తమ గుఱ్ఱపు బండి నుండి దిగిరి. వారితో పాటు పది సంవత్సరముల వయసు కలిగిన తేజోవిరాజితుడైన బాలకుడొకడుండెను. అతడే శ్రీపాద శ్రీవల్లభ స్వామియని ఆ తరువాత తెలిసికొంటిని. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు తమ తండ్రిగారి స్మృత్యర్థము భూదానముగా యిచ్చి యుండిరి. ఈ భూమికి ఆనుకొని శ్రేష్ఠివారికి విస్తారమయిన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకొను నిమిత్తము శ్రీ శ్రేష్ఠిగారు ఎప్పుడయినా పీఠికాపురమునుండి వాయసపురాగ్రహారమునకు వచ్చుచుందురు. శ్రేష్ఠిగారు పశువులకాపరిని, అతనితోనున్న రైతుబాలికను చూచి ఆశ్చర్యచకితులయిరి ఏలనన వారు మహా తేజోవంతులగుటయేగాక కొంచెము మార్పులు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలి యుండిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట శ్రీపాదుల వారు, తాతా! ఎందులకు అంత సంభ్రమాశ్చర్యచకితుడవయినావు? అని అడిగిరి. దానికి వారు, నాయనా! వారిరువురిని చూడుము. నయనానందకర దృశ్యము! అనిరి. అంతట శ్రీపాదులవారు, చూచెడివాడు, చూడబడెడి దృశ్యము ఒక్కటేనా ? అని అడిగిరి. దానికి శ్రీ శ్రేష్ఠిగారు అంతటి వేదాంత విషయములు నాకు తెలియవు బంగారు తండ్రీ! అని గోముగా పలికిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదుల వారు "తాతా! ఇందులో వేదాంతమేమున్నది? శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయాగతిని చూసి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరసభరితము. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమము. అచ్చట రెండుగానున్నది. ఇచ్చట ఒకటిగా ఉన్నది. ద్వైతము యదార్థమా ? అద్వైతము యదార్థమా? నేను ఒకటా? రెండా? లేక అనేకమా? ఆలోచించి చెప్పు. "</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రేష్ఠిగారికి శ్రీపాదుల యీ మాటలతో పశువుల కాపరియు, ఆ రైతు బాలికయూ కూడా శ్రీపాదులవారి కాయసృష్టి గాని కాదు గదా అనేది సందేహము కలిగినది. శ్రేష్ఠిగారి చుబుకమును పట్టుకొని శ్రీపాదులిట్లనిరి. "తాతా! సందేహమెందులకు ? మీ వంశములోని వారు నన్ను మరువనంతవరకు నేనునూ, నా శక్తియునూ, అదృశ్యరూపమున మీ భూములలో సంచరించువారమే! మీ యింట్లో నా అడుగుల చప్పుడు సాధకులయినవారికి తప్పక అనుభవమయ్యే విషయమే! అనఘాదేవీ సమేతుడైన ఆ అనఘుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్థనారీశ్వర స్వరూపము దృష్టిగోచరము కాకుండా అవధూతరూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నీ సమక్షములోనే ఉన్నాడు. సందేహము వలదు. నేను సుమతీ మాయికి ప్రప్రథమమున దర్శనమిచ్చినపుడు నేను పుత్రుడనై జన్మించినపుడు వివాహ ప్రయత్నము చేయవద్దనియూ, ఆ రకముగా ప్రయత్నము చేసినచో యిల్లు వదలి వెళ్లిపోవుట ఖాయమనియూ నిశ్చయముగా చెప్పితిని. నీవు రాజర్షివి గనుక నిష్కల్మష భక్తిపాశముతో నన్ను బందీగా చేసితివి గనుక అనఘాసమేతమైన అనఘస్వరూపమును నీకు దృష్టి గోచరముగావించితిని.<b><span style="color: #a64d79;"> శ్రీపాదుల వారి సన్నిధిలో కారణము లేని కార్యము జరుగజాలదు. సృష్టి విధానము చిత్రవిచిత్రమైనది. కర్మములు, వాటి ఫలితములు అవి సంభవించు దేశకాలములు నాచే నిర్ణయించబడునవి. మూఢులైన జనులకు నా చర్యలద్వారా, లీలల ద్వారా, మహిమలద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమములో ఒక భాగము." </span></b>శ్రీపాదుల వారు ఈ ప్రకారముగా పలికి మేము చూచుచుండగనే కాంతిస్వరూపమునుపొంది మామిడిచెట్టు వైపునకు వెడలిరి. చూచుచుండగనే రైతుబాలికయు, పశువుల కాపరియూ కాంతి స్వరూపమును పొంది శ్రీపాదులవారిలో లీనమయిరి. కాలము కాని కాలములో మామిడిచెట్టునకు కాయలు కాయుట అసంభవమైన విషయము. కాని ఆ మామిడిచెట్టునకు ఒకే ఒక కాయ కాసెను. దానిని శ్రీపాదులవారు కోసిరి. వారి హస్తస్పర్శ ఎట్టిదోకాని అది చూచుచుండగనే పండుగా మారినది. పసిపిల్లవానికి తల్లి భోజనముగాని, మధుర పదార్థములు గాని తినిపించు రీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠిగారిచే ఆ మామిడి పండును తినిపించిరి. ఆ మామిడిపండును తినునంత వరకునూ శ్రేష్ఠిగారు పసిబాలుని వలె ఏడ్చుచుండిరి.<b><span style="color: #a64d79;"> శ్రీపాదులవారి మాతృప్రేమ వెయ్యి తల్లుల ప్రేమ కంటే గొప్పది. వారి దివ్య నేత్రముల నుండి కారుణ్యము, ప్రేమ వర్షించునపుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘామాతయే అనిపించెదరు.</span></b> ఆ మామిడిపండు యొక్క టెంక శ్రీపాదుల వారి సుముఖములో నిట్టనిలువుగా నిలబడి ప్రభువుయొక్క ఆజ్ఞ కోసము వేచియుండు సేవకునివలెనున్నది. శ్రీపాదులవారి హస్తసంజ్ఞతో ఆది పైకెగిరినది. అది మామిడి టెంక రూపున ఉన్ననూ కేవలము కాంతి స్వరూపముగా మారిపొయినది. శ్రీపాదులిట్లనిరి.<span style="color: #a64d79;"><b> "విత్తు ముందా? చెట్టు ముందా? అని కొంతమంది వితండవాదము చేయుదురు. ఈ రెండింటికంటెనూ ముందున్నవాడు ఒకడున్నాడు. అతడే దైవము. తన సంకల్పమును బట్టి విత్తనము నుండి చెట్టును గాని, చెట్టునుండి విత్తనమును గాని ఆవిర్భవింపజేయగలడు. అమోఘమైన అతని సంకల్పము సప్తమహర్షులకు సైతము ఊహింపనలవి కానిది. మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలవబడుచున్నాడు. మాలిన్యరహితుడైన జీవుడు పరమాత్మ అగుచున్నాడు.</b></span> జీవాత్మ పరమాత్మలో లీనమయినపుడు అతని సంస్కారములన్నియూ వేయించబడిన విత్తనములవలె నుండును. అయితే పరమాత్మకు సంకల్పము కలిగి తనలో విలీనమైన జీవాత్మను తిరిగి సృష్టి చక్రము లోనికి తీసుకు రాదల్చిన అతనిని అడ్డుకొనగలుగు శక్తి లేదు. అయితే తనలో లీనమయిన జీవులను సృష్టిలోనికి తీసుకు వచ్చునపుడు వారు కారణజన్ములై దైవ కార్యమును నిర్వహింతురు. జన్మాంతమున వారు తిరిగి పరమాత్మ యందు లీనమగుదురు. పరమాత్మయందు లీనముకాక అత్యంత సామీప్యమున ఉండదల్చిన జీవులు ఆ ఆనందమయ స్థితిలోనే ఉండదల్చెదరు. అట్టివారిని కూడ పరమాత్మ దైవకార్య నిర్వహణార్థము కారణజన్ములుగా జన్మింపజేయును. జన్మాంతమునవారు పరమాత్మయండు లీనముగాక అత్యంత సామీప్యస్థితియందే ఉండి దివ్యానందముననుభవించెదరు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, అను స్థితిలో ఉండగోరు జీవులు కారణజన్ములై దైవకార్యమును నిర్వహించిన తదుపరి తిరిగి పూర్వస్థితిలోనే జన్మాంతమున ఉండెదరు. ద్వైతస్థితిగాని, విశిష్టాద్వైతస్థితిగాని, అద్వైతస్థితిగాని, జీవులయొక్క కోరిక మేరకు ప్రసాదింపబడును. అందువలన జనులు అద్వైతము గొప్పదా? విశిష్టాద్వైతము గొప్పదా? ద్వైతము గొప్పదా? అని వాదులాడుట తగదు. సృష్టి స్థితి లయములు అనుక్షణము జరుగుచునేయుండును. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ తమ కల్పాంతములలో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితియందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పము ననుసరించి వ్యక్తస్థితికి వచ్చి వారికోసమై నూతనముగా సృష్టింపబడిన బ్రహ్మాండములయందు సృష్టిస్థితిలయములను కావించెదరు. నవవ్యాకరణ పండితుడయిన హనుమంతుడు రాబోవుకల్పములో బ్రహ్మగా నుండును. జీవులకు వారి వారి సంస్కారములను బట్టి యోగ్యతా విశేషములనుబట్టి విశ్వపరిపాలనా కార్యక్రమములో బాధ్యతలు ప్రసాదింపబడును. అందువలన సృష్టి యందలి బ్రహ్మాండములు అనేక కోట్లు. వాటి పరిపాలనా నిర్వహణమునకు వినియోగింపబడు దేవతాశక్తులు కూడా అనంతముగా నుండును. ఆ దేవతా శక్తులకు ప్రతిబంధకములుగా నుండు రాక్షస శక్తులు కూడా అనంతముగా నుండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారుని "అల్లా" యని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకారుని "యహోవా" యనియు సృష్టి యందు ప్రతిబింబించిన కూటస్థచైతన్యమును కుమారుడైన ఏసు అనియు సాంత్వమును, ఆదరణను, ప్రేమను, కరుణను సమకూర్చు దివ్య చైతన్యమును పవిత్రాత్మయనియు వ్యవహరించెదరు.<b><span style="color: #a64d79;"> సమస్త ధర్మములయందును, మతములందును, సిద్ధాంతముల యందును స్వప్రకాశముతో వెలుగొందువాడను నేనే! ఆయా జీవుల అభీష్టములనుబట్టి, అభిరుచులనుబట్టి వారనుసరించు మార్గములనుబట్టి ఆయాస్థితులనుబట్టి భిన్న భిన్న తత్వములతో తోచువాడను నేనే! నేను సర్వతంత్ర స్వతంత్రుడనుకనుక, సాధ్యాసాధ్యములు లేనివాడను గనుక నాకు నిర్దిష్టమైన విధానమనునది లేదు. సమస్త దేవీదేవతా స్వరూపములలోనూ అంతర్నిహితముగా, జాజ్వల్యమానముగా ప్రకాశించువాడను నేనే గనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను, స్తోత్రములను అందుకొనువాడను నేనే! అందరిని అనుగ్రహించు వాడను నేనే!</span></b> కలిపురుషుని మాయ అంతమైన వెంటనే సర్వమతముల సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనెడి జ్ఞానము ఉదయించును. సాధకుడు బహార్యాగము ద్వారానైననూ, అంతర్యాగము ద్వారానైననూ నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైననూ, అంతర్ముఖుడైననూ సదా నేను వానిని కనిపెట్టుకొని యుండువాడను, ప్రేమతో పలుకరించువాడను నేనే! వేదములో కూడా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మమని చెప్పబడినది. నేనే సత్యజ్ఞానానంత బ్రహ్మస్వరూపమును. నాస్తికునకు దేవుడు లేడని ప్రబోధించువాడను నేనే! ఆస్తికునకు దేవుడు ఉన్నాడని హెచ్చరిక చేయువాడనూ నేనే! సమస్త గురుస్వరూపమునూ నేనే! సత్యలోకము, సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలయిన సమస్త సాధనాస్థితులలోనూ, స్వయంప్రకాశముతో వెలుగొందువాడను నేనే!<b><span style="color: #a64d79;"> ఎవరైతే వినిర్మలభక్తితో నన్ను ఆరాధించెదరో, సర్వభారములను నాపైన వేసి సర్వస్య శరణాగతి పొందుదురో, అట్టివారి యోగక్షేమములను నేను సదా కనిపెట్టి యుండువాడను. నేను శ్రీపాదుడను. శ్రీవల్లభుడను. తాతా! ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగమునాటి అత్రి అనసూయానందనుడే యీనాటి శ్రీపాదశ్రీవల్లభుడు. భరద్వాజ ఋషి కిచ్చిన వాగ్దానమును బట్టి పీఠికాపురమున అవతరింపవచ్చినది.</span></b> శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి కనుల వెంబడి ధారాపాతముగా ఆనందాశ్రువులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢముగా ఆలింగనము చేసికొనిరి. వారు అనుభవించిన తన్మయత్వము వర్ణనకు అందనిది. వాక్కులతో తెలియజేయలేనంతటిది. కొంతసేపైన తరువాత శ్రేష్ఠిగారిట్లనిరి. "నాయనా! బంగారు తండ్రి! మా వంశముపైన నీ అనుగ్రహముండనీ. మా గోత్రముపైన నీ అనుగ్రహముండనీ! మా ఆర్యవైశ్య కులముపైన నీ అనుగ్రహముండనీ!" అని కోరగా శ్రీపాదులిట్లనిరి. "తాతా! తథాస్తు! బ్రాహ్మణునకు ఒక వరము కోరుకొను అధికారము కలదు. క్షత్రియునకు రెండు వరములు, వైశ్యునకు మూడు వరములు, శూద్రునకు నాల్గువరములు కోరుకొను అధికారమున్నది. నీవు కోరిన మూడు వరములను అనుగ్రహించితిని. <b><span style="color: #a64d79;">33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానము చేయుచున్నాను. నా పేరిట, నా మాతామహులైన శ్రీ బాపనార్యుల యింట, సరిగా నా జన్మస్థానము నందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమేర్పడును. నీ నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ బాపనార్యుల నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరము నడుచుచుండగా, నీ వంశములోని 33వ తరము వ్యక్తిని నిమిత్తమాత్రునిగా చేసి నా సంస్థానమును నేనే ఏర్పాటు చేసుకొందును.</span></b> మీ వంశ మూలపురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయమహర్షి ప్రతీ గురువారము మధ్యాహ్నసమయమున ఏదో ఒక రూపములో నాకు నైవేద్యమీయబడిన పదార్ధములో ఎంతోకొంత భాగమును స్వీకరించుగాక! దాని వలన మార్కండేయ గోత్రమునందు జనించినవారలకు మేలుకలుగు గాక! నీవు కోరినట్లే ఆర్యవైశ్యులపై నా అనుగ్రహమున్నది. <b><span style="color: #a64d79;">ఆర్యవైశ్యులకు రాజ్యాధికార యోగము కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్య వైశ్యుడొకడు భారతప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీజ్యోతిష్యము నందలి సూచనను బట్టి పీఠికాపురము రాగలడు. మెండుగా నా అనుగ్రహమును పొందగలడు. ఆ తరువాత నేపాళదేశము నుండి భక్తజనులు అసంఖ్యాకముగా పీఠికాపురమున నా దర్శనార్థము రాగలరు. నా యొక్క శాసనము శిలాశాసనము. సృష్టిలోని ఏ ప్రాణికినీ అది అనుల్లంఘనీయమయిన శాసనము.</span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #a64d79;"><br /></span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #a64d79;">తాతా! నా జేగంట రకరకముల మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠిoపబడిన స్థలములో భూమిగతమై యుండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవ్వకములలో కొన్ని మృణ్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మింపబోవు నా మహాసంస్థానమునకు ద్రవ్యసహాయము చేయుటకు ఎంతో సుకృతము కావలెను. ఏదో ఒక జన్మలో ఆర్యవైశ్య కులమునందు జన్మించి పీఠికాపురములో ఏదో ఒక సంబంధము కల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్యసహాయము సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్యజనిత అహంకారులు ప్రతీదానికినీ ప్రమాణము కోరెదరు. నా చరిత్ర పారాయణము చేసిన అభీష్టసిద్ధి కలుగును. పీఠికాపురములోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యములో పాల్గొనిననూ ప్రతిబంధకములు తొలగును. పీఠికాపురములో నా జన్మనక్షత్రమైన చిత్తానక్షత్రము నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన ఋణబాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వరులతో వివాహము జరుగును. భూతప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధ తొలగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీవాసవీ కన్యక నాకు రక్షాబంధనము కట్టు పుణ్యదివసము. ఆనాడు పీఠికాపురములో నా సన్నిధిలో నుండు వారాలకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణము. నా చరిత్ర స్వతః ప్రమాణము నా లీలలు స్వతః ప్రమాణము. సూర్యుని సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేల ?"</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదుల వారి లీలలు అనితరసాధ్యములు. ఆ మరునాడు నేను, వల్లభేశ్వరశర్మ దంపతులు, సుబ్బణ్ణశాస్త్రీ , లింగణ్ణశాస్త్రీ శ్రీపాదుల వారి దర్శనార్ధము కురుంగడ్డకు వెడలితిమి. శ్రీపాదులవారు మమ్మెంతగానో ఆశీర్వదించిరి. చిరునవ్వుతో యిట్లనిరి. ఆహా! ఏమి చర్చలు! ఏమి చర్చలు! శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమేర్పడుటకు చాలా కాలము గడువవలెను గదా! మల్లాది వారి ఋణము, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఋణము, వత్సవాయి వారి ఋణము తీరేదెన్నటికో." ఈ విధముగా పలికి మౌనముద్ర వహించిరి. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;">శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము! </span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(అధ్యాము - 19 సమాప్తము) </div>
</div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-35191207973880737652013-03-19T22:34:00.001-04:002013-03-19T22:34:21.213-04:00Chapter 19 Part 1<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: #990000; font-size: large;">అధ్యాయము 19</span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">గురుచరణునితో సమాగమము- భాగము 1</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
వల్లభేశ్వరశర్మ దంపతులు, నేను, సుబ్బణ్ణశాస్త్రి, శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరపుబంధువు అయిన లింగణ్ణశాస్త్రి యనునతడు వచ్చెను. అతడు వేదవేదాంగ పారంగతుడు. లింగణ్ణశాస్త్రి యీ విధముగా చెప్ప నారంభించెను. "నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చితిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైననూ, ధనవంతుడైననూ బహుపిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములనూ, ధర్మసూక్ష్మములనూ వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకొనువారు. పితృదేవతల తృప్తికొరకు చేయబడు దశవిధ దానములను 'యథాశక్తి' అను సూత్రముతో వక్రముగా అన్వయించుకొని వారు అత్యంత స్వల్పద్రవ్యముతో ఆ తంతు అయినది అనిపించుకొనెడివారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధకర్మలయందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చుబెట్టబడుచున్నదనియూ భోక్తలు యిదే అదున్ని భావించి మిక్కుటముగా భోజనము చేయుచున్నారనియూ, తన యిల్లు గుల్ల అగుచున్నదనియూ అంతర్మథనము చెందెడివాడు. కాలము తీరగా మా తాతగారు చనిపోయిరి. మా నాయనకూడా తండ్రి అడుగుజాడలలోనే నడచెను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబళించెను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువగాని, ఎక్కువగాని కాకుండ యధాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుచుంటిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండెను. కారణములేమియు లేకుండగనే సద్యః కలహములు వచ్చుచుండెను. పరమశాంతులయిన బంధుమిత్రులు మాయింట అడుగు పెట్టిన కొలదిసేపటికే రౌద్ర స్వభావము పొంది జగదములకు దిగగా అది కలహాల నిలయమాయెను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పరుండినపుడు నా కుమారుడు నా ఛాతిపై కూర్చొని తన రెండుచేతులతో నా పీక పిసిగివేయతలంచెను. నా కోడలు, నీ వయసు వారు చాలామంది వల్లకాటికి చేరియున్నారు. నీవంతు ఎప్పటికి వచ్చునోకదాయని తిట్టిపోసేడిది. నా కూతురు, నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మములో నేనెంత పాపము చేసుకొంటినో కదాయని పరుష వాక్యములాడెడిది. నా అల్లుడు, మా యింటిలో సరియైన సేవకులు లేరైరిరి. దుక్కలాగున ఉన్నావు. మా యింటికి వచ్చి యిల్లూ వాకిలి ఊడ్చుట, గొడ్లచావడిలో గోసేవచేయుట, అవసరమైనపుడు బ్రాహ్మణార్ధమునకు పోయి తిలదానము పట్టుట మొదలయిన పనులు చేయవచ్చును గదా! మేము పస్తులుండి అయిననూ నీకు బకాసుర భోజనము సిద్ధము చేయగలవారము. నీవే వంటావార్పు చేసి నీవు తినగా ఏమయినా మిగిలినచో మాకు కూడా ఒక కబళము భోజనము పెట్టవచ్చును గదా! అని వ్యంగ్యోక్తులతో హింసించెడివాడు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాకు జీవితము కంటకప్రాయమైనది. ప్రతీ జీవికినీ, జీవించుటయందు ఆసక్తి కలిగి, జీవించుటలో మాధుర్యమున్నదని తోచును. అయితే నా విషయములో జీవిన్చుటలో మాధుర్యము లేదని తేలిపోయినది. అయినచో బలవంతముగా ఆత్మహత్య చేసుకొని మరణించుదమన్న పిశాచజన్మ లభించునేమోయని భయము. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరుగవని నాకు స్పష్టముగా తోచినది. ఒకనాడు నేను మా యింటిలో నున్న గొడ్లచావడిలో నాకు అప్పజెప్పబడిన పనులను అన్నింటినీ పూర్తిచేసుకుని భోజనము చేయుటకు ఉద్యుక్తుడనయితిని. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నమును పెట్టినది. అది దుర్వాసన కలిగియున్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసియున్న నాకు, మిక్కుటముగానున్న క్షుద్భాధ మరింత హింస కలిగించినది. కన్నీళ్లు కార్చుదమన్ననూ ఓపికలేని స్థితిలో నుంటిని. దుర్వాసనతో కూడియున్న అన్నమును తినజాలను. ఆకలిబాధకు తట్టుకొనజాలను. కడున్గాడు దైన్యస్థితిలో నున్న నాకు యీ లోకము, యీ జనులు, యీ బాంధవ్యములన్నియూ సత్యములేనా? లేక యిదంతయునూ ఒక యింద్రజాల మహేంద్రజాలమా? అని మనసులో శంక కలిగినది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు మొద్దుబారిపోయినది.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఇటువంటి విశామపరిస్తితిలో ఒక అవధూత నేనున్న గొడ్లచావడిలో నాకు దర్శనమిచ్చెను. కరుణారసము మహాప్రవాహము వలె అతని కండ్ల నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణము పసిబాలునివలె వెక్కి వెక్కి ఏడ్చితిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరములనుండి తెలియుననెడి జ్ఞానము కలిగినది. నేను ఆ అవధూత దివ్య శ్రీచరణముల పైబడి ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకొంటిని. ఆ అవధూత తన దివ్య హస్తములతో ఆ అన్నమును స్పృశించెను. కంచములోని ఆ అన్నము అదృశ్యమాయెను. ఆ కంచములో 'హల్వా' అని పిలువబడు తీపిపదార్థముండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్పభాగమును స్వీకరించి మిగిలినది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టిగా తింటిని. నాలో జవసత్వములు పుంజుకొనినవి. ఆ అవధూత నన్ను ఒక గునపముతో ఈశాన్యమూల త్రవ్వుమనెను. నిలువెత్తుగొయ్యి తీసిన తదుపరి దానిలో రెండు కుక్కల అస్థిపంజరములు బయల్పడినవి. వాటిని నేను అవతల పారవైచితిని. అవధూత నావద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పూడ్చితిని. అంతట ఆ అవధూత యిట్లు సెలవిచ్చెను. నీకు పిశాచబాధా నివృత్తిని చేసితిని. నీ గృహమునకు యిప్పుడు స్థలశుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునుండి నీకు పిలుపువచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పీఠికాపురములో కలుసుకొందుము."</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను కట్టుబట్టలతో పీఠికాపురమునకు పయనమైతిని. ఇంటిలోని వారెవరికినీ చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంతదూరము పోవుసరికి సాయంసంధ్య సమీపించుచుండెను. ఒక మామిడితోట గుండా ప్రయాణము చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అనునతడు నన్ను మిగుల ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రికి తన యింత ఆతిథ్యమును తీసుకొనవలసినదని బ్రతిమాలేను. నేను సరే యంటిని. ఉదయము నేను స్నానసంధ్యలు నేరవేర్చుకొనిన తదుపరి నాకు వస్త్రదానమొనర్చి, కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే సక్రమముగా ఏర్పాట్లు జరుగుచుండుటను గమనించిన నాకు ఆశ్చర్యము కలిగెను. అంతట ఆ రైతు "అయ్యా! నిన్న మధ్యాహ్న సమయము నందు ఒక అవధూత స్వప్నదర్శనమిచ్చి సాయంసంధ్య యందు సద్బ్రాహ్మణుడొకడు పాదచారియై తోటమార్గమున బోవుచుండుననియూ, అతనికి ఆతిధ్యమిచ్చి, ఆ మరునాడు వస్త్ర దానము చేసి, దక్షిణ కూడా యీయవలసినదనియూ, అతనికి భుజించుటకు మామిడి పండ్లను యీయవలసినదనియూ చెప్పెను. తమ దర్శనభాగ్యము కలిగినది. మీకు సేవచేసుకొను అదృష్టము కూడా కలిగినది. ధన్యుడనయితిని." అని సంబరముగా చెప్పెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఈ వృత్తాంతమును బట్టి ఆ అవధూతలో అతీతశక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమయినది. నేను వేదమునందలి ఋచలను వల్లెవేసుకొనుచూ ప్రయాణము చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదమును వల్లెవేసుకొనుచూ పోవుచుండగా నాలోని నరనరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించితిని. ఆ విద్యుత్ ప్రవాహమువలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేదపండితుడు వడివడిగా వచ్చుటను గమనించితిని. అతడు వేదమునందలి సావిత్రిపన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపితిని. అంతట ఆ వేదపండితుడు "సావిత్రిపన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజమహర్షి సవితృకాఠక చయనము చేసెను. అది కూడా పీఠికాపురములోనే చేసెను. ఆ దత్తప్రభువు ఏనాడో యిచ్చిన వాగ్దానము ననుసరించి నేడు పీఠికాపురము శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము.<b><span style="color: #674ea7;"> వేదములను పఠిoచు అధికారము బ్రాహ్మణులకే యీయబడిననూ వేదములను అధ్యయనము చేయు అధికారము మాత్రము సర్వ వర్ణముల వారికినీ యీయబడినది. </span></b>బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీక్రిష్ణుడో ? బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్ళను నెత్తిపై జల్లుకొనువాడు. పీఠికాపురము నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు. " అని పలికెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను వారిని అయ్యా! శ్రీపాదశ్రీవల్లభులననెవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేదపండితుడు "నాయనా! శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వపాపక్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురము. పూర్వయుగములందలి మహాత్ములు అవసరము ఏర్పడినపుడు అవతారపురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగము నందు సుశీల, విష్ణుదత్తుడను పుణ్యదంపతులుండెడివారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయమాతతో తాదాత్మ్యస్థితినందుండెడిది. దత్తజయంతి రోజున ఆమె ప్రసవవేదనను అనుభవించెడిది. విష్ణుదత్తుడు తన సాధనావిశేషములతో అత్రిమహర్షులవారితో తాదాత్మ్యస్థితినొందెడివారు. ఈ తాదాత్మ్యస్థితి అనునది అభౌతికము, అప్రాకృతిము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతీమహారాణి, అప్పలరాజశర్మగా జన్మించిరి. వారి తపఃఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానముగా జన్మించిరి. వారు కృష్ణయజుర్వేడులు, ఆపస్తంభసూత్రులు, భారద్వాజ గోత్రీకులు, పూర్వయుగము నందలి లాభాద మహర్షియను వైశ్యముని, వాసవీకన్యకా అవతారమునందు భాస్కరాచార్యునిగానూ, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతీ మహారాణికి తండ్రియైన బాపనార్యులుగానూ జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్యవంతులను దర్శనము చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును, దక్షిణను యిచ్చిన రైతు పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠియను వారివద్ద పూర్వజన్మ నందు పాలేరుగా ఉండెడివాడు. పరమ పవిత్రులయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యమువలన అతడు భూస్వామియై సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును శ్రీపాదులవారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారియందు వాత్సల్యభక్తి మెండు." అని వివరించిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
తదుపరి నేను "అయ్యా! కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బన్ధములని గమనించితిని. యజ్ఞము చేయునపుడు పవమానఘటము బ్రద్దలైనయెడల ఆ ఘటముతో బాటు అధ్వర్యుని శిరస్సు గూడ వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలములోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరబాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదయినా ప్రమాదవశాత్తు బ్రద్దలైనచో అధ్వర్యుని శిరస్సు బ్రద్దలగుట లేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు, శుభములను కలిగించునవి గాని, అశుభములను కలిగించునవి గాని, సంభవింపకపోవుట చేతనే నాస్తికులు వేద శాస్త్రములను అవహేళనము చెయుచున్నారు." అని వారినడిగితిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
దానికి ప్రతిగా ఆ మహామహులిట్లు వచించిరి. "నాయనా! ప్రస్తుత కాలములో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్ధములు లెవు. యజ్ఞమును నిర్వహించు అధ్వర్యుడు గొప్పసాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా నుండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయినవాడు అధ్వర్యుడై యజ్ఞమును చేసినయెడల సద్యఃఫలితము గల్గి లోకశ్రేయస్సు కలుగును. అట్లుగాక నామ మాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలోనిచ్చే దక్షిణలలో 16, 116, 1116 అనెడి సంఖ్యా భేదములకు కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనునది పితృసంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంతవరకూ మార్పుచెందినది. సాపిండ్యమనునది మాతృసంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు, ధనము అను రెండు ఫలములు గలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీయనెడి అగ్ని ముఖ్యముగా కావలెను. <b><span style="color: #674ea7;">గుణభేదమే లేని శ్రీపాదులవారికి కులభేదము లెట్లుండును. వారు భావాద్వైతమును బోధించుచున్నారు. కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదులవారు పక్షపాతరహితులు. ఆదిశంకరులు హేమవిద్యను సత్వగుణప్రధానులైన బ్రాహ్మణులకుపదేశింపక, రజోగుణ ప్రధానులును, పరోపకార పరాయణులునగు కల్లుగీసుకొని జీవించు గౌడకులస్థులకుపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్ణ, వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపజేతురు. </span></b>ఆదిశంకరుల వారు హేమవిద్యను బ్రాహ్మణులకుపదేశించిన వారు లోభులై, ధన వ్యామొహాదులందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరిచిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనెడు యీ ఎనిమిదింటిని జడ ప్రకృతులందురు. చిత్ప్రకృతితో కలిపిన యెడల యివి తొమ్మిదగును. ఒకటి అనునది చిత్ప్రకృతికి ప్రతీకము. రెండు నుండి తొమ్మిది వరకు ఉన్న యీ ఎనిమిది అంకెలు ఎనిమిది జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనునది బ్రహ్మతత్త్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన తొమ్మిది అంకెలవలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమైయున్నది. శ్రీపాదులవారు రెండు చపాతీల కోసము 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ' అని హాస్యముగా భిక్ష అడుగుచుండెడివారు. ఇది 2498 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతీకదలికలోనూ, వాక్కులోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల, సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోనుకాని బ్రహ్మతత్త్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదులవారు అర్థనారీశ్వరులు."</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(ఇంకా ఉంది.. ) </div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-57867071310759892962012-10-07T13:44:00.005-04:002012-10-07T13:44:36.784-04:00Chapter 18 Part 3 ( Last Part) <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange; font-size: large;">అధ్యాయము 18</span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">రావిదాసును గురించి వర్ణనము - భాగము 3</span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాదుల విరాట్ స్వరూపము</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
కొంతసేపైన తదుపరి కండ్లు తెరువవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. తదుపరి శ్రీపాదులవారు "మా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగదు. సృష్టివిధానము చిత్రవిచిత్రముగా ఉన్నది.<b><span style="color: #674ea7;"> నిరాకారుడనయిన నేను నరాకారముగా మీ ముందునకు వచ్చుట కడుచోద్యము. నిర్గుణుడనయిన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులు, అవధులు లేని నేను పరిమితులతో, అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింతను గొలుపు విషయము. సర్వశక్తులునూ నా కరస్ధమయి ఉన్నవి. ఈ అనంతకోటి బ్రహ్మాండము నందలి ప్రతీ అణువు అణువు లోనూ ఉన్నవాడిని నేనే. అణువణువునూ కలిపి ఉంచెడి సంకల్ప స్వరూపము నేనే! అణువణువునూ విడగొట్టగలిగి నూతన సృష్టిరచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే! ఇది జ్ఞానమని, ఇది అజ్ఞానమని మీకు బోధచేయుచూ సర్వజీవులనూ అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచూ, ఆర్తితో పిలిచినపుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకొని సంరక్షించు అనాది తత్త్వమును నేనే! అన్ని జీవులలోనూ 'నేను' 'నేను' అని తోచుచున్న అసలుసిసలైన 'నేను'ను నేనే! అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకున్నయెడల మీరు ఆశ్చర్యపోవలయునే కాని, అవి మీకు వ్యక్తమై అనుభవము నిచ్చుచున్నపుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది?" </span></b>అని శలవిచ్చిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
పరబ్రహ్మస్వరూపులైన శ్రీ గురుదేవులు యీ ప్రకారముగా చెప్పుచుండ ఎచ్చటినుండియో ఘంటానాదము వినబడినది. అందరునూ ఆశ్చర్యపడుచుండగా ఆ ఘంట శ్రీచరణముల మ్రోలవాలినది. కొద్దిక్షణముల అనంతరము అందరునూ చూచుచుండగా అది అంతర్హితమైనది.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">స్త్రీల యందు శ్రీపాదుల వారి మాతృభావన </span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదులిట్లనిరి. "<b><span style="color: #674ea7;">ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యః ఫలములను ప్రసాదించు మహావతారము.</span></b> మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడనూ పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగవిఘ్నములను జయించలేడు. ఓయీ! వల్లభేశా! వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలముచేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేకరకముల అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే! వారి సంతానము కూడా నీ యందు వైరభావమును కలిగియున్న విషయము కూడా మాకు అవగతమే! చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి, నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసినయెడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో ముగ్గురు దొంగలను వధించెదము. నాలుగవ వాడు స్వల్పదోషి గనుక విడిచిపెట్టెదము."</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదుల వచనములను విని వల్లభేశుని భార్య కండ్లనీరు పెట్టుకొనుచున్నది. అంతట శ్రీపాదులిట్లనిరి. "అమ్మా! శ్రీపాద శ్రీవల్లభుడైన నేను ప్రతీ స్త్రీయందును నాకు జన్మనిచ్చిన అఖండసౌభాగ్యవతి సుమతీ మహారాణినే చూచుచుందును. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికినీ పసిబిడ్డనే! నీవు దుఃఖింపకుము. నేనిచ్చెడి యీ పసుపుకోమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించెదవు. మా శాసనము శిలాశాసనము. యీ సృష్టిలోనే ఏ శక్తికి కూడ దానిని మార్చుటకు సాధ్యము కాదు.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #674ea7;">నాకు గాయత్రీ మంత్రోపదేశమును చేసిన నా మొదటిగురువైన మా తండ్రిగారి పేరు చిరస్థాయిగా చేయదలంచితిని. అందులకు మా తండ్రిగారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నృశింహ సరస్వతి అను పేరా మా తదుపరి అవతారము ఆవిర్భవించనున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపమును గూడ చిరస్థాయిగా చేయదలంచితిని. దానికి ప్రతిగా నృశింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తులా మా తాతగారి రూపమునే పోలియుండును.</span></b> మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేదవిద్యను గ్రహించితిని. మీరిప్పుడు చూచిన యీ ఘంట ఒకప్పుడు మా తాతగారింటనుండెడిది. అది నా సంకల్పమున సాధకులననుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలిపొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమి పైపొరలలో నుండి కూడా ప్రయాణించగలదు. శంకరభట్టూ! నీవు రచించెడి శ్రీపాద శ్రీవల్లభ చరితాంరుతము తెలుగు ప్రతిలోని జయసంఖ్యారూపమైన పదునెనిమిదవ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ ఘంట తిరిగి పీఠికాపురము చేరును. ఈ ఘంట అనేక ఆకారములు మారి, పరిమాణములు మారి నా సంకల్పము ప్రకారము నడచుకొనును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థాన మేర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయజయధ్వానరూపమైన ఘంటను పీఠికాపురము పంపించెదను."</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!</span></b></div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-71476746358804287172012-09-02T13:15:00.002-04:002012-09-02T13:15:47.177-04:00Chapter 18 Part 2<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: left;">
<div style="text-align: center;">
<span style="color: orange; font-size: large;"><b>అధ్యాయము 18</b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #cc0000; font-size: large;"><b>రావిదాసును గురించిన వర్ణనము - భాగము 2</b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;"><b>భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు</b></span></div>
<br />
<div style="text-align: justify;">
కురుంగడ్డ వైపునకు రావిదాసు పడవనడపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడొకడుండెను. తాను బ్రహ్మజాతికి చెందినవాడయిన కారణమున యితరులు తనపడవలో ఎక్కిన యెడల స్పృశ్యతాదోషము కలుగుననియూ, అందుచేత తననొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవలయుననియూ ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యము చెల్లించవలసియుండునని రావిదాసు పలికెను. నేను మహాపండితుడను. శ్రీపాదులవారి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన యెడల నా విద్వత్తును గమనించి భూరిసంభావననిచ్చును. అద్దాని నుండి నీకు మూల్యమును చెల్లించెదనని ఆ పండితుడు పలికెను. రావిదాసు సరే అనెను. పడవ ప్రయాణము సాగుచుండెను. మాటల సందర్భమున రావిదాసుకు పురాణేతిహాసముల గూర్చి కూడ ఏమియునూ తెలియదని పండితుడు గమనించి, ఓయీ! నా జన్మ చరితార్ధము. పురాణేతిహాసముల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానము లేని నీ జన్మ నాలుగింట మూడు వంతులు వ్యర్ధమనెను. రావిదాసు మిన్నకుండెను. నదీప్రవాహము మిక్కుటముగానుండెను. దానికి తోడు పడవలో రంధ్రముపడి నీళ్ళు పడవలోనికి రాసాగెను. అయ్యా! మీకు ఈతవచ్చునా? అని రావిదాసు అడిగెను. పండితుడు ఈత రాదనెను. అంతట రావిదాసు, నాకు ఈతవచ్చును, మీకు ఈతరాదు అందువలన మీ జీవితము నూటికి నూరుపాళ్ళు వ్యర్ధమే అనెను. రావిదాసు శ్రీపాదవల్లభుల నామమునుచ్ఛరించుచూ నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీమధ్యమున గోచరించెను. అది అంతయునూ శ్రీపాదులవారి మహిమయని రావిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్యహస్తమేదో ఆ నీటినంతనూ బయటకు పారబోయుచుండెను. ఇద్దరునూ శ్రీపాదులవారి దర్శనమునకు వచ్చిరి. రావిదాసు యింతకు పూర్వము శ్రీపాదులవారికి ఎప్పుడు నమస్కరించిననూ వారు నిర్లక్ష్యధోరణితో తిరస్కరించుచుండిరి. కాని యీనాడు మాత్రము రావిదాసు నమస్కరించినపుడు ప్రసన్నవదనముతో మందహాసము చేసిరి. రావిదాసుతో వచ్చిన పండితుని మాత్రము నిర్లక్ష్యముగా చూసిరి. శాస్త్రచర్చను కోరిన పండితుడు నోటిమాటరాక నిలుచుండెను. శ్రీపాదుల వారు, "ఓరీ! పాండిత్యగర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడవై యుండి, సద్వంశమున జన్మించి పుణ్యమును సముపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టు కొనుచుంటివి. కట్టుకున్న మహాయిల్లాలును క్షోభపెట్టితివి. సుఖముగా కాపురము చేసుకొనుచున్న ఒకానొక రజకుని ఇల్లాలిని భర్తనుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడుగత్తిగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడుగత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించిననూ మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునేయున్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టుబండ లయినందులకు మానసికముగా చెప్పరాని క్షోభనొందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను యీ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించితిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడియున్నది. నీకు ప్రస్తుతము మరొక మూడు వర్షములు ఆయుష్షును ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయినయెడల నీ కర్మకు నిన్ను వదిలివేసెదను. నీవు పండితుడవే! సందేహము లేదు, నీ విద్వత్తునకు సంభావన నీయమందువా? లేక మరో మూడు వర్షములు ఆయుష్షును యీయమందువా? తక్షణమే సమాధానమీయవలసినది." అని అడిగిరి. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదులవారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటి మాటరాక మూగవానివలె నుండెను. వాని హృదయములో తన ఆయుష్షును పెరుగవలెననెడి కోరిక యుండెను. కాని నోటమాటరాలేదు. శ్రీపాదుల వారే "నీ హృదయమునందలి కోరికననుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను. నీవు ఉంపుడుకత్తెగా చేసుకున్న రజకవనిత వచ్చే జన్మములో నీ భార్య కావలసి ఉన్నది. కాని యీ జన్మములోనే ఆమెను నీ దానిగా చేసుకుంటివి. ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమమును ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములనుభవించెదరు. నీవు నపుంసక జన్మనొంది ఆ రజకవనితకు సేవలు చేయుచూ కర్మఫలముననుభవించెదవు. నీవు యీ మూడు వర్శములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్నవస్త్రములకు లోటులేకుండా రజకవనిత వద్ద సేవచేసుకొనెదవు. దుష్కర్మలనాచరించిన రజక దంపతుల సేవచేయుచూ శ్రమకు తగ్గ ఫలితము లేక నానా యాతనలను అనుభవించెదవు. మరణము నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రావిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాద్దత్తావతారమైన నన్ను సేవించు కొనగలడు. నీవు శీఘ్రముగా ఈ పుణ్యభూమినుండి వైదొలగవలసినది." అని ఆజ్ఞాపించిరి. ఆ పండితుడు వెడలిపోయెను. రావిదాసు శ్రీపాదులవారి దుస్తులను ఉతుకుటయూ, ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరచుటయూ మొదలగు సేవలను చేసుకొను చుండెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదులవారు నదీస్నానానికి వచ్చినప్పుడల్లా రావిదాసు శ్రీగురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసుకొనెడివాడు. శ్రీపాదులవారు ప్రసన్నవదనముతో వాని నమస్కారములను స్వీకరించెడివారు. రావిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదులవారు సర్వాంతర్యామి గనుక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందలమంది చేత నమస్కరించబడెడి మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పియుండెను. అయితే యీ నమస్కారములను వారు అంగీకరించినపుడు మాత్రమే ఈ మహాయోగము కలుగుననికూడా తన తండ్రి చెప్పియుండెను. రావిదాసు తన నమస్కారములను శ్రీపాదులవారు అంగీకరించుటవలన అమితానందముతో నుండెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
రావిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతీజనముతో కలసి జలక్రీడలాడుటను గాంచి తను గూడా మహారాజు జన్మనెత్తిన బాగుండునని మనస్సున తలంచెను. శ్రీపాదులవారు నదీ స్నానమునకు పోవునపుడు వారితో సంభాషించు సందర్భమున ఈ విషయము చర్చకువచ్చి, రావిదాసునకు యవనవంశమందు వైడూర్యనగరమున జన్మించునట్లు వారు వరదానమొసంగిరి. తాము నృశింహ సరస్వతీ అవతారమందు వానికి దర్శనభాగ్యమి చ్చెదమని అభయమొసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రావిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రములకు అగుపడెడి యీ వింతదృశ్యములను చూచుచూ నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదులవారు నా వంకచూసి మందహాసము చేసిరి. క్షణక్షణ లీలావిహారి అయిన శ్రీగురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులయిన తమ భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమయిన వరులను కోరి అచ్చటికి వచ్చిరి. వారందరికీ శ్రీగురుదేవులు పసుపుకొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరునూ మహాదానందముతో అచ్చట నుండి వెడలుచుండిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">వల్లభేశునకు శ్రీపాదుల కృపతో అక్షయపాత్ర అనుగ్రహము</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఇంతలో ఒక యువబ్రాహ్మణుడు అచ్చటికి వచ్చెను. ధూళిదూసరిత దేహముతో నుండెను. అతడు కాశ్యపస గోత్రీకుడు. ఆపస్తంబసూత్రుడు. వల్లభేశ్వరశర్మ అనునది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారము నుండి వచ్చినవాడు. శ్రీపాదులవారు పీఠికాపురమునందలి తన ఆత్మీయులను పేరుపేరునా అడిగి వారి క్షేమసమాచారములను తెలిసికొనెను. సర్వజ్ఞులయినవారికి యిది ఒకరకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్నభిక్షకు ఎందరెందరో భక్ష్యభోజ్యములను తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తమ దివ్యహస్తములను పైకిచాచిరి. ఒక పెద్ద వెండిపాత్ర నిండుగా 'ఖీర్' అనబడు పాయసమందుండెను. అచ్చట సమావిష్టులయిన శిష్యగణములకు దాని పంచిపెట్టవలసినదని శ్రీపాదులవారు నన్ను ఆదేశించిరి. ఎంతమందికి పంచిననూ పాత్రయందు పాయసము మాత్రము నిండుగానే ఉండెను. తనశిష్యులు తెచ్చిన భక్ష్యభోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించిరి. ఈ కార్యము రావిదాసుకు అప్పగించబడెను. నదిలోని జలచారములకు కూడా స్వామిప్రసాదము వితరణ గావించబడెను. శ్రీపాదులు వల్లభేశుని తమదగ్గర కూర్చొనమనిరి. వల్లభేశుని ప్రక్కనే నేను కూర్చొంటిని. నా ప్రక్కన సుబ్బణ్ణశాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చొండెను. ఒక బీదబ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధమును కుదర్చమని స్వామిని ప్రార్థించెను. అంతట శ్రీపాదులవారు "నేనుండగా నీకు భయమెందులకు? పాపము ఉన్నచోటనే భయముండును. ఈ వల్లభేశుడే నీకు అల్లుడు. సుబ్బణ్ణశాస్త్రి పౌరోహిత్యము వహించును. వల్లభేశుని పితృదేవతలు చాలా ఆగ్రహముగా నున్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాదికర్మలు, సభక్తికముగా చేసెడి పిండప్రదానములు మాత్రమే వారికి చేరును. అన్యధా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహమంత్రములను చదువవలెను. మాంగల్యభాగ్యము కొరకు పసుపుకొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మీకండిన ప్రసాదము మహాదుర్లభమైనది. పీఠికాపురమునందలి మల్లాదివారు, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు, వత్సవాయివారు నాకు నైవేద్యముగా పాయసమును చేసిరి. దానినే నేను మీకు పంచితిని. బ్రహ్మరాక్షసులు, మహాపిశాచాములు, అను మహాదుష్టశక్తుల వలన పీడింపబడువారికి తక్షణమే యీ ప్రసాదము వలన బాధానివృత్తి కలుగును. దారిద్ర్య దుఃఖములో మ్రగ్గెడివారికి యీ ప్రసాద స్వీకరానంతరము సంపద అభివృద్ధి చెందును." అని తెలిపిరి. ఈ దివ్యభాషణము చేయుసందర్భమున శ్రీపాదులవారి చెక్కిళ్ళ నుండి అశ్రువులు జాలువారినవి. డగ్గుత్తిక చెందిన గొంతుతో శ్రీపాదులవారు "<b><span style="color: #674ea7;">మల్లాదివారి, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి, వత్సవాయి వారి వంశములతోను నాకున్న ఋణానుబంధము కాలాతీతము. వారి వాత్సల్యభక్తికి నేను పరవశించెదను. నాకేదయినా తినుటకు దొరకునేమోయని నేను వారి వంటయిళ్ళలోనికి సూక్ష్మరూపములో యధేచ్ఛగా పోవుచుందును. వారే కాదు! ఎవరయిననూ సరే నన్ను వాత్సల్యభక్తితో ఆరాధించిన వారి యిండ్లయందు నేను పసిబాలుడనై తిరుగుచుందును. నా అడుగుల సవ్వడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళలయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరునూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచాములు మహా ఆర్తితో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మ్రింగివేసి వాటికి నవ్యములయిన విముక్తదేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్యశక్తులు, మహాపదార్ధమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందు కొరకై వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధులలో నున్న మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు.</span></b> మీరు ఆనందముగా ఏరు దాటిపోవలసినది. నా ఆజ్ఞ అనుల్లంఘనీయము." అని ఆజ్ఞాపించిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మేము ఏరుదాటి యీవలి ఒడ్డున ఉన్న పల్లెను చేరితిమి. కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బణ్ణశాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహమంత్రములే తెలియునుగాని, ప్రేతసంస్కారకర్మల గురించి, ఆయామంత్రముల గూర్చి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి విననూలేదు, కననూలేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బణ్ణ బ్రహ్మ స్థానమున కూర్చుండెను.అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను. అది సుబ్బణ్ణకే ఆశ్చర్యము! ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహమంత్రములతో వారికి వివాహము జరిపించబడెను. మంగళసూత్రమునకు బదులుగా పసుపుకొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు. వరుడు కూడా నిర్ధనుడే. వివాహసందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధముగా జరుగక పోవుటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేశునకు తల్లియు తండ్రియు కూడ లేరు. కన్య తల్లిదండ్రులును, వరుడును, పురోహితుడును, నేనును కలిపి అయిదుగురుము మాత్రమే! ఆ తరువాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదులవారి దర్శనమునకు పోయితిమి. శ్రీస్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందపరచిరి. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసినదని వారు శలవిచ్చిరి. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేశుని భవిష్యత్తు గోచరించెను. వల్లభేషుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చిన యెడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేషధనమును సంపాదించెను. అయితే మ్రొక్కు తీర్చుటకు వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదులవారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్తరూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రమున్నవి. అతడు ధనమును తీసికొని కురుంగడ్డకు వచ్చుచుండగా నలుగురు దొంగలు యాత్రికులవేషమున యితనితో కలసి వచ్చి వల్లభేశుని వధించినారు. అతడు తన తల నరకబడు సమయములో శ్రీపాద వల్లభులను స్మరించెను. శ్రీపాడులవారు త్రిశూలధారి అయిన యతిరూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించెను. నాలుగవవాడు తానెన్నడు దొంగతనం కూడా చేయలేదనియూ, ఈ ముగ్గురు దొంగలును మార్గమధ్యంలో తనని కలిసినారనియూ, ప్రలోభపరచెడి వారి మాటలకు లోనయి వారితో కుమ్మక్కయినాననియు, తనను రక్షించవలసినదనియూ, వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి, కొంచెం విభూతిని ప్రసాదించి, వల్లభేశుని శరీరంపై చల్లమనియూ, వాని తలనూ, మొండెమునూ అతికించ వలసినదనియూ ఆజ్ఞాపించిరి. శ్రీవారి అమృతదృష్టి వలన వల్లభేశుడు పునరుజ్జీవితుడయ్యెను. ఆ దొంగావలన జరిగిన వృత్తాంతమంతయునూ వల్లభేశుడు తెలిసికొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శనభాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేశుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేశుడు తన తప్పు తాను తెలిసికొనెను. వేయిమ్రంది బ్రాహ్మణ్యమునకు అన్నసంతర్పణ చేయుశక్తి తనకు చాలాకాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్థోమతలో నాలుగువేల మందికైననూ సునాయాసముగా అన్నసంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి యిక్కట్లను కొనితెచ్చుకొన్నందులకు ప్రతిగా నాలుగువేల మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్నసంతర్పణ చేయించెను.</div>
<br />
(ఇంకా ఉంది...) </div>
</div>
jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-49652351813868122552012-04-27T16:14:00.001-04:002012-04-27T16:14:29.088-04:00Chapter 18 Part 1<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange; font-size: large;">అధ్యాయము 18 </span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">రావిదాసును గురించిన వర్ణనము - భాగము 1 </span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాదుల వారి దివ్యమంగళ దర్శనము </span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కురుంగడ్డ (కురువపురము) చేరితిని. <b><span style="color: #674ea7;">అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆదిమధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు </span></b>కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్యమంగళ స్వరూపమునుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాదనమస్కారము చేసికొనమనిరి. నేను శ్రీపాదములను స్పర్శచేయునపుడు తమ కమండలమునుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమియునూ మాట్లాడకుండగనే అతితియ్యని కంఠస్వరముతో దివ్యశ్రీచరణులవారు "నాయనా! శంకరభట్టూ! నీ యందలి ప్రేమాతిశయమున నిన్ను యిచ్చటకు ఆకర్షించితిని." అని పలికిరి. ఆ పలుకుల తియ్యదనమును, అపారమైన వారి కారుణ్యామృతదృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకునూ అభయప్రదానమొనరింప సశక్తమగు, అనంతశక్తిసంపన్నమైన వారి దివ్యహస్తమును నా మస్తకముపైనుంచిరి. నాలోని కుండలినీశక్తి ఒక్కసారిగా విజ్రుంభించి నన్ను వివశునిచేసినది. నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమునూ అంతర్ధానమగునట్లు తోచినది. వెయ్యి సముద్రములు ఒక్కసారిగా విజ్రుంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరనరములను దహించి వేయుచూ మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతపడినవి. హృదయస్పందనము, నాడీస్పందనము నిలిచిపోయినవి. నా మనస్సు నిర్వికారమై, నిశ్చలత నొంది మహాశూన్యములో నిలిచినది. నా హృదయము నందలి చైతన్యము విశ్వమునందున్న అనంతచైతన్యములో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మస్వరూపమైన ఆనందమాయస్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరియొక పర్యాయము ఆ 'నేను' అనునది కూడా శాంతించి అవ్యక్తమయిన దివ్యానందస్థితిలో నుంటిని. ఆ స్థితిలో నాలోనుండి కోటానుకోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయముల నొందుచున్నవను జ్ఞానము కలుగునపుడు 'నేను' ఈ సర్వచైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ 'నేను' అనునది శమించినపుడు అవ్యక్తమైన దివ్యానందములో నుంటిని. ఇది అంతయునూ నాకు చిత్రవిచిత్రముగా నుండెను.</div>
<div style="text-align: justify;">
<span><span><span><span><br /></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span>అంతట శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చితిని. జగత్తునకు ఆదిగురువులైన శ్రీ వల్లభస్వామి వేయితల్లుల ప్రేమను మరిపించెడి కారుణ్యామృతదృష్టితో నా వైపు చూచుచూ మందహాసమును చేసిరి.</span></span></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;"><b>మ్లేచ్ఛులకు శ్రీవారి దర్శనం </b></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><br /></span></span></span></div>
<div style="text-align: justify;">
నాతో వచ్చిన బ్రాహ్మణద్వయమునకు శ్రీపాదులవారితో మాట్లాడుటకుగాని, వారి దివ్య శ్రీచరణములను స్పృశించుటకుగాని ధైర్యము చాలకుండెను. శ్రీపాదులవారు నావైపుచూచి నీతోవచ్చిన యీ యిద్దరు ఆగంతకులు ఎవరని ప్రశ్నించిరి. "ప్రభూ! దివ్య శ్రీచరణుల దర్శనముకోరి వచ్చిన యీ యిద్దరునూ కూడా బ్రాహ్మణులే!" అని నేనంటిని. దానికి ఆ ప్రశాంతసుందరుడు "నాయనా! వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే! గోమాంస భక్షణచేయు మ్లేచ్ఛులవలె తోచుచున్నారు. యదార్ధమును వీరినడిగియే తెలుసుకొనవచ్చును." అనెను. అంతట ఆ బ్రాహ్మణులిద్దరునూ "అయ్యా! మేము బ్రాహ్మణులము కాము. మ్లేచ్ఛులమే! సందేహము లేదు." అని ముసల్మానులు చదువు కల్మాను చదివిరి. శ్రీవల్లభులు క్షణక్షణ లీలావిహారి. నేను నిర్ఘాంతపోయితిని. అంతట ఆ మహాగురువులు<b><span style="color: #674ea7;"> "శ్రీపాదశ్రీవల్లభుడనెడి </span></b><b><span style="color: #674ea7;">పేరుతో మాయావేషమున సంచరించు </span></b><b><span style="color: #674ea7;">జగత్ప్రభువైన శ్రీ దత్తాత్రేయులవారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల భాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారియందు భక్తిభావము సంపూర్ణముగా కలిగియుండుట మహాభాగ్యము.</span></b> గోవునందు సకల దేవతలునూ ఉందురు. అట్టి గోవు లేని గృహము శ్మశానముతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము, తుష్టిప్రదము. బ్రాహ్మణజన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞయాగాదులందు మేకను బలియిచ్చుట కలదు. యజ్ఞపశువయిన ఆ మేకయేకాక, దానితో రక్తసంబంధముగల అనేక మేకలు తమ నీచజన్మము నుండి విముక్తమై ఉత్తమజన్మల నొందును. శీఘ్రముగనే బ్రాహ్మణజన్మ నొందును. యజ్ఞపశువయిన ఆ మేకను ఆ విధముగా ఉత్తమజన్మల నొందింపగలిగినంత యోగబలము, తపోబలము యజ్ఞమును నిర్వహించువారికి ఉండవలెను. ఆ విధమయిన యోగి, తపోబలము లేక, నామమాత్రముగా యజ్ఞమును నిర్వహించి మేకను బలియిచ్చిన, మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ, కాలములనుబట్టి ధర్మకర్మములు మారుచుండును. మ్లేచ్ఛుడైననూ, మహాతపశ్శాలి అయినయెడల గోమాంస భక్షణ చేసిననూ, అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదియై గోవునకు, దాని రక్త సంబంధము గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లు కాని యెడల మహాపాపము చుట్టుకొనును. అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది, కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ , పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రమెక్కడ లభించునాయని కృష్ణుడు వెదకెను. కృష్ణునకు, అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు నీటి ప్రవాహమునాపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండకోసము వెదకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొనితెచ్చెను. ఆహారమును భుజించిన రైతు తనవద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వైచెను. నరకుచున్న తండ్రిగాని, నరకబడెడి కుమారుడుగాని నరకుట అను క్రియ జరుగునపుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా నుండిరి. సమాజక్షేమమునకు ఆహారము కావలెను. పంటపండించుట అనునది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్షరహితముగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశమునే కౌరవ, పాండవులకు రాబోవు కాలములో యుద్ధక్షేత్రాముగా నుండదగిన ధర్మక్షేత్రాముగా నిర్ణయించెను. ఓయీ! నామమాత్ర బ్రాహ్మణులారా! మీకు గోమాంసభక్షణచేయుట ఎంతమాత్రము సమర్ధనీయముకాదు. అయితే పూర్వ పుణ్యవశమున, మీ పితృదేవతల ప్రార్ధనాబలమున విశేషించి నా అవ్యాజకారుణ్యమువలన మీరు మా దర్శనభాగ్యమును పొందగలిగితిరి. ఇదియే మహాభాగ్యముగా, అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్రజలమును మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే యిచ్చటనుండి బయలుదేరి మీ యిచ్చవచ్చిన చోట్లకు పొండు. మీకు అన్నవస్త్రములకు లోటులేకుండా చూచెదను. మీరు మ్లేచ్ఛవనితలను వివాహమాడి మ్లేచ్ఛధర్మము ననుసరింపుడు. మీచేత చంపబడిన గోవులు మీకు యీ జన్మములోనూ, జన్మాంతరములలోనూ సంతానమై జనించి మిమ్ములను అనేక రకములుగా హింసించుచూ, అత్యంత శ్రమతో మీరు సంపాదించెడి కష్టార్జితమును యధేచ్ఛగా అనుభవించుచూ సుఖించును గాక! అయితే<b><span style="color: #674ea7;"> నా దర్శనభాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తరువాత బడేబాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్దులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు గలిగిన, విలక్షణ అవతారముచే ఉద్ధరింప</span></b><b><span style="color: #674ea7;">బడెదరు గాక!</span></b> మరాఠ దేశమందు శిధిలాగ్రామము గలదు. అది కాలాంతరమున సిద్ధ క్షేత్రమగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నాయొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షరమువలె మార్చుటకు వీలులేనిది. తక్షణము యీ ప్రదేశమును వీడిపోవలసినది. అని వారిరువురిని ఆజ్ఞాపించిరి.</div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>నేనునూ, శ్రీపాదులవారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రావిదాసు అను నామాంతరము గలిగిన రజకుడొకడు వచ్చెను. రావిదాసు శ్రీపాదులవారికి పదేపదే నమస్కరించుచుండెను. కొంతసేపటివరకు శ్రీపాదుల వాని యందు నిర్లక్ష్యముగా నుండిరి. తదుపరి శ్రీపాదులవారు వానివైపుచూచి మందహాసము చేసిరి. దీనికి కారణమేమయి ఉండునాయని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణాదృష్టిని నా వైపు ప్రసరించుచూ నా భ్రూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రమునకు వింత దృశ్యములు కనపడసాగెను.</span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: left;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: left;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>(ఇంకా ఉంది..) </span> </span></span></span> </span> </span></span></span></span> </span></span></span></span></span></span></span></span></div>
</div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2054265037208621703.post-74486008038530970402012-04-25T23:34:00.002-04:002012-04-25T23:34:35.784-04:00Chapter 17 Part 4 (Last Part)<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange; font-size: large;">అధ్యాయము 17 </span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">శ్రీ నామానందుల వారి దర్శనము - భాగము 4 </span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">అనఘాసమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము</span></b></div>
<div style="text-align: justify;">
<span><br /></span></div>
<div style="text-align: justify;">
సుశీలయను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణమగు ఉపాయమును చెప్పమని నామానందులను కోరినది. అంతట ప్రసన్నచిత్తులయిన నామానందుల వారు, "ఆత్మ నిరంతరాయమయినది. మనస్సు ప్రతీ క్షణములోనూ అనేక కోట్లసార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్యాభర్తల సంగమకాలమున వారిరువురిలో ఎవరయినాగాని, లేదా వారిద్దరుగాని తమ మానసికచైతన్యము జీవనిర్జీవస్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవమును పొందినయెడల వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చటి సంసారములను భగ్నముచేయు మహాదోషములవలన మానవునకు నపుంసకత్వము సిద్ధించును. నపుంసక జీవితము మానవునకు నరకప్రాయముగానుండును. అన్యోన్యముగా నుండు దంపతులను విడదీయుట వలననూ, గయ్యాళితనమును ప్రదర్శించి కోడళ్ళను నానావిధములుగా హింసించుట వలననూ, నిర్ధాక్షిన్యముగా శిశు హత్యలను, స్త్రీ హత్యలను చేయుట వలననూ, నిస్సహాయస్థితిలో నుండు అనాధల యెడల పరమ కర్కశత్వమును చూపుట వలననూ నపుంసకత్వము కలుగుట కాని, నపుంసకునకు భార్యగా అగుట గాని తటస్థించును. మానవునకు ఒక స్త్రీ యందు పదిమంది సంతానమును కనుటవరకు హక్కుగలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మవిరుద్ధము. పదిమంది సంతానమును కన్నా తరువాత ఆ స్త్రీని తల్లిగా భావించవలెను. అమ్మా! నీ భర్తకు నపుంసకత్వము పోయి పురుషత్వము సిద్ధించుటకునూ, నీవు అనుకూల దాంపత్యముతో సర్వసుఖములను పొందుటకు అనఘావ్రతము చేసి అనఘాదేవి సమేత శ్రీదత్తాత్రేయుల వారిని సంతుష్టులను చేయుము. తప్పక శ్రీదత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు.<b><span style="color: #674ea7;"> శ్రీపాద శ్రీవల్లభుల వారిని </span></b><b><span style="color: #674ea7;">భజించు వారికి యిహలోక సుఖము, పరలోక సుఖము పుష్కలముగా లభించును.</span></b> శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్తదర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతీ అక్షరమునందును యుగాయుగాంతముల వరకూ చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములయిన విధినిషేదములును లేవు. నేను యీ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటినుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రమును నా మదిలో మొదులుచున్నది. వినండి!</div>
<div style="text-align: justify;">
<span><span><span><br /></span></span></span></div>
<div style="text-align: center;">
<span><span><span><b><span style="color: #38761d; font-size: large;">సిద్ధమంగళ స్తోత్రము </span></b></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><br /></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><b><span style="color: #0b5394;">1 . శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా </span></b></span></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"> జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"><br /></span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;">2 . శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"> జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"><br /></span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;">3 . మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"> జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"><br /></span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;">4 . సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా </span></b></div>
<div style="text-align: justify;">
<span><span><b><span style="color: #0b5394;"> జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ </span></b></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><b><span style="color: #0b5394;"><br /></span></b></span></span></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;">5 . సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజఋషి గోత్రసంభవా </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"> జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"><br /></span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;">6 . దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"> జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"><br /></span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;">7 . పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతా </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"> జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"><br /></span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;">8 . సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"> జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"><br /></span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;">9 . పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా </span></b></div>
<div style="text-align: justify;">
<b><span style="color: #0b5394;"> జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ </span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాయనలారా!<span style="color: #674ea7;"><b> పరమపవిత్రమైన యీ </b></span><span style="color: #674ea7;"><b>సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన యెడల అనఘాష్టమీ వ్రతముచేసి </b></span><span style="color: #674ea7;"><b>సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండలదీక్ష వహించి, ఏకభుక్తము చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర </b></span><span style="color: #674ea7;"><b>సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే </b></span><span style="color: #674ea7;"><b>పఠింప</b></span><span style="color: #674ea7;"><b>బడును. దీనిని </b></span><span style="color: #674ea7;"><b>పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా, కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించినచోట సూక్ష్మవాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుచుందురు."</b></span> అని అమృతవాక్కులను ఆ సుశీలయను బ్రాహ్మణ స్త్రీకి వివరించిరి.</div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: center;">
<span><span><span><span><span><span><span><span><b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాదుల వారి అనుగ్రహము వల్ల నపుంసకత్వము పోవుట </span></b></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span>శ్రీనామానందుల వారి నోటివెంట యీ అమృతవాక్కులు వినిన వెంటనే నాకొక ఆలోచన వచ్చినది. అంతట నేనిట్లంటిని. "మహాపురుషా! ఈ దివ్యస్తోత్ర పారాయణముతో, శ్రీపాదుల వారి దివ్యలీలా విలాసముల కధాప్రసంగాములతో యీ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున యీ రాత్రి గడుపవలెననెడి కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులయిన మహామహులు అనుమతినీయవలెనని విన్నవించుకొనుచున్నవాడను." నాతోబాటు ఉన్న సుశీలయును, బ్రాహ్మణ సోదరులును, నా సూచనకు తమ ఆమోదమును తెలిపిరి. ప్రసన్న హృదయులయిన శ్రీనామానందులు తమ ఆమోదముద్ర వేసిరి. రాత్రి అంతయునూ, శ్రీపాదులవారి నామస్మరణముతోను, వారి లీలాకథా ప్రసంగములతోను, సిద్ధమంగళ స్తోత్ర పఠనముతోనూ గడచినది. ఉషఃకాలమున శ్రీపాదులవారికి దివ్య శ్రీమహామంగళహారతి యీయబడెను.</span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><br /></span></div>
<div style="text-align: justify;">
మహామంగళ హారతి అయిన తరువాత మా ఆశ్రమమునకు ఒక రెండెడ్లబండిపై భోజనసామాగ్రిని వేసికొని బండివాడు ఒకడు వచ్చెను. ఆ బండివాడు సుశీలతో, కొలదిసేపటిలో నీ అత్తమామలును, నీ భర్తయు వేరొక బండిలో యీ ఆశ్రమమునకు చేరుకొనగలరని చెప్పెను. భోజనసామగ్రిని దింపివేసి ఆ బండివాడు వెడలిపోయెను. బండివాడు వచ్చి వెళ్ళిన సమయము లోపల శ్రీ నామనందుల వారు ధ్యానావస్థలో నుండిరి.</div>
<div style="text-align: justify;">
<span><br /></span></div>
<div style="text-align: justify;">
<span>శ్రీనామానందుల వారు ధ్యానావస్థ వదలి ప్రకృతిస్థులయినపుడు బండివాడెక్కడ? అని ఆందోళనతో ప్రశ్నించిరి. బండివాడు వెళ్ళిపోయెనని చెప్పగా, ఆహా! మీరెంత అదృష్టవంతులు! నేనే దురదృష్టవంతుడినని వాపోయిరి. మేమందరమునూ విస్తుపోతిమి. శ్రీ నామానందులు "శ్రీపాదులవారు పరమ కారుణ్యమూర్తి! వారే బండివాని రూపములోవచ్చి మీకు దర్శనమిచ్చిరి. అమ్మా! సుశీలా! నీ అదృష్టము పండినది. నీ భార్తకున్న నపుంసకత్వము పోవుటయేగాక నీ భర్తయునూ, అత్తమామలునూ కొలదిసేపటిలో ఎడ్లబండిలో యిచ్చటకు చేరుకొనుచున్నారు." అని పలికిరి.</span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span>త్రికాలవేదులయిన నామానందులవారు సెలవిచ్చినట్లే జరిగినది. సుశీల తన భర్తతో, అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళినది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపునకు ప్రయాణమవగలందులకు నామానందుల వారిని అనుజ్ఞనడిగితిని. వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిని.</span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;"><b>శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!</b></span></div>
<br />
(అధ్యాయము 17 సమాప్తం)<br />
<span><br /></span></div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-38064161036873233372012-04-25T21:48:00.001-04:002012-04-25T21:48:30.726-04:00Chapter 17 Part 3<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange; font-size: large;">అధ్యాయము 17</span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">శ్రీ నామానందుల వారి దర్శనము - భాగము 3</span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">దత్తారాధనము యొక్క విశిష్టత</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట నేను, "అయ్యా! అటులయినయెడల మనము వివిధరూపములలోనున్న దేవతల నారాధింపవలెనా? లేక శ్రీపాదుల వారినే ఆరాధింపవలెనా? దేవతలందరునూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారనుచుంటిరి. నాకు యీ విషయము కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది." అని వారిని కోరితిని. అందులకు శ్రీ నామానందులు ప్రసన్నులై "ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయెను. చెల్లెలు అత్తగారు అతనితో యిట్లనిరి. అయ్యా! మీ చెల్లెలు మా యింట ఎన్నియో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీపరిమాణములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైన నేను సరిపెట్టుకొందును. ఇన్ని రకముల దొంగతనములా? అని వాపోయునది. అంతట ఆ అన్నగారు చెల్లెలును పిలిచి యిట్లనెను. ఇన్ని పదార్ధములను దొంగలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నియునూ చిక్కటిపాలలో నిబిడీకృతమైయున్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్నిరకముల పదార్ధములలోని సత్తువలు ఒక్క చిక్కటిపాలలో నున్నవి. అందువలన నీవు నీకు కావలసినంత పరిణామములో చిక్కటిపాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్కవస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాటపడుట తప్పిపోవును. అదే విధముగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్నరుచులు గలవారు గనుక భిన్నభిన్న దేవతారాధనలు చేయుచుందురు. శివారాధానము చేసిన యెడల విష్ణువు ప్రత్యక్షము కాడు. విష్ణు ఆరాధనము చేసినయెడల శివుడు ప్రత్యక్షము కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును. భక్తరక్షణ కూడా ఒకే విధముగా నుండును. సగుణ, సాకార భక్తితో చేసేది కర్మలకు ఫలితము, ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలెను గదా! అనేక జన్మలలో చేసేది పాపపురాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహావిశేషముగా ప్రోగవుచున్నపుడు శ్రీదత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనునది లేదు.<b><span style="color: #674ea7;"> విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికినీ శక్తిలేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీదత్తులవారు తమ భక్తుని నుదుటి వ్రాతను చెరిపివేసి క్రొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును.</span></b> జీవుల యొక్క శారీరక, మానసిక ఆధ్యాత్మిక స్థితులన్నియునూ, ఆయాస్థితులలో నుండుటకునూ స్థితికర్తయైన విష్ణువు కారకుడు. తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమయిన యెడల శరీరముగాని, మనస్సుగాని, బుద్ధిగాని, ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలలో సజీవముగా దహనమునొందుచున్నట్లు అనుభవము పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి వాడి కర్మానుసారముగా ఆయా స్థితుల యందుంచును. శ్రీకృష్ణులవారు శ్రీదత్తప్రభువుతో అభిన్నత్వము కలవారు. గోవర్ధనగిరి నుద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోప, గోపికలందరునూ పూర్వజన్మములలో గొప్పఋషులు. యోగగ్రంధులే గిరులు. ఆ గ్రంధులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించునపుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందము కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలనెత్తవలసి యుండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమునంతనూ తాను వహించి, వారి గ్రంథి విభేదనమొనరించి జీవన్ముక్తుల చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతికదృష్టితో చూచువారికి గోవర్ధనగిరినెత్తి తనవారిని రక్షించుట మాత్రమే అవగతమగును. అందువలన<span style="color: #674ea7;"><b> తన భక్తుల వివిధస్థితులను మార్చవలెనని శ్రీదత్తులవారు సంకల్పించిన సామాన్యముగా నడువవలసిన పరిణామక్రమమును శీఘ్రతరము చేయవలసినదని విష్ణువును ఆదేశింప వచ్చును. ఈ ప్రక్రియలో తన భక్తునకు అనుభవములోనికి రావలసిన బాధలను అన్నింటిని భక్తునిచేత అజ్ఞాతస్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తులవారు తమ భుజస్కంధములపై </b></span><span style="color: #674ea7;"><b>వేసు</b></span><span style="color: #674ea7;"><b>కొనె</b></span><span style="color: #674ea7;"><b>దరు. </b></span>వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారము యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుజ్యస్థితి ననుభవించి యోగులను లక్షాపాతికవేల మందిని తయారుచేయుట, కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను లయముచేయు సంకల్పము కలిగిన యెడల శ్రీదత్తులవారిలోని రుద్రాంశ విజ్రుంభించి కోటానుకోట్ల జన్మములు అవి గతించినవయిననూ, రాబోవునవి అయిననూ వాటినన్నింటినీ ధ్వంసముచేసి, ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చును. వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణ్వంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తుని సంరక్షించును. ఇది అంతయునూ వారి సంకల్పమును బట్టి యుండును. వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తిమార్గము నవలంబించవలెను. ఒక పర్యాయము<span style="color: #674ea7;"><b> పీఠికాపురములోని శ్రీపాదులవారి అశ్రితుడొకడు గుఱ్ఱమునెక్కగా అది అతనిని పడదోసి </b></span><span style="color: #674ea7;"><b>త్రొక్కివేసి గాయపరచినది. రక్తసిక్తుడైన ఆ భక్తునివైపు శ్రీపాదులవారు తమ అభాయహస్తమును చూపగా గాయములన్నియునూ క్షణములో మాయమయినవి. శ్రీపాదులవారి యందు నమ్మకము యిసుమంతయు లేని </b></span><span style="color: #674ea7;"><b>మరొకనికి అదేరోజున నూరువరహాలతో నిండిన పాత్రయొకటి లభించును.</b></span> శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠివారు శ్రీపాదులవారిని ఈ విషయమై వివరణ అడిగిరి. అంతట శ్రీపాదుల వారిట్లనిరి. <span style="color: #674ea7;"><b>"నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు. కాని వీని ఆయుర్దాయమును మరొక 20 సంవత్సరములు </b></span><span style="color: #674ea7;"><b>పొడిగించితిని. ఇది వీని అనన్యభక్తికి ప్రతిఫలముగా నేను నిర్ణయించినది. నూరు వరహాలు దొరికినవానికి యీ రోజు మహాదైశ్వర్యము కలుగవలసిన రోజు. కాని వాడికి భక్తీభావము యిసుమంతయు కూడా లేక భక్తులను </b></span><span style="color: #674ea7;"><b>అవహేళనము చేయుచుండుటవలన వాని మహాదైశ్వర్యయోగమును కేవలము నూరువరహాలకు మాత్రమే కుదించి వేసితిని. నాయందు కేవల భక్తిగలవానికి నేను దాసానుదాసుడను. నన్ను తన హృదయములో బంధించుకొన గలిగిన వాడే నిజమైన ప్రభువు.</b></span> త్రిలోకాధిపతియయిన పరమేశ్వరుడు కూడా అటువంటివానికి దాసుడయి సంచరించును." అను సద్విషయములను, సందేశములను తెలియపరచిరి.</div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>శ్రీ నామానందుల వారు యీ రీతిగా సెలవీయగానే మేమందరము ఎంతయో ఆనంద భరితులమయితిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుడని నామానందులను కోరిరి. అంతట నామానందుల వారు "మీరు ఏకభుక్తము చేయుచూ మండల దీక్షను పాటించుడు. మిక్కుటమయిన కాయకష్టము చేసి ధనమును సంపాదించుడు. ఆ ధనమును వ్యయపరచి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేయుడు. అంతట పాపము శమించును. పాపశమనమయినట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా గాని, స్వప్నములో గాని పొందగలరు. మండలదీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశమున పూర్వపు అలవాట్లకు బానిసలయిన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయము." అని తెలిపిరి.</span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: left;">
<br /></div>
<div style="text-align: left;">
(ఇంకా ఉంది..) </div>
</div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-56622751029472197872012-04-23T22:25:00.002-04:002012-04-23T22:25:53.299-04:00Chapter 17 Part 2<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="color: orange; font-size: large;"><b>అధ్యాయము 17</b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #cc0000; font-size: large;"><b>శ్రీనామానందుల వారి వర్ణనము - భాగము 2</b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నా దత్తనామస్మరణమును తన్మయత్వముతో ఆలకించుచూ దారివెంట పోవుచున్న బాటసారి యొకడు మేడిచెట్టుఛాయలో నిలుచుండెను. భయభ్రాంతనైన నేను "ఓయీ! నీవు ఎవ్వడవు? మర్యాదగా యిచటనుండి వెంటనేపొమ్ము. నీవు పోకపోయినచో యిచ్చటనున్న బండరాతినొకటి తీసుకుని నిన్ను చంపివేసెదను. కొలదిసేపటి క్రితమే ఒక కుహనామాంత్రికుని హతమార్చితిని." అంటిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అందులకు ఆ నూతనవ్యక్తి చేతులు జోడించి, "అమ్మా! నేను రజకకులమునందు పుట్టిన రవిదాసు అనుపేరుగల దత్తభక్తుడను. నేను కురువపురమునందు నివసించుచుండును.<b><span style="color: #674ea7;"> శ్రీగురుదత్తులు యీ భూలోకమును పావనము చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ రూపమున కురువపురము నందు విరాజిల్లుచున్నాడు. ఎంతటి దూరదూరములలోనున్న దత్తభక్తులకైననూ తాను యీ భూలోకమునందు అవతరించియున్న శుభవార్తను ఏదో ఒక లీలావిశేషముతో తెలియపరచుచున్నారు. ఇది అనుభవైక వేద్యము! </span></b>నేను ప్రస్తుతము కురువపురమునకు పోవుచున్నాను. నీకు యిష్టమైనచో నాతో రావచ్చును. కురువపురము సమీపమునందే యున్నది. నేను నా బంధువులయింటికి పోయి తిరిగి కురువపురమునకు పోవుచున్నాను." అని పలికెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట నేను "నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పెడి శ్రీపాద శ్రీవల్లభులు ఎవరయి ఉన్నది అని విషయము కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయినచో యీ దీనురాలిని తమ శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడనేనని రుజువుచేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదులవారిపైననే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తక్షణము యీచోటినుండి వెళ్ళకపోయిన యెడల నా నుండి ప్రమాదమును ఎదుర్కొనెదవు." అంటిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అతడు మారు మాటాడక దత్తదిగంబర! దత్తదిగంబర! శ్రీపాదవల్లభ దత్తదిగంబర! అని పాడుకొనుచూ వెడలిపోయెను. తదుపరి ఒకానొక గుట్టమీద పద్మాసనము వేసుకొని ధ్యానము చేసుకొనుచుండగా యీ దుష్టులబారిన పది మీ వలన రక్షింపబడితిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట నేను, "<b><span style="color: #674ea7;">అమ్మా, శ్రీపాదులవారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడితివి. వారు అంతర్యాముగా ఉండని దేశముగాని, వారి ఎరుకలోలేని కాలము గాని యీ సృష్టిలో లేనేలేవు.</span></b> కార్యకారణ సంబంధములతో యీ సృష్టిలో వివిధ దేశములలో, వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వ కారణములకునూ వారే మహాకారణము. రకరకాల స్థితులలో నున్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశకాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణములేని కార్యము సృష్టిలో కానరాదు. శ్రీపాదులవారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా యిటువంటి అన్ని స్థితులకూ అతీతులో ఎవరికినీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియును.<b><span style="color: #674ea7;"> మనము శ్రీపాద శ్రీవల్లభులవారి నామస్మరణము చేసుకొనుచున్న యెడల వారి అనుగ్రహమును తప్పక పొందగలము. అన్ని కష్టనష్టముల నుండి విముక్తిని పొందగలము." </span></b>అని తెలిపితిని. తదుపరి ఆ బ్రాహ్మణ సోదరులతోనూ, సుశీలయను పేరుగల యీ బ్రాహ్మణ యువతితోనూ కలసి కురుంగడ్డ వైపునకు ప్రయాణము సాగించుకొనుచుంటిని. మేమందరమునూ దత్త నామస్మరణము, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచూ ప్రయాణము చేయుచుంటిమి. చూపరులకు మేము భజన బృందమువలె కనుపించుచుంటిమి. ప్రయాణమధ్యములో నామానందుడను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకొంటిమి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">శ్రీదత్తుడు ఛండాలవేషమున వచ్చి నామానందులను అనుగ్రహించుట</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: left;">
<div style="text-align: justify;">
నామనందులవారు త్రికాలవేదులని తెలుసుకొంటిమి. వారు మమ్ములను సాదరముగా ఆహ్వానించిరి. శ్రీనామానందుల వారిట్లు చెప్పసాగిరి. మానాయనగారి పేరు మాయణాచార్యులు. నా పేరు సాయణాచార్యులు. మాది భరద్వాజ గోత్రము. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాసదీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యముతో ఉత్తరదేశమునందలి పుణ్యక్షేత్రములను, సిద్ధక్షేత్రములను దర్శించి నన్నుద్ధరింపగల సద్గురువు ఎవరాయను అన్వేషణలో మార్గమధ్యమున పీఠికాపురమునకు వచ్చితిని. మేము శ్రీ వైష్ణవులమగుటచే శివారాధానము మాకు సమ్మతము కాదు. మడి, ఆచారములను విశేషముగా పాటించువారము. కుంతీమాధవ దర్శనము చేసుకొని బయటకు వచ్చుచు ఛండాలునొకనిని చూచితిని. ఛండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నా సమీపమునకు వచ్చి 'నామానందా! నాకు గురుదక్షిణ సమర్పించి యిచ్చటనుండి కదులుము' అని గద్దించి పలికెను. అంతట నేను నిర్ఘాంతపోతిని. ఊరి నడిబొడ్డునందున్న జనులు యీ వింతను చూచుచుండిరి. ఛండాలుడు శ్రీవైష్ణవబ్రాహ్మణోత్తముని గురుదక్షిణనిమ్మని గద్దించుట కలివైపరీత్యము కాక మరేమీ అని జనులు అనుకొనిరి. వీడెవడో త్రాగివచ్చి యీ వైష్ణవోత్తమునిపై దౌర్జన్యము చేయుచున్నాడని మరి కొందరనుకొనిరి. అంతట నేను, "ఓయీ! నీవేవ్వరవో నాకు తెలియదు, అయిననూ నేను వైష్ణవబ్రాహ్మణుడను, నీవు ఛండాలుడవు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యముగా గురుదక్షిణను అడుగుట ఏమియునూ సబబుగాలేదు." అనంటిని. యింతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేక పోయితిని. వాని కన్నులు చింతనిప్పుల వలె ఎర్రగానుండెను. వాని ముఖకవళికలు ఎంతటివారికయిననూ హడలు పుట్టించునవిగా నుండెను. నా యీ శాంతవచనములకు వాడు ఎంతమాత్రమును లొంగక, "నీవు నన్ను ఎరుగనని దబ్బరలాడుచున్నావు. ఊరూరా తిరుగుచూ, నన్నుద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించునాయని నానా గోత్రములవారిని ప్రశ్నించుచూ పిచ్చికుక్కవలె తిరుగుచున్నావు. బ్రాహ్మణజన్మనెత్తితినని దురహంకారపూరితుడవై సత్యమును కానలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడనెడి సన్యాసనామము నిచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరనున్న సొమ్మంతయూ నాకు గురుదక్షిణగా నిచ్చి అందరునూ చూచుచుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి, లేకపోయిన యీ కత్తితో నీ శరీరమును ఖండఖండములుగా నరికి పోగులు పెట్టెదను. నీ రక్తమును పానము చేసెదను. నీ తలను పదేపదే కుళ్ళపొడిచెదను. నీ శరీరము నుండి ప్రాణములు పోకుండగా కట్టడిచేసెదను. ఖండించబడిన ప్రతీ శరీరభాగమునందునూ చైతన్యమును అనుభవించుచూ ఘోరమైన నరకబాధను అనుభవించెదవు. నాతో వ్యవహారము చాలా నిర్దిష్టముగా నుండును. అవునన్న ఔను, కాదన్న కాదు. రెండే రెండు మాటలు. నీవు ముక్కోటిదేవతలతో ఎవరినీ ప్రార్థించిననూ నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్కదేవత కూడా సాహసింపలేడు." అని కటువుగా పలికెను. ఈ విధమైన కటువచనములను పలికిన ఛండాలుడు తన ఒరలో నున్న కత్తిని దూసి నన్ను చంపబోయెను. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను గత్యంతరము లేని పరిస్థితులలో ఆ ఛండాలునికి సాష్టాంగ ప్రణామమాచరించితిని. నా వద్దనున్న రొఖ్ఖమంతయు గురుదక్షిణగా సమర్పించితిని. దైవమునకు సంబంధించిన వర్ణనలన్నియునూ నాకు కల్పితములుగా తోచెను. అయితే, నా ఊహలను అన్నింటినీ తలక్రిందులుచేయుచూ వారి మోహనమైన దివ్యమంగళరూపము నాకు దృగ్గోచర మాయెను. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహము వలె ప్రవహించుచున్నట్లు తోచెను. ఆ దివ్యమంగళమూర్తి, <span style="color: #674ea7;"><b>"నేను శ్రీదత్తుడను, ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురములో అవతరించితిని. నీవు నా వాడవు. నేను నీ వాడవు. నేను నీ సొత్తు. నీవు నా సొత్తు. మనిద్దరికీ పొత్తు కలిపినది అదే సత్తు, చిత్తు, ఆనందము. </b></span>నీవు నేటినుండి నామానందుడవై ధర్మప్రచారము చేయుచూ, చిరశాంతిని పొందుము. అంత్యమున నా లోకమునకు రాగలవు." అని దీవించెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">నామానందులకు శ్రీపాదుడు స్వహస్తములతో భోజనమిడుట</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అయ్యా! ఈ విధముగా నేను నామానందుడను సన్యాసినైతిని. పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేయగోరితిని. నాకు ఆకలి దహించివేయుచున్నది. ఏ యింటికి పోయిననూ నాకు అన్నమిడువారే కానరారైరి. జనులు నా గురించి వింతవింతగా "ఇతడొక పిచ్చివాడు. ఛండాలుడొకడు త్రాగివచ్చిన మైకములో వీనినుండి గురుదక్షిణ వసూలుచేసెను. ఇతడు బ్రాహ్మణుడయిననూ ఛండాలుని గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు. అందువలన యితనికి భిక్షవేయుట ధర్మశాస్త్ర విరుద్ధము."అని చెప్పుకొనసాగిరి. యీ విధముగా పీఠికాపుర బ్రాహ్మణ్యము నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చుట మానిరి. నేను అప్రయత్నముగనే శ్రీ అప్పలరాజుశర్మ గారింటికి చేరితిని. భవతీ! భిక్షాందేహి! అని పిలుచుటకు కూడా కంఠము పెగలనంతటి నీరసముతోనుంటిని. ఇంతలో తలుపు తెరచుకొని శ్రీపాద శ్రీవల్లభులు అన్నపుపళ్ళెరముతో వచ్చిరి. తమ అరుగుమీద కూర్చొండబెట్టుకొని తమ దివ్యహస్తములతో అన్నమును తినిపించిరి. తమ స్వహస్తములతోనే నా చేతులను, మూతిని తుడిచిరి. అనంత శక్తిస్వరూపమైన తమ వరదహస్తమును నా శిరస్సుపై నుంచి, "నీకు సర్వమునూ సిద్ధము చేయబడును. దేనికోసమూ వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు.<b><span style="color: #674ea7;"> రాతి కిందనున్న కప్పకు సహితము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను </span></b><b><span style="color: #674ea7;">పోషించలేడా? నీవెచ్చటనున్ననూ నీ వెన్నంటియే </span></b><b><span style="color: #674ea7;">నేనుందును. అదృశ్యముగా జంటనై సంచరించెదను. నిన్ను కంటికి రెప్పవలె కాపాడుచుందును."</span></b> అని వారి అభయవచనములతో నన్ను సాగనంపిరి. ఆనాటినుండి నేను సన్యాసినై నా యిచ్చవచ్చినచోటుల సంచరించుచున్నాను. అదృశ్యముగా వారి దివ్య హస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుచున్నది. </div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: center;">
<span><span><span><span><span><span><b><span style="color: #38761d; font-size: large;">నాల్గు విధములైన జీవన్ముక్తులు </span></b></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span>నేను, "అయ్యా! శ్రీదత్తులవారిని ఆరాధించిన మోక్షము శీఘ్రముగా లభించునని వినియుంటిని. దానికి ప్రత్యేకముగా ఆరాధనా విధానమున్నదా? ప్రత్యేకమయిన మంత్రములను ఏమయిననూ జపము చేయవలెనా? నా సంశయములను దీర్చి కృతార్థుని చేయవలసినది." అని అడిగితిని.</span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span>దానికి ప్రసన్నవదనులయిన శ్రీనామానందులు "నాయనలారా! మోహము క్షయించుటయే మోక్షము. శరీరపాతానంతరమే మోక్షము కలుగవలెనను నియమములేదు. శారీరక ప్రారబ్దమును శరీరము అనుభవించుచూ ఉండవచ్చును. అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటివారిని 'జీవన్ముక్తులు' అని పిలువవచ్చును. తన యిష్టదైవము యొక్క లోకమునందు నివసించుట 'సాలోక్యముక్తి'. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన యిష్టదైవము యొక్క సామీప్యమునందు నివసించుభాగ్యము కలుగును. దానినే 'సామీప్య ముక్తి' యందురు. అంతకంటెనూ విశేషమైన పుణ్యరాశియున్న యెడల తన యిష్టదైవము యొక్క స్వరూపమును పొందును. దీనినే 'సారూప్యముక్తి' యందురు. అంతకంటెనూ విశేషమైనస్థితిలో తన యిష్టదేవతా చైతన్యములో 'సాయుజ్యము' నందును. ఒకానొక ఆధ్యాత్మిక స్థితినందుకొన్న దత్తభక్తులు యిహలోకమునందుండగనే సాలోక్యముక్తి ననుభవించుచుందురు. శరీరము మాత్రము ప్రారబ్దము ననుభవించుచుండవచ్చును. వారి మనస్సు శ్రీదత్తుల పాదారవిందములందు లగ్నమై సృష్టియొక్క ధర్మములను, ధర్మసూక్ష్మములను సృష్టి నిర్వహింపబడు చిత్రవిచిత్ర విధానములను తన అంతరదృష్టితో అవలోకించుచూ ఆనందము ననుభవించెను. <b><span style="color: #674ea7;">స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నియునూ, వారి ప్రమేయము లేకుండగనే విశ్వకళ్యాణమునకు వినియోగింపబడును.</span></b> ఇహలోకజీవనము సాగించుచూ సామీప్యముక్తిని పొందువారుందురు. వారు దత్తప్రభువు చేయు దివ్యలీలలను తమ అంతరదృష్టితో సాలోక్యభక్తులకంటే విశ్లేషణాత్మకముగ తెలుసుకొందురు. వారు పొందెడి ఆనందము మరింత మిక్కుటముగానుండును. జీవిశరీరబద్ధుడైనపుడు అనేక గుణములతో, వాసనలతో, కోరికలతో, బద్ధావస్థయందుండును. పరిణామము చెందు కొలదిని జీవి తేలికపడుచున్నట్లు తెలిసికొనును. ఈ రకముగా లఘుత్వమును అనుభవించునపుడు ఆనందము ఎక్కువగా నుండును. <b><span style="color: #674ea7;">సాయుజ్యమునందిన శ్రీ దత్తభక్తుల నుండి శ్రీదత్తుల వారి దివ్యలీలలు యథేచ్చగా ప్రకటిత మగుచుండును. శ్రీదత్తులవారికి సంకల్పముండును. శ్రీదత్తునిలో సాయుజ్యము నొందిన యోగిపుంగవులకు సంకల్పమనునదే ఉండదు. అయితే వారి దర్శన, స్పర్శన, సంభాషణ అనుగ్రహము లభించు పుణ్యవంతులకు శ్రీదత్తుల వారినుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన </span></b><b><span style="color: #674ea7;">మహదైశ్వర్యమును గాని, పరలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే ఒసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపములను ఆరాధించెదరు. ఆయా దేవతలందరునూ శ్రీపాదుల వారి </span></b><b><span style="color: #674ea7;">దివ్యాంశలే! ఆయా దేవతల ద్వారా శ్రీపాదులవారే భక్తులను అనుగ్రహించెదరు." </span></b>అని సెలవిచ్చిరి.</span></span></span></span></div>
<span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span><br />
<span><span><span><span><span><span><span><span><span><span><span>(ఇంకా ఉంది..) </span></span></span></span></span> </span></span> </span></span></span></span> </div>
</div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-51278708318559213372012-04-23T00:28:00.001-04:002012-04-23T00:28:15.335-04:00Chapter 17 Part 1<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange; font-size: large;">అధ్యాయము 17 </span></b></div>
<div style="text-align: center;">
<b><span style="color: #cc0000; font-size: large;">శ్రీనామానందుల వారి దర్శనము - భాగము 1 </span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమై పోవుచుండగా మార్గమధ్యములో ఒకానొక స్త్రీ జుట్టు విరియబోసుకుని వికృతముగా నవ్వుచూ నా వైపునకు వచ్చుటను గమనించితిని. ఆమె మనస్థిమితము లేనిదానివలె కన్పించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండెదడ అధికమైనది. కాళ్ళుచేతులు వణక నారంభించినవి. యిద్దరు పురుషులు చేతిలో కర్రలతో ఆమెను తరుముచుండిరి. ఆమె పరుగుపరుగున వచ్చి నా కాళ్ళపైబడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయూ అయోమయముగా నుండెను. దారిబత్తెము కూడాలేని బక్కబ్రాహ్మణుడనైన నేను పరాయిస్థలములో పరాయి వ్యక్తుల బారినుండి ఆ స్త్రీని ఎట్లు రక్షించగలను? నేను అప్రయత్నముగా, "అమ్మా! నీకు వచ్చిన భయమేమియూ లేదు. ఈ దుర్మార్గుల బారినుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవవలసినది." అని అంటిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఆ వచ్చిన ఆగంతకులు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బలసౌష్ఠవములతో తమతో ఏ విధముగానూ సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయే గాక తమ బారినుండి యీ స్త్రీని రక్షించెదనని ధృఢపూర్వకముగా చెప్పుట వారికి ఆశ్చర్యముగా నుండి, వారు "ఓ బక్కబ్రాహ్మణుడా! మేము యీ దురాచారిణిని చంపదలచితిమి. నీవు యీమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిలిన యెడల నిన్నుకూడా చంపవలసి యుండును. మర్యాదగా మా దారికి అడ్డురాకుము." అనిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాలో ఏదో అదృశ్యశక్తి ప్రవేశించినట్లనుభవమగుచున్నది. నా ప్రయత్నము లేకుండా నా మనసులోని తలంపులు కాకుండగా నా నోటినుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడెడి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితులలో నెట్టి వేయునవి అయి ఉన్నవి. అంతట నేను, "బ్రాహ్మణజన్మనెత్తి సిగ్గులేకుండగా గతరాత్రి ఆవును వధించి, ఆ మాంసమును భుజించి, కల్లును ద్రావి, సకల దురాచారములతో కూడిన మీకు నన్నునూ, యీ నిరపరాధియైన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పనికాదు. నేనన్నింటికిని సిద్ధముగనే యుంటిని. మీయందు జాలితో పలుకుచున్నాను. మీరు యీ స్త్రీని వధించిన తదుపరి కుష్ఠువ్యాధికి గురి అగుదురు. కుష్ఠివ్యాధి సోకినవారికి కామవాంఛ కూడా అధికముగా నుండును. కుష్ఠివ్యాధి కలిగిన వానిని పాము కాటువేయదు. పాము విషము నుండి తయారయిన ఔషధముతో కుష్ఠును తగ్గించవచ్చును. అయితే యీ ఔషధమును తయారు చేయు విధానము అందరికినీ తెలియదు. కామవాంఛను అణచుకొని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠువ్యాధిచే పీడితులు కావలెనని మీరు కోరుకున్నచో యీ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి యీ మాటలను పలుకుచున్నాను." అని పలికితిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నా మాటలు విన్న యిద్దరు ఆగంతకులు కుప్పకూలిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము! నేను పలికిన కొన్ని పలుకులు వారి గతజీవితమునకు సంబంధించినవైన కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితముగా జరిగి తీరునని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించిరి. జ్యోతిషము యందు ఏమాత్రమూ పాండిత్యములేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్కునిగా పరిణమించితిని. దగ్గరలోనున్న వృక్షఛాయలో మేమే కూర్చొంటిమి. వారి వృత్తాంతమును సవివరముగా చెప్పమని నేను కోరితిని. అంతట వారు, "అయ్యా! మీరు త్రికాలవేదులు, సర్వజ్ఞులు, అయిననూ మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము యిర్వురమునూ అన్నదమ్ములము. బ్రాహ్మణజాతిలో జన్మించిననూ, బ్రాహ్మణధర్మములు మాలో పూర్తిగా లుప్తమయినవి. సర్వభ్రష్ఠులమయితిమి. గోమాంసభక్షకుల తో స్నేహము చేసితిమి. సురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోను మేము సర్వభ్రష్ఠులమైతిమి. ఒక గుట్టమీద పద్మాసనములో కూర్చొన్న యీమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగానయిననూ ఆమెను అనుభవింపదలచితిమి. అదేమిచిత్రమో గాని, ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచూ వచ్చుచుంటిమి. పూర్వపుణ్యవశమున మీ దర్శనభాగ్యము మాకు కలిగినది." అనిరి. అంతట నేను <b><span style="color: #674ea7;">"ఏది మంచి, ఏది చెడు అను వివేచననుచేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించుచుండెను. మనము మంచిదారిలో నడచిన యెడల మంచి ఫలితములను పొందవచ్చును. చెడు దారిలో నడచిన యెడల అనివార్యముగా చెడు ఫలితములను అనుభవింపవలసివచ్చును.</span></b> ఈయమ్మ సదాచారిణిగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచారిణిగా తలంచిరి. పైగా అత్యంత హేయమయిన కోరికలతో యీమెను సమీపించిరి. మీరు పశ్చాత్తాపము పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో, క్షమింపడో నాకు తెలియదు గాని మీకు మాత్రము ఒక శుభవార్తనందించుచున్నాను.<b><span style="color: #674ea7;"> త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తిస్వరూపుడు అయిన శ్రీదత్తులు ప్రస్తుతకాలములో నరరూపధారియై శ్రీపాద శ్రీవల్లభుల రూపమున యీ లోకమున సంచరించుచున్నారు. </span></b>వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియునూ కానరాదు. నేను వారి దివ్యలీలలను ఎన్నో వినియుంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. అమ్మా! నీ వృత్తాంతమును ఎరిగింపుము." అని ఆమెనడిగితిని.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట ఆమె, "అయ్యా! తమరు నన్ను యీ పాపాత్ముల బారినుండి రక్షించితిరి. మీరు నాకు పితృసమానులు. నేను సద్బ్రాహ్మణ వంశమున జన్మించితిని. ఊహ తెలియని వయసునందే వివాహమైనది. నా దౌర్భాగ్యమును ఏమని చెప్పను? నా భర్త నపుంసకుడు. క్షణక్షణమును నన్ను వేధింపమొదలిడెను. యౌవనసంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించు ఆనందించుటయనిన సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధము కలదని పదేపదే చెప్పుచుండును. నేను సుమంగళీచిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొనిన విటుని కోసమై వేచియుంటిననియు, అలంకరణరహితముగానున్నచో విధవరాలువలె అమంగళముగా ఎందులకు కన్పించుచున్నావనియు, గృహమునందలి చిన్న పిల్లలను మురిపెము చేయునెడల నీవు పిల్లలు కలుగలేదని చింతాక్రాంతవై లోలోన కుములుచున్నావనియు, నేను సమానముగా భోజనము చేసిననూ నీవు చాల ఎక్కువగా భోజనము చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావనియు, అన్నము తక్కువగా తిన్నచో అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగుపొరుగు వారు ఆనుకొనవలెనని తక్కువ తినుచున్నావనియు, ఉపవాసము చేసిన యెడల నా పీడ వదిలించుకొనుటకు రహస్యముగా ఏదో మంత్రమును జపించుచూ, ఆ మంత్రాధిష్ఠాన దేవత ప్రీతికొరకు ఉపవసించుచున్నావనియు, నా భర్త నన్ను మానసికముగా ఎంత హింసించుచున్ననూ అత్తగారుగాని, మామగారుగాని యింటియందున్న తక్కిన పెద్దలుగాని నా భర్తను పల్లెత్తుమాట అనరు. ఈ భూలోకమునందు నరకమనునది ఎట్లుండునో నా అత్తవారింట అనుభవముతో తెలుసుకొంటిని. ఈ విధముగా కాలము నాకు విషాదభరితముగా నడచుచుండెను." అని తెలిపినది.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఇంతలో మా గ్రామమునకు ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడేతెంచెను. అతనికి జ్యోతిష్య శాస్త్రమందు కూడా విశేష పాండిత్యము కలదని ప్రచారము జరిగెను. మా అత్తమామలు వానిని మా యింటికాహ్వానించిరి. అతడు ఏవేవో లెఖ్ఖలు వేసి, చిత్రవిచిత్రములయిన పూజలుచేసి, "ఈమె నష్టజాతకురాలు. అనేక అమంగళయోగములు కలది. ఆ యోగప్రభావమున భర్తకు నపుంసకత్వము వచ్చినది. ఆమెను యింటనుండి వెళ్ళగొట్టినచో అమంగళములు తొలగిపోవును. నేను చేయు మంత్రతంత్రములు, పూజా విధానములు అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వము పోవును. తిరిగి అతనికి వివాహము చేయవచ్చును. ఆ తరువాత తప్పక సంతానయోగము కలుగును." అని చెప్పెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
దయాదాక్షిణ్యరహితులైన నా అత్తమామలును, యింటిలోని వారును, నా భర్తయును నన్ను యింటి నుండి తరిమివేసిరి. నేను గత్యంతరములేక కనీసము పుట్టినింటికయిననూ కాలినడకన పోవుదామని బయలుదేరితిని. ఇంతలో మా యింటికి వచ్చిన కుహనా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్ఛమైన తన కామవాంఛకు నన్ను బలిచేయగోరెను. నేను భద్రకాళినై దగ్గరలోనున్న బండరాతిని ఎత్తి నా శక్తికొలది విసరితిని. అది వానినెత్తికి బలముగా తగిలి అతడు అక్కడికక్కడే మరణించెను. హతవిధీ! నేను స్త్రీనైయుండి గత్యంతరములేని పరిస్థితులలో బ్రాహ్మణహత్య చేసితిని. నా మనస్సు మనస్సులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయిననూ నాకు సమస్యలు తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకొని పోషించువారయిననూ అన్నదమ్ములును, వదినెలును, మరదళ్ళును ప్రేమతో చూచెదరను నమ్మకము నాకులేదు. నేను కుహనా మాంత్రికుని హత్య చేయుటను అచ్చటి పామరజనము చూచిరి, కాని వారికి అతని కౌటిల్యము తెలియదు. ఇంటువంటి వార్తలు నలుదిశలా శీఘ్రముగా వ్యాపించును. నన్ను విధి ఎచ్చటికి నడిపించిన అక్కడికే పోయెదను గాక! యని తలచి దారీతెన్నూలేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారము కంటబడినది. నాకు బహుదప్పికగానుండెను. కాసారములోని నీరుత్రాగి దప్పికను తీర్చుకొంటిని. ఆ కాసారము చెంత ఔదుంబర వృక్షమొకటుండెను. ఔదుంబరము దత్త ప్రభువుల వారికి అత్యంత ప్రీతిపాత్రమను విషయము వినియుంటిని. నాకు శరీరమునందు మైకము క్రమ్ముచుండెను. ఆ వృక్షమూలమునందే గాఢనిద్రలోనికి జారుకుంటిని. కొంతసేపటి తరువాత మేల్కొంటిని. మిక్కుటముగా ఆకలి అగుచుండెను. కళ్ళుతెరచి చూచునంతలో రెండు నాగుపాములు నాకు రెండు వైపులా కాపలాకాయు కావలివాండ్ర వలెనుండెను. నేను ఆ రెండు నాగుపాములకునూ నమస్కారము చేసితిని. నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు అవి రెండునూ ఎటోపోయెను. నేను దత్తదిగంబర ! దత్తదిగంబర! జయగురుదత్త! దత్తదిగంబర! అని పాడుకొనుచుంటిని. దత్తప్రభువులు కేవలము స్మరణ మాత్రముననే ప్రసన్నులై కాపాడెదరని పెద్దలు చెప్పగా వినియుంటిని. నా అదృష్టము కొలది ఔదుంబరవృక్షఛాయలో కూడనుంటిని. నేను శ్రీదత్తప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలుగసాగెను.</div>
<div style="text-align: left;">
<br /></div>
<div style="text-align: left;">
(ఇంకా ఉంది..) </div>
</div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-10647342076779479922012-04-20T20:09:00.004-04:002012-04-20T20:09:59.348-04:00Chapter 16 Part 3 (Last Part)<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="color: orange; font-size: large;"><b>అధ్యాయము 16 </b></span></div>
<div>
<div style="text-align: center;">
<span style="color: #cc0000; font-size: large;"><b>శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 3 </b></span></div>
</div>
<div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;"><b>తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము</b></span></div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
నాగులచవితినాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. ఆ మంత్రగానిని మా దాయాదులునూ, గ్రామపెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునయిననూ తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమొనరించుకోగలగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలగినవాడు. అతనిచేతిలో గరుడరేఖ కూడా యుండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామపెద్దయు, మంత్రగాడును తలపోయుచుండిరి.</div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయునూ మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములనుచేయుచూ మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయస్థితిలో నుంటిమి. అమాయకములయిన జాతిసర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్టనుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని, వాని అనుచరులకునూ యిదిఎంతయో సంతసము కూర్చుచుండెను. అయిననూ వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమునూ ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలలవైపు పయనించుచుండెను. ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గము నందు మాత్రము అగ్ని చల్లారుచుండెను.తుదకు అగ్ని అంతయునూ ఆరిపోయెను. ఆ సర్పరాజములు యధేచ్చగా అచ్చటనుండి వెడలిపోయెను. మంత్రగాడును, అతని అనుచరులునూ బిత్తరపోయిరి.</div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
ఇంతలో గ్రామపెద్ద పెద్దకుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కన్పింపసాగెను. రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరిత మగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయూ విడ్డూరమే! మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను. కాని ఫలితము లభింపలేదు. అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామపెద్ద మనసులో మహాభయము తోచెను. అనాధ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరేవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిముషములలో అతడు విగతజీవుడాయెను. శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక? గ్రామపెద్ద మా వద్దకు పరుగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్యచింతతో శ్రీపాదుల వారిని స్మరించిన యెడల నీ యిద్దరు కుమారులును స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి.</div>
<div style="text-align: justify;">
<span><span><br /></span></span></div>
<div style="text-align: justify;">
మాంత్రికుని కళేబరము గ్రామపెద్ద యింటివద్ద నుండెను. గ్రామపెద్ద కుమారులు యిద్దరునూ విధి వైపరీత్యమునకు లోనయిరి. మా దాయాదులు భయముతో వణకిపోసాగిరి. వాతావరణమంతయునూ విషాద భరితముగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శవమును స్మశానమునకు తీసుకొనిపోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవాములో ఆకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటికాపరివాండ్రు చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు, వానిని రక్షించినచో యిదే శరీరముతో అతడు ప్రేతార్మ చేయు దుష్ట కార్యములన్నియునూ చేయుననియూ, అతని శవము కాలి బూడిద అయిన యెడల కేవలం ప్రేతాత్మ గానే యుండి తనకి వశమైయుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియూ, అందుచేత శవమునకు నీళ్లుపోయు ప్రయత్నమును మానుకొనిరి. విగతజీవుడై ఉపాధిరహితుడుగా నున్న ప్రేతాత్మకంటే సజీవుడై తన స్వంత ఉపాదిలోనే ప్రవేశించెడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులని కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును, దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. <b><span style="color: #674ea7;">ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్త్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము.</span></b></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span>కాతికాపరులందు దయగల సజ్జనుడొకడు శవము పడుబాధను చూడలేక నీళ్ళు తెచ్చిపోసెను. అయిననూ అది అగ్నిని ఆర్పలేదు సరిగదా ఆజ్యము పోసినట్లు ప్రజ్వలింపచేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్ననూ అతని శరీరము ఏ మాత్రమూ కాలలేదు. అవయవములేవియునూ విక్రుతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతడు అనుభవించుచుండెను.</span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><br /></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span>నాయనా! శంకరభట్టూ! రౌరవాది మహానరకములందు అనేక అర్బుధముల నుండి నానా యాతనలు అనుభవించు జీవులుందురు. స్నానము చేయునపుడు శిఖపిండుకొనునపుడు, గావంచాను పిండుకొనునపుడును, భోజనసమయమునందు<b><span style="color: #674ea7;"> 'రౌరవే </span></b><b><span style="color: #674ea7;">పుణ్యనిలయే </span></b><b><span style="color: #674ea7;">పద్మార్బుద నివాసినాం, అర్థినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్ఠతు' </span></b>అని పరిషేచనము చేసి విడుచు నీరు అపుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అర్బుదముల కాలము నుండి దాహార్తులుగా నున్నవారికి దాహోపశమనమును కలిగించును. <b><span style="color: #674ea7;">ధర్మనిష్ఠులయిన వారికి శ్రీపాదుల వారు కొంగుబంగారము, ధర్మభ్రష్ఠులు, మహాపాపములు చేయువారలకు వారు యమధర్మరాజు వంటివారు.</span></b></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span>మాంత్రికుని శవము చితినుండి గంతులువైచుచూ గ్రామపెద్ద యింటికిచేరెను. అగ్నిచేత దహించబడకుండగా, అగ్నివలన మహావేదనను అనుభవించుచూ పెడబొబ్బలు పెట్టుచూ, అతడు గ్రామపెద్ద యింటికిచేరెను. మేమందరమునూ గ్రామపెద్ద యింటివద్ద దత్తకథా ప్రసంగములను చేసుకొనుచూ, దత్తప్రభువు యొక్క దివ్య, భవ్య, నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేసుకొనుచుంటిమి. దత్తదిగంబరా! శ్రీపాదవల్లభ దిగంబరా! అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమునెంతయో పవిత్రము చేయుచుండెను.<b><span style="color: #674ea7;"> స్థూలరూపమున నున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము నందలి దివ్యకిరణములు వారి స్థూలసన్నిధిని ఉన్నవారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మరూపము నుండి వెలువడు దివ్యకిరణములు భూమండలమునంతనూ పవిత్రము చేయుచుండును. వారి కారణరూపము నుండి వెలువడు దివ్యకిరణములు కోటానుకోట్ల బ్రహ్మాండములను పవిత్రము చేయుచుండెను. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహా విశ్రాంతిలో నుండును. అందుండి వెలువడు దివ్యకిరణములు సాలోక్య, సామీప్య, సాయుజ్య అవస్థలయందుండు అవధూతలు, అంశావతారములు, మహాసిద్ధ పురుషులు, మహాయోగులు మొదలయిన వారిని పవిత్రము చేయుచుండును.</span></b></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span style="color: #674ea7;"><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><b><br /></b></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span style="color: #674ea7;"><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><b>వారి దివ్య నామస్మరణము చేయునపుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై యుందురు. వారు వారి దివ్యలీలల ద్వారా తమ ఉనికిని, సత్తాను ఋజువుచేయుచుందురు.</b></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>దత్తుడు దిగంబరుడా ? శ్రీపాదుడు దత్తుడా! అతడు కూడా దిగంబరుడేనా? వస్త్రము లేని పిచ్చివాడా? అని మాంత్రికుడు శ్రీపాదులవారిని పరిహసించియుండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటినుంచి మాంత్రికుని తీసుకొనివచ్చి అగ్నిశిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా, దిగంబరావస్థ లో తన భక్తులయెదుట నిలబెట్టినారనిన యిది సామాన్య విషయమా? సామాన్య యోగులకు యిది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను, ఎప్పుడయినా విన్నామా? కన్నామా? అంతయునూ చిత్రము, విచిత్రము, అశ్రుతము, అతర్క్యము. <b><span style="color: #674ea7;">శ్రీపాదుల వారి శ్రీచరణముల మ్రోల వినమ్రులై శిరసు వంచి శరణాగతులయిన వారు, తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలో నున్న పసిపిల్ల వాని వలె హాయిగా నుందురు. వారు సర్వశుభములను, సౌఖ్యములను పొందెదరు.</span></b></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>శ్రీపాదుల వారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచూ ఉపశమనమును పొందుచుండెను. నృత్యమును ఆపినయెడల బాధ మిక్కుటముగా నుండెను. దిగంబరావస్థలో నృత్యముచేయుట అతనికి బాధాకరముగా నుండెను. ఇది అంతయునూ స్వయంకృతాపరాధమనియూ, ఆ అపరాధము యొక్క కర్మఫలమును యీ విధముగా అనుభవించుచున్నాననియూ అతడు తెలిసికొనెను. ఎన్నియో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతిచేసిన విషయములను అతడు గుర్తుచేసుకొనెను. తన అజ్ఞానకాలమున మహాత్ములను, దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిదియని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపము మిక్కుటమై శ్రీపాదుల వారిని మానస్ఫూర్తిగా శరణుజొచ్చెను.</span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>అతని మనస్సులో యీ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుట కిచ్చితిని. అతడు మహోత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయమగుసరికి గ్రామపెద్ద రెండవకుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవుపాలను పెద్దకుమారుని నోటిలో పోయగా వానికి మైకము తగ్గి స్పృహ లోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచూ సాధువర్తనుడనై జీవించెదనని ఎటో పోయెను. గ్రామపెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందునట్లు తీర్పుచెప్పెను.</span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>మూడు సర్పరాజములు నివసించిన పుట్టయందు మూడు ఔదుంబర వృక్షములు మొలచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయను సన్యాసి ఆయాచితముగా మా యింటికి అరుదెంచెను. అతడు యీ </span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span>ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండువాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయము నందున మా చేత తయారు చేయించబడిన హల్వాను శ్రీపాదులవారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదముగా యిచ్చి భుజింప మనెను. అతడిట్లు వచించెను.<b><span style="color: #674ea7;"> "</span></b><b><span style="color: #674ea7;">శ్రీపాదులవారు పీఠికాపురమునందలి వారి మాతామహగృహమున ఒకానొక ఔదుంబర వ్రుక్షమూలమున </span></b><b><span style="color: #674ea7;">కూర్చొ</span></b><b><span style="color: #674ea7;">నెడివారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యముతో వెండిగిన్నెలో హల్వాను నింపి ఆ వ్రుక్షమూలమున నున్న శ్రీపాదులవారికి </span></b><b><span style="color: #674ea7;">తినిపించెడివారు. శ్రీపాద శ్రీవల్లభ, నృశింహసరస్వతి, స్వామిసమర్థ అను నామత్రయమునకు సంకేతమే యీ మూడు వృక్షములు. పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోనివే ఈ మూడు వృక్షములు. కాలాంతరమున పీఠికాపురము నందలి ఆ ఔదుంబర వృక్షబీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల జన్మస్థలము నందు </span></b><b><span style="color: #674ea7;">ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు </span></b><b><span style="color: #674ea7;">ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్ష మూలమున నున్న శ్రీపాదులవారికి శనిప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడువారికి శ్రీపాదులవారి అనుగ్రహము కొంగు బంగారమై యుండును."</span></b> ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు ధృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;">శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!</span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(అధ్యాయము 16 సమాప్తం) </div>
</div>
</div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-49089192273425864222012-04-20T12:53:00.002-04:002012-04-20T12:53:15.122-04:00Chapter 16 Part 2<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<b><span style="color: orange; font-size: large;">అధ్యాయము 16</span></b></div>
<div style="text-align: center;">
<span style="color: #e06666; font-size: large;"><b>శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 2</b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #6aa84f; font-size: large;"><b>శ్రీపాదుల వారు తన భక్తులను కాపాడిన విధము</b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
యజ్ఞము నిరాటంకముగా కొనసాగించబడినది. వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాడులకు యీ ఘటనాక్రమమంతయునూ అయిష్టముగా నుండెను. మాకు ఉన్న ఒకానొక భూమిలో మిరపతోట ఉండెను. ఆ తోటకు నాలుగువైపులా సరిహద్దులందు తాటిచెట్లు ఉండెను. ఆ తాటిచెట్లను కల్లుగీసుకొను నిమిత్తము గౌడ కులస్థులకు యీయబడెను. మా దాయాదులు వక్రమార్గమున మిరపపండ్లను కోసుకొని తీసుకొనిపోవుటకు యత్నించుచుండిరి. బస్తాల కొలది మిరపపండ్లు కోయబడెను. అవి అన్నియునూ బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్లబండిపై తోలుకొనిపోవుటకు సిద్ధముగానుండిరి. నేను ఆ సమయమున చేనులోనికి పోయితిని. అచ్చటి దృశ్యము చూచి దిగ్భ్రాంతి చెందితిని. నేను ఒంటరివాడను. వారు పదుగురు. ఆశ్చర్యముగా ఒకానొక తాటిచెట్టు నుండి కల్లు త్రాగుచున్న భల్లూకమును గాంచితిని. ఆ భల్లూకము చెట్టునుండి క్రిందపడినది. భాల్లూకమనిన అందరకునూ భయమే! వాడియైన తన గోళ్ళతో అది మనుష్యుల కండలను సహితము ఊడబెరుకును. దాని గోళ్ళు గ్రుచ్చుకొనినచో శరీరమునందలి రక్తము కూడా విషపూరితమగును. ఆ భల్లూకము తిన్నగా ఎడ్లబండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనై శ్రీపాదుల వారి నామమును ఉచ్ఛరించసాగితిని. ఆ భయంకర భల్లూకము అత్యంత సాధుస్వరూపమును పొంది నేను శ్రీపాడులవారి నామమును ఉచ్ఛరించినపుడు తన చేతులతో తాళమువేయుచూ ప్రసన్నముగానుండెను. నేను మిరపపండ్ల బస్తాలతో రెండెడ్లబండిలో యింటికి చేరితిని. నా బండికి ముందుభాగమున భాల్లోకము నడుచుచుండెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మా యింటిలోని వృద్ధదంపతులకే కాదు చుట్టుప్రక్కల నుండువారందరికి యిది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించెను. ఆ రాత్రి అంతయునూ శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్ఛరించుచుంటిమి. భల్లూకము కూడా శాంతముగా నామస్మరణ సమయమందు తాళము వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భాల్లోకము కూడా ఆనందముగా స్వీకరించినది.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ఆ రోజునుండి భల్లూకము మా యింటిలో ఒకనివలె సంచరించుచుండెను. అది మా కుటుంబసభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావమును కలిగిన వారలకు అది హడలు పుట్టించుచుండెను. ఆ భల్లూకము మా చేలన్నింటిని కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా యింట ప్రతి నిత్యమును దత్తప్రభువుల లీలావిశేషములకు సంబంధించిన చర్చలను, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణమును నిరాటంకముగా జరుగుచుండెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీమన్నారాయణ యీ విషయములను విశదపరచుచుండగా ఆ భల్లూకము చెరుకుతోటలోనికి వచ్చినది. దానిని చూచుటతోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నాయందు చాల స్నేహభావమును ప్రదర్శించినది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగనే అది ఆనందముతో గంతులు వేయసాగినది.</div>
<div style="text-align: center;">
<span style="color: #6aa84f; font-size: large;"><b><br /></b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #6aa84f; font-size: large;"><b>శ్రీమన్నారాయణ మరల ఇట్లు చెప్పసాగెను</b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మా చుట్టుప్రక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చియుండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించియుండెను. తన ప్రభావములోనికి వచ్చిన వారినుండి అతడు విశేషముగా ధనమును సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాన్త్రికుని ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చియుండెను. మా యింటనున్న భల్లూకముపై తన తంత్ర ప్రయోగము చేసెను. భల్లూకమునందలి సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుని అనుచరులు మహదానందపడిరి. స్తబ్ధముగా భల్లూకము పండుకొనియుండెను. తాంత్రికుడు ఒకానొక యోగప్రక్రియ ద్వారా భల్లూకము యొక్క చైతన్యముతో తాదాత్మ్యమును పొంది మరియొక యోగప్రక్రియద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<span style="color: #6aa84f; font-size: large;"><b>శ్రీపాదుల వారు తమ భక్తులను వారి ప్రారబ్ధకర్మల నుండి రక్షించుట</b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు.<b><span style="color: #674ea7;"> కార్యకారణ సంబంధములు వెదకబూనుట ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కార్యము సంభవింపదు.</span></b> ఇంద్రుడు తన ధర్మముననుసరించి విపరీతముగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మముననుసరించి గోవర్ధనగిరినుద్ధరించి తన గోపాలధర్మమును నెరవేర్చెను. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చిరి. భల్లూకము తాంత్రికబాధకు గురి అయ్యెను. అయితే భల్లూకమునందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదులవారి భక్తునిగా మార్చినది. అది మౌనముగా రోధించుచుండెను.<span style="color: #674ea7;"><b> జీవులయొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారముగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహముతో పాపకర్మఫలముల తీవ్రతను క్షీనింపచేయుదురు.</b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీమన్నారాయణ గృహమున దత్తకథా ప్రసంగములును శ్రీపాద శ్రీవల్లభ నామపారాయణము యధావిధిగా జరుగుచుండెను. సమావిష్టులైన కొంతమంది భక్తులకు వారి మనసులో అనేక సందేహములుండెను. కొంతమంది అన్యమనస్కముగానుండిరి. మరి కొంతమంది శ్రద్ధాళువులు మాత్రము శ్రీపాదులవారి యందు అచంచల భక్తిని కలిగియుండిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నామపారాయణము జరుగుచున్నపుడు ఒక వింత జరిగెను. స్తబ్ధముగా జీవచ్ఛవమువలె పడియున్న భల్లూకములో చైతన్యము రాసాగెను. తన పూర్వశక్తులనన్నింటిని అది పొందసాగెను. భక్తులు నామ పారాయణము చేయునపుడు అది ఆనందముతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగప్రక్రియలన్నింటికినీ అతీతము. భల్లూకమునందలి భల్లూక ఆత్మ చైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మచైతన్యము మానవత్వము నుండి భల్లూకతత్త్వములోనికి మార్పు నొందుచుండెను. భల్లూకములో భల్లూకతత్త్వము నశించి మానవత్త్వము రూపుదిద్దుకొన నారంభించెను. మానవాకృతిలో నున్నను భల్లూకతత్త్వములోనికి మార్పుచెందుటచే తాంత్రికుడు భల్లూకమువలె ప్రవర్తింపసాగెను. వానిని వాని అనుచరులే త్రాళ్ళతో బంధించి అడవిలో దించివైచిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
భల్లూకము మానుషభాషలో మాట్లాడనారంభించి, "అయ్యలారా! నేను గతజన్మలో వడ్డీ వ్యాపారస్థుడను. ఎక్కువ వడ్డీలను వసూలుచేయుచూ జనులను మిగుల బాధించితిని. తత్ఫలితముగా భల్లూకజన్మను పొందితిని. పూర్వపుణ్యవశమున శ్రీపాదులవారి అనుగ్రహము లభించినది. శ్రీపాదులవారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమజన్మము ప్రాప్తింపబోవుచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మములను చేసియున్నాడు. దానికితోడు శ్రీపాదుల వారి భక్తుడను, మూగప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలంచినాడు. దానికి శ్రీపాదులవారు వానిని శిక్షించిరి. రక్షణయు, శిక్షణయు రెండునూ శ్రీపాదుల వారి యందుండును. నిశ్చలభక్తితో వారినారాధించువారి యందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్లపాలు చేయువారిని వారు శిక్షింతురు. శిక్షననుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతిని పొందబోవుచున్నాను." అని పలికెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అందరునూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామమును పారాయణము చేయుచుండిరి. భల్లూకము మౌనముగా తన్మయావస్థలో నుండెను. నామస్మరణము జరుగు సందర్భమున ఎచ్చటనుండియో మూడు నాగుపాములు వచ్చినవి. నామస్మరణము జరుగునపుడు అవి కూడా తన్మయముగా నుండెను. భల్లూకము ప్రశాంతముగా ప్రాణములు విడిచెను. అచ్చటకు వచ్చిన మూడు నాగుపాములు భల్లూకమునకు మూడుసార్లు ప్రదక్షిణను చేసినవి. ఆ పాములు ఎచ్చటనుండి వచ్చినవో, అవి ఎందులకు వచ్చినవో ఎవరికినీ అర్థము కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారములు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రము ఆ రోజంతయునూ మా యింటనే ఉండినవి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మాకు సర్వకాల సర్వావస్థలందునూ శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై యుండెను. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యమిడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్ఠు అయినవారు గాని, మైలదోషము సోకినవారు గాని గుంపులో నుండిన అవి బుసకొట్టుచుండెడివి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాగుపాములు మాయింట నివసించుటచే మా యింటికి వచ్చుటకు కొంతమందికి భయముగా నుండెడిది. దత్తభక్తులు మా యింటికి స్వేచ్ఛగా వచ్చెడివారు. దత్తనామమును గాని, శ్రీపాదుల వారి నామమును గాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయభావముతో నుండెడివి. వృద్ధదంపతులు యింటి భాగములోని కొంతస్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించియుండిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామపెద్దలు నిర్దారించిరి. తీర్పు వెలువడునంతవరకునూ ఆ స్థలమునందు మా దాయాదులే కూరనారాలు పండించుకొనుటకు అనుమతి యీయబడెను. మా దాయాదులు గ్రామపెద్దలను ధనప్రలోభముచే వశపరచుకొని యుండిరి. ఆ కారణమున ఎంతకాలమైననూ తీర్పు వెలువడుట లేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదాస్పద స్థలమునందు ఒక పుట్ట యుండెను. నాగులచవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్టయందు పాములు ఏమియునూ లేకపోవుటచే నిర్భయముగా పాలు పోయబడుచుండెను. పుట్టలో పాలు పోయువారు "నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కార భాగ్యమునిమ్ము! మా అభీష్టములు తీర్చుము" అని ప్రార్థించువారు. ఈ విధముగా ప్రార్థన చేయువారందరకూ దానిలో ఒక్క నాగుపాము కూడా లేదను విషయము చక్కగా తెలియును.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
శ్రీపాదుల వారు బహుచమత్కారులు. నాగులచవితి అతి దగ్గరలోనే యున్నది. దాపులనున్న వారు ప్రార్థనచేయు వారు, పాలుపోయు వారు యీ పర్యాయము పుట్టవద్దకు వచ్చుటకు జంకుచుండిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాగుల చవితి రానే వచ్చినది. లోకము ఎంత విచిత్రము! నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారము యిచ్చు సందర్భమున అచ్చట ఒక్కరును ఉండరు. భయభ్రాంతులై పరుగులిడెదరు. వృద్ధ దంపతులును, మేమును శ్రీపాదులవారికి నైవేద్యమిడిన పాలను పుట్టవద్ద నుంచి ప్రార్థింపగనే మూడు నాగులును ప్రత్యక్షమైనవి. అవి పాలను త్రాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప ఎవ్వరునూ ఆ పుట్టలోనికి పాలు పోయుటకు రానేలేదు.</div>
<div style="text-align: left;">
<span><span><span><span><span><br /></span></span></span></span></span></div>
<div style="text-align: left;">
<span><span><span><span><span>(ఇంకా ఉంది..) </span> </span></span></span> </span> </div>
</div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-53816497927199218172012-04-07T20:05:00.000-04:002012-04-07T20:05:10.910-04:00Chapter 16 Part 1<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="color: orange; font-size: large;"><b>అధ్యాయము 16 </b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #cc0000; font-size: large;"><b>శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 1 </b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నేను శ్రీపాదులవారి దివ్య చరితమును మననము చేసికొనుచూ, మనసులోనే శ్రీపాదులవారి నామస్మరణము చేసికొనుచూ పోవుచుంటిని. శ్రీపాదులవారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే యున్నాననెడి ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడుచుచున్న మార్గమందు చెరుకుతోట యొకటి కన్పించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాశీనుడయి ఉన్నాడు. అతడు "అయ్యా! కొంతసేపు యిక్కడ విశ్రమించి చెరుకురసమును త్రాగిపోవచ్చును. ఇటు రండు." అని వినయముగా ఆహ్వానించెను. నేను ఆ రైతు యిచ్చిన చెరుకురసమును త్రాగితిని. అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదులవారి దర్శనము కొరకు పోవుచున్న వయనమును తెలుసుకొని అతడెంతయో ఆనందించెను. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించెను. "అయ్యా! నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహ నామధేయము మల్లాదివారు. మా స్వగ్రామము మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అనుపేరుగా మారినది. బాపనార్యుల వారి స్వగ్రామము కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామము కూడా మల్లాదియే! అయితే వారు బ్రాహ్మణులు. మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును, మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురమును విడిచిపెట్టి పిఠాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్ధికపరిస్థితి చాలా సంకటముగా నుండినది. అప్పులబాధకు తట్టుకొనలేక చార, స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పీఠికాపురమును చేరితిమి. మమ్ము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానములనోసగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయము చేసుకొనవలెనని మా సంకల్పము. మేము "దండుగమారి తిండి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణములు నిల్పిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెలనమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే మా స్వగ్రామమును విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మా యందు దయజూపి మీ పొలమును కౌలుకిచ్చిన యెడల ఎంతయో కృతజ్ఞులము, మమ్ము కటాక్షింపవలసినది." అని బాపనార్యులను ప్రార్థించితిమి. ఆ రోజున బాపనార్యుల యింట శ్రీపాదుల వారుండిరి. దానికి శ్రీపాదులవారు, "బాపనార్యుల యింట లభించేది అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవకృప లేనివారికి ఆ ప్రసాదము లభింపదు. మహాతపశ్శాలురయిన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభామయిన విషయము. పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము మీకు కలిగినది." అని పలికిరి. శ్రీ బాపనార్యులు "మా భూములను యిదివరకే పంటకాపులకు ఒసంగితిమి. వారు సేద్యము చేసుకొనుచున్నారు. సహేతుకమయిన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మవిరుద్ధము. మరికొన్ని దినములు ఓరిమి వహించియుండుడు. ఏదో ఒక మార్గాంతరము దొరకక పోదు." అనిరి. తదుపరి శ్రీపాదులవారు, "ఇదిగో! గుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డయందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. నీ అభీష్టము సిద్ధించిన తదుపరి యీ మినుములను పారవేయవలసినది. రాతిక్రింద కప్పకు కూడ ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసినది." అనిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మేము బాపనార్యుల యింట ఆఖరి భోజనమును చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదులవారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణములో అన్నోదకములకు లోటు కలుగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెను. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకొంటిమి. మార్గమధ్యములో ఒకానొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధదంపతులు మాత్రముండిరి. వారుకూడ కమ్మకులస్థులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాము కరుచుతచే మరణించెను. కొలది దినములకు అతని భార్య కూడ కృష్ణానదిలో స్నానము చేయుచు నీట మునిగి మరణించెను. వారికి సంతతి కూడ లేదు. ఆ విధముగ ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండిరి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించుకొనవలెననెడి తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్ఠులను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికీ తమ ఆస్తిపాస్తులను యీయవలెననెడి మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధదంపతుల యింట మాకు ఆతిధ్యము లభించినది. మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణమైపోదలించిననూ ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతముగా ఒకానొక ముహూర్తమున ప్రయాణము కాదలంచితిమి. ఆకస్మాత్తుగా యింటిల్లిపాదికీ, వాంతులు, విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము అవదలచినపుడు వృద్ధదంపతులు మమ్ము వారించిరి. వారికి మా యందు వాత్సల్యభావము మెండాయెను. ఇది దాయాదులకు కంటగింపుగా నుండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ యింట తిష్ఠవేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశక్యత తీరిపోయినదనుకొని వాటిని పారవైచితిమి. చావో, రేవో యిచ్చటనే తేల్చుకొనవలెనని తలచితిమి. </div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span>దాయాదులకు వృద్ధదంపతుల ఆస్తిపాస్తులు కావలయును గాని, వారు మాత్రము అక్కరలేదు. మేముకూడ వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మాకొసంగి దత్తత చేసుకొనవలెననెడి నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరముగా నుండెను. అందువలన వారిలోవారు రాజీకివచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని, మమ్ములను ఆ యింటనుండి ఏదో విధముగా తరిమివేయ తలచిరి.</span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడొకడుండెను. వారు అతనితో లాలూచిపడి అతనిని ఆ వృద్ధదంపతుల యింటికి తీసుకొనివచ్చిరి. ఆ జ్యోతిష్కుడిట్లు చెప్పెను. "మీ యింటనున్న యీ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ యింటనున్న ఆ యింట సిరి ఉండనొల్లదు. అంతేగాక సమస్త దరిద్రములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ యింటి నుండి పంపించివేయుడు."</span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>దానికి వృద్ధ దంపతులు "మీరు జాతకములో సూచించినట్లు వారికి దరిద్రయోగములే ఉన్నయెడల వాటికి పరిహారము కూడా శాస్త్రములో చెప్పబడియేయుండును. ఎంతధానము ఖర్చు అయిననూ, వారికి ఉన్న అమంగళములన్నియును పరిహరింపబడి సమస్త సన్మంగళములు కలుగునట్లు పూజాదికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల ఆధీనములో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరునూ మంత్రాధీనులయి ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై యుండును. అందుచేత సద్బ్రాహ్మణులయిన మీరే మాకు భువిలోని దేవతలు. మా కోరికను మన్నించవలసినది. " అని ఆ జ్యోతిష్కుని కోరిరి. </span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>జ్యోతిష్కునకు పూజాదికములకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారి లేకుండెను. నాయనా! శంకరభట్టూ! <b><span style="color: #674ea7;">ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమనునది కర్మనుంచి వచ్చినది. సమస్త కర్మలకునూ వేదమే మూలమయి ఉన్నది. యాగములచేత మనుష్యులు దేవతల నారాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సుల నీయవలెను. ఈ విధముగా మానవులకునూ, దేవతలకునూ పరస్పరాశ్రయత్వము కలదు. </span></b>దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు అయిదు రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. వృద్ధ దంపతుల ద్రవ్యసహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు సిద్ధించుటకు యజ్ఞము సలుపబడెను. వాస్తవమునకు మాకు జాతకములో ఏ విధమయిన దోషములు లేవు. వృద్ధదంపతుల పుణ్యమా అని మాకు పరమపవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యము కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్పహవిస్సులు, మంత్రసామర్థ్యము వలన ఏయేదేవతలకు ఎంతకావలయునో అంతవృద్ధిని పొందును.</span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span> </div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: center;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><b><span style="color: #38761d; font-size: large;">భూదేవి ఈ ఏడింటిచే ధరించబడుచున్నది </span></b></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span>గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుర చేత భూమి ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము.<b><span style="color: #674ea7;"> గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగ్యద్రవ్యములు ప్రసాదించుచు మనుష్యుల యిహలోకస్థితికి, యజ్ఞయాగాదుల వలన పరలోకస్థితికి ఎంతయో దోహదము చేయుచున్నది. </span></b>ఇంద్రాది సర్వదేవతలు వేదమంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము. కావున <b><span style="color: #674ea7;">వేదముల</span></b> చేత కూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణులు యజన యాజనములు ద్వారా జనుల చేత సత్కర్మల నాచరింపచేతురు. కావున <b><span style="color: #674ea7;">బ్రాహ్మణుల</span></b> చేత కూడా భూమి ధరింపబడుచున్నది.<b><span style="color: #674ea7;"> పతివ్రతలు</span></b> తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. <b><span style="color: #674ea7;">సత్యవంతులు</span></b> తమ సత్యవాక్పరిపాలనమున సత్యసంకల్పులై భూమిని కాపాడుచున్నారు. <b><span style="color: #674ea7;">అలుబ్ధులు</span></b> లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనమునందలి మాధుర్యమును పదిమందికి పంచుచున్నారు. <b><span style="color: #674ea7;">దానశీలురు</span></b> తమ భూలోక ధనము చేతను, పరలోక ధనమైన పుణ్యధనము చేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు.<b><span style="color: #674ea7;"> శ్రీ బాపనార్యులవంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసికొని యజ్ఞపురుషుడయిన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞతతంగమును పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసిరి.</span></b></span></span></span></span></span></div>
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></span></span></span></span></span></span><br />
<span><span><span><span><span><span><span><span><span><span><span><span><span>(ఇంకా ఉంది..) </span></span> </span> </span></span> </span> </span></span></span> </span></span></span></span></div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-36932326810327479622012-04-07T11:55:00.001-04:002012-04-07T11:55:06.149-04:00Chapter 15 Part 3 (Last Part)<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="color: orange; font-size: large;"><b>అధ్యాయము 15</b></span></div>
<div>
<div style="text-align: center;">
<span style="color: #cc0000; font-size: large;"><b>బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 3 </b></span></div>
</div>
<div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;"><b>మహారాజునకు గర్వభంగము </b></span></div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
పీఠికాపురము సంస్థానమునేలు రాజు ఒక్కొక్క పర్యాయము మారువేషములో తిరిగి ప్రజల స్థితిగతులను తెలుసుకొనెడివారు. ఒకసారి ఆ మహారాజునకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేసుకొనవలెననెడి కోరిక కలిగినది. వెంటనే తన భటులను అప్పలరాజుశర్మ యింటికి పంపెను. ఆ తాఖీదు సారాంశమేమనగా, 'శీఘ్రముగా శ్రీపాదులవారిని తీసుకొని అప్పలరాజుశర్మయు, బాపనార్యులును కోటలోనికి మహారాజు వారి సముఖమునకు రావలసినదని.' అవమానకరమైన యీ ఆహ్వానమును శ్రీపాదులవారు తిరస్కరించిరి. అప్పలరాజుశర్మకు కోటలోనికి వెళ్ళుటకు యిష్టము లేదు. బాపనార్యులు వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్నగాని ఎటువంటి చోటికిని పోరు. బాపనార్యులు శ్రీపాదుల వారితో, "నాయనా! బంగారూ! కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా!" అని ప్రశ్నించిరి. దానికి శ్రీపాదులు "తాతా! మహారాజునకు భక్తిలేదు. నా దర్శనము అంత సులభమైనది కాదు." అనెను. శ్రీపాదులవారు భటులతో "మీ మహారాజునకు నన్ను చూడవలెనన్న స్వయముగా యిచ్చటకు రావచ్చును. అతడు కేవలము యీ సంస్థానమునకు మాత్రమే రాజు. నేను యీ సృష్టికంతకునూ రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను. కనుక నా వద్దకు వచ్చునపుడు వట్టి చేతులతో రారాదు. నజరానా కూడా తీసుకురావలెను. రాజు నన్ను గురువుగా భావించిన యెడల గురుదక్షిణ కూడా తీసుకురావలయును." అని కరాఖండీగా చెప్పిరి.</div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
<b><span style="color: #674ea7;">శ్రీపాద శ్రీవల్లభులు సమస్యలను సృష్టించుటలో బహునేర్పరి. అదే విధముగా సమస్యలను పరిష్కరించుటలో కూడా బహుచతురులు.</span></b> మహారాజునకు ఆగ్రహము కలిగినచో రాగల పరిణామములను గూర్చి బాపనార్యులు, అప్పలరాజుశర్మ, వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహ వర్మ యోచన చేయుచుండిరి. భటులు తెచ్చిన యీ వార్తను విన్న మహారాజు క్రోధనతో ఊగిపోవుచుండెను. 'నేను తలచుకున్న ఆ బుడుగు బాపనయ్యల బ్రతుకులేమగునో తెలియజెప్పెదగాక! నేనెంతటి శక్తిమంతుడనో వారికి ఎరుకలేదు.' అని రాజు బిగ్గరగా అరచెను. ఆ అరుపు అరచిన వెంటనే అతనిలోని శక్తి యావత్తు బయల్వెడలి నిర్వీర్యుడయ్యెను. శోషవచ్చి క్రింద పడిపోయెను. పరిచారకులు సేవలు చేసిరి. అయిననూ అతడు నీరసముగా నుండెను.</div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
ఇంతలో అతని మనోనేత్రమునకు వికారస్వరూపము గల స్త్రీమూర్తి గోచరించెను. 'నేనే శక్తిని! నీలోనికి ఉరుకుచున్నాను.' అని అరచుచూ అతనిలోనికి బలవంతముగా ప్రవేశించెను. ఆ శక్తిధాటికి తట్టుకొనలేక అతని ఎముకలు చూర్ణము అయినట్లు అనుభూతి కలిగెను. 'వెంటనే నాలో నుండి వెళ్ళిపో!' అని అతడు హీనస్వరముతో అరచెను. 'ఇదిగో! వెళ్లిపోవుచున్నాను!' అని అరచుచూ ఆ శక్తి మహాధాటితో బయటకుపోయెను. ఆ రకముగా పోవునపుడు రాజు నరకయాతనను అనుభవించెను. ఈ రకముగా శక్తి ప్రవేశించుటయూ, శక్తి బయల్వెడలుటయూ జరుగుచుండెను. ఈ రెండు ప్రక్రియల ద్వారా అతనికి నరకయాతన అనుభవమగుచుండెను. రాజ పురోహితులయిన సుందరరామశర్మకు భటుల ద్వారా వర్తమానము అందించబడెను. వారు స్వయంభూదత్తునికి అర్చన చేసి తీర్థమునిచ్చిరి. దత్త విభూతిని నొసట పెట్టుకొనిన తదుపరి శరీరములోనికి శక్తి రాకపోకలు నిలచిపోయెను. అంతట శర్మ యిట్లనిరి. "మహారాజా! చూచినారా! మా అర్చన యొక్క శీఘ్ర ఫలము. మీరు శ్రీపాదుని దర్శనము కోరిరి. అది మీకు వ్యర్థము. వారి యింట కాలాగ్నిశమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజావిశేషమున అప్పలరాజుశర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. బాపనార్యులు మంత్రానుష్ఠానమున ఏవో కొన్ని శక్తులను పొందియున్నారు. ఇంకా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు. మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కము చేసి చవుకగా కొనగలడు. నకిలీ వస్తువును మంచి వస్తువుగా నమ్మించి విక్రయము చేయగలడు. అభూత కల్పనలతో అద్భుత శక్తులను శ్రీపాదునకు అన్వయించి భజన చేయుచున్నాడు. నరసింహవర్మ సుక్షత్రియుడైననూ మూర్ఖుడై శ్రీపాదుని దత్తవతారమని స్తుతించుచున్నాడు. మీరెంతమాత్రము చింతన పొందవలదు. మా అనుష్ఠానము చాల గొప్పది. మహారాజంతటి వారు ఆజ్ఞాపించిన రాననుటకు ఎన్ని గుండెలు? ప్రభువుల వారు బలవంతముగనయిననూ శ్రీపాదుని యిచ్చటకు తీసుకురాగలరు ?" ఈ మాటలు, ముఖస్తుతులు విన్న రాజు నీరసముగా, బలవంతముగా వారిని యిచ్చటకు రప్పించిన యెడల నాకు కలుగు లాభమేమి? పై పెచ్చు నాకు అపకీర్తియే మిగులును. శ్రీపాదులవారి వద్ద కొన్ని క్షుద్రవిద్యలున్నట్లు, నాకు అనుమానముగా ఉన్నది. నాపైన శ్రీపాడుడు శక్తి ప్రయోగము చేసినాడు. లేకపోయిన, యీ శక్తి నా శరీరమున రాకపోకలు సాగించనేల? దీనికి మీరు తరుణోపాయము చూపవలెను. మీరు మా కులపురోహితులు. మా శ్రేయస్సును కాంక్షించువారు." అని పలికెను.</div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
అంతట శర్మ యిట్లనెను. "మహారాజా! దత్తపురాణమును బ్రాహ్మణులచేత పారాయణము చేయించవలెను. స్వయంభూదత్తునికి అర్చనలు చేయించవలెను. బ్రాహ్మణ సమారాధానము చేయవలెను. భూరిదక్షిణల నొసంగవలెను. అష్టాదశ వర్ణముల వారికిని అన్నదానము చేయవలెను. ఆ విధముగా చేసిన యెడల దత్తుడు ప్రసన్నుడగును. శ్రీపాదుని ఆట కట్టును. క్షుద్రశక్తుల బాధ నివారణమగును."</div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
రాజపురోహితుని కోరిక మేరకు రాజు కావలసిన ఏర్పాట్లను అన్నింటినీ చేయించెను. పీఠికాపుర ప్రాంతమునందు చాల అడవులు కలవు. పీఠికాపురమున చోరభయము జాస్తి. దత్తపురాణమును పారాయణ చేసెడి రోజునుండి నగరములో దొంగతనములు విస్తారముగా జరుగుచుండును. రాజు వాటిని అరికట్టుటలో వ్యర్థుడాయెను. రాజునకు పీడకలలు కూడా జాస్తి అయ్యెను. కొండనాలుకకు మందువేసిన ఉన్ననాలుక ఊడిపోయెనను విధముగ బాధలు మిక్కుటమవసాగెను. రాజునకు తన పితరులు స్వప్న దర్శనమీయసాగిరి. బక్కచిక్కిన దేహములతో, ఆవురావురని అన్నము కోసము పడిగాపులు పడు బిచ్చగాళ్ళవలె నుండిరి. ఏమిరా! మాకు శ్రాద్ధభోజనము పెట్టుటలేదేమి? మేము యీ ప్రేతదేహములోనే ఉండవలెనా? మాకింకా సద్గతులు లేవా ? అని ప్రశ్నించిరి. మీకు శాస్త్రోక్తముగా శ్రాద్ధకలాపములను చేయుచున్నానని రాజనెను. "నీవు చేయుచున్నావు సరే! కాని అవి మాకు అందుత లేదు. అనుష్ఠానవంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకముగా కర్మ కలాపమును నిర్వర్తించినపుడును, అదే విధముగా శ్రాద్ధము పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధమును పెట్టినపుడు మాత్రమే అవి పితరులకు సద్గతిని కలిగించును." అని పితరులు రాజుతో ననిరి. కనులు మూసినాను, తెరచిననూ పితరుల యొక్క యీ గోలతో ఆర్త నాదములతో రాజునకు రాత్రి సమయమందు నిద్రయే లేకుండెను. పులిమీద పుట్ర అనునట్లు రాజుగారి పెండ్లి కావలసిన కుమార్తెకు భూతబాధ కలిగెను. జుట్టు విరియబోసుకొని వికటాట్టహాసము చేయుచూ, యింటిలోని వస్తువులను అవతల పారవైచుచుండును. భోజనమునకు కూర్చున్నపుడు అన్నములో పురుగులు ధారాళముగా కనిపించుచుండెను. ఉన్నట్టుండి వస్త్రములకు నిప్పంటుకొనుచుండెను. అన్నదానము జరుగుచోటుకి రాజు వచ్చి వీక్షించినపుడు - దీనముగా, హీనముగా, కృశించిన శరీరములతో, ప్రేతకళతో నున్న తన వంశములోని గతించిన స్త్రీ పురుషులు దృగ్గోచరమై, రాజు పరిస్థితి చాల దయనీయముగా నుండెను.</div>
</div>
<div>
<div style="text-align: justify;">
<br /></div>
</div>
<div>
<div style="text-align: justify;">
సుందరరామశర్మ యింట కూడా పరిస్థితులు బాగుండలేదు. సౌమ్య మనస్క అయిన అతని ఇల్లాలు ఉన్నట్టుండి వంటపాత్రలతో అతని నెత్తిని మోదుచుండెను. శర్మ కుమారుడు త్రాడు నొకదానిని తెచ్చి తన తండ్రిని స్థంభమునకు కట్టివేయుచుండెను. శర్మ కుమార్తె తన తండ్రిమీద ఉమ్మివేసి, తన పాదరక్షలతో ముఖము వాయగొట్టుచుండెను. శర్మ భోజనము కోరినపుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెట్టుచున్దిరి. తినకపోయినా వాతలు కూడా పెట్టబడునని బెదిరించుచుండిరి. శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రము దత్తపురాణము పారాయణ చేయుచుండిరి. పారాయణానంతరము వారు భోజనము చేసిన తదుపరి భూతప్రేత పిశాచములు యధేచ్చగా యింట తిరగాడుచూ భయభ్రాంతులను చేయుచుండెను. కొందరు స్త్రీలు విక్రుతముగా నవ్వుచూ నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో ఆ వంశములోని పైతరములవారు పరాయి స్త్రీలను మాతృసమానులుగా ఎంచక బలవంతముగా అనుభవించిరి. ఆ స్త్రీలు ఎవరో కాదు? మేమే! మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారము చేసుకోనీయక మహాపరాధములు చేసిరి. మేము ఈ రాజవంశము మీద పగ తీర్చుకోదలచితిమి. మీరు మాకు పిండప్రదానము చేసినంత మాత్రమున మాకు సద్గతులు ఏమియునూ కలుగవు. రాజద్రవ్యమును పొంది భూరిదక్షిణల పొంది, ద్రవ్యశుద్ధి లేని ఆ ద్రవ్యమునకు అధికారులయినవారు గనుక మేము మీ కుటుంబములను కూడా వేదించ దలచితిమి." అని పలుకుచుండిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
పారాయణ చేయు బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును కూడా భయభ్రాంతులై, "దత్తపురాణము పారాయణచేసిన శుభఫలములు సిద్ధించునని విన్నాము కాని యిది ఏమి విపరీతము? ఈ పురాణ పఠనమువలన శంకరుడు ప్రసన్నుడై, తన భూత ప్రేత పిశాచ గణములతో సహా కరాళనృత్యము చేయుచున్నాడు. దత్తపురాణ పఠనమున విష్ణువు ప్రసన్నుడై తమకు మాత్రము భోజన సదుపాయము లేకుండా చేసిన అన్నార్థులై వచ్చిన బిచ్చగాళ్ళకు అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు, నింద్యములయిన వాక్కులతో తమను వేధించువారిని సృష్టించినాడు. ఆహా! దత్తపురాణ పఠనము వలన యీ పద్ధతిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రసన్నులై, వాక్కులచేత హింసించి, చావటానికి కూడా వీలు లేకుండా విష్ణుతత్త్వముతో రక్షించి, భూత ప్రేత పిశాచములకు ఆనందమును కలిగించెడి నాట్యకళలతో జీవచ్ఛవములుగా చేసెడి యెడల అటువంటి దత్తభక్తి మాకు జన్మజన్మలకు వలదు మహాప్రభో." అని పరితపించుచుండిరి.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">సృష్టిలో మానవుడు కూలియే. కూలి ఇచ్చువాడు శ్రీపాదుడు</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
వెంటనే బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును, శ్రీపాదుల వారిని శరణు జొచ్చిరి. అంతట శ్రీపాదులువారు "<b><span style="color: #674ea7;">ఈ సృష్టిలోని ప్రతీ మానవుడును కూలియే. నేనే యజమానిని. నేను ప్రసన్నుడనయిన యెడల నీకు రావలసిన దానికంటే ఎక్కువ కూలీ యిచ్చెదను. అప్రసన్నుడనయిన యెడల నీ దుష్కృత్యమునకు ఎంత కూలీ తగ్గించవలెనో అంతా తగ్గించియే యిచ్చెదను. ఆలయములో స్వయంభూదత్తుడుగా నున్నది నేనే! కాలాగ్నిశమన దత్తరూపములో నున్నది నేనే! జీవులయందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపములో వచ్చియున్నాను.</span></b> నాకు ముఖమునకు మంగళ హారతినిచ్చి పాదములను మేకులతో దిగగొట్టినయెడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు?<span style="color: #674ea7;"><b> ఈ దత్తపురాణములోని విష్ణుదత్తుడును, అతని భార్యయును, యీ కలియుగములో అప్పలరాజుశర్మగాను, సుమతీ మహారాణిగాను జన్మించిరి. </b></span>ఒకానొక కల్పమందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారులైన లాభుడు, మరియొక కల్పమందు లాభాదమహర్షి, బృహత్ శిలానగరమందు భాస్కరాచార్యులుగా వచ్చినది కూడ బాపనార్యులు వారే! వారి గోత్రము వైశ్యకులమున జనించిన వారికి గౌరవపాత్రమైనది. నేను గణేశచతుర్థి నవతరించుట కూడా దివ్యసంకల్పములో భాగము. వాసవీ కన్యకాపరమేశ్వరీ అవతారము నుండియూ వెంకటప్పయ్య శ్రేష్ఠిగారితో ఋణానుబంధము, సింహాచల క్షేత్రమునందలి నృశింహరూపములో ఋణానుబంధము కలిగిన నరసింహవర్మ, నిజంగా పుణ్యాత్ములు గనుకనే వారికి నాతో యీ అవతారములో సంబంధము కలిగినది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మజన్మలకు కట్టివేయుచుండును.<b><span style="color: #674ea7;"> నేను నృశింహసరస్వతిగా అవతరించునపుడు సాక్షాత్తు బాపనార్యుల పోలికతోనే </span></b><b><span style="color: #674ea7;">జన్మించెదను.</span></b> వారి రాగిపాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి యిచ్చటనున్న భూతప్రేతములకు విముక్తి కలిగించినట్లే. నృశింహ సరస్వతిగా అవతరించునపుడు నా గంధర్వనగరమునకు వచ్చిన భక్తుల నావహించిన భూతప్రేతములను పారద్రోలి, ఆ భూత ప్రేతములకు సద్గతిని కలిగించెదను. సంపద ఉన్నంతమాత్రమున గర్వింపరాదు. నీ వద్దనున్న సొత్తుకు ద్రవ్యశుద్ధి ఉండవలెను. లేకున్నచో దుఃఖములు కలుగును. నీవు పుణ్యవంతుడని గర్వించిన యెడల నీవు ఎంతమాత్రము పుణ్యవంతుడవు కావు. నీ చిట్టా ఆవర్జా నా వద్దనే ఉన్నవి. దయతో వాటిలో పాపకర్మ ఫలములను రద్దు చేసితినని చెప్పుచున్నాను. <b><span style="color: #674ea7;">నేను పాపాత్ముడనని నీవు నిరుత్సాహపడిన యెడల, నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాదా దత్తా! శ్రీవల్లభా! దిగంబరా! అని పిలిచినచో క్షణములో నీ పాపములన్నింటిని దహించివేసి పుణ్యవంతుని చేసెదను. </span></b>సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భావించుటవలన మీకిట్టి సంకటములు కలిగినవి. శ్రీపాద శ్రీవల్లభుని నిందించిన కారణమున, మీరు దత్తపురాణమును పారాయణ చేసియున్ననూ, మీకు దాని ఫలితము లేకపోగా, వింత వింత చిక్కులలో పడితిరి. దత్తుడే స్వయముగా శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చియున్నాడు. ఇది సత్యము." అని తెలిపిరి.</div>
<div style="text-align: justify;">
<span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span></div>
<div style="text-align: center;">
<span><span><span><span><span><span><span><b><span style="color: #38761d; font-size: large;">శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము</span></b></span></span></span></span></span></span></span></div>
<span><span><span><span><span><span><span><br /></span></span></span></span></span></span></span><br />
<span><span><span><span><span><span><span>(అధ్యాయము 15 సమాప్తం) </span></span></span></span></span></span> </span> <br />
</div>
</div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2054265037208621703.post-52523012591247342002012-03-28T14:36:00.003-04:002012-03-28T15:50:14.225-04:00Chapter 15 Part 2<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div style="text-align: center;">
<span style="color: orange; font-size: large;"><b>అధ్యాయము 15</b></span></div>
<div style="text-align: center;">
<span style="color: #cc0000; font-size: large;"><b>బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 2</b></span></div>
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">జీవులకు వివిధ యోనుల యందు కలుగు యాతనల వివరణ</span></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
అంతట నేను "అయ్యా! జీవమున్నప్పుడే కదా బాధగాని, సుఖముగాని అనుభవమయ్యేది? అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండుట ఎట్లు సాధ్యపడును?" అని ప్రశ్నించితిని. అంతట బంగారప్ప, "జీవాత్మ, పరమాత్మలో కలిసియున్నప్పుడు బ్రహ్మానందమును అనుభవించును. అది వాక్కులో వివరించుటకు వీలుకానిది, మనస్సులో తెలియరానిది. అదే విధముగా జీవాత్మ, శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైన మహా దుఃఖమును అనుభవించును. అది కూడా వాక్కులో వివరించుటకు సాధ్యము కానిది, మనస్సులో తెలియరానిది, అనగా ప్రాణమనునది లేనపుడు అనుభవింపబడే మహాదుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచూ, తెలియరాని, ఊహించరాని, ప్రాణరహితమైన మహాదుఃఖములను అనుభావిన్చుచూ లోహములో ప్రవేశించును. నానావిధ లోహములలో అది సంచరించుచూ నిద్రాణస్థితిలోనున్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహముపై, దాని సరిపడని విషపూరిత పదార్థమును పోసినావనుకొనుము. దానిలో నున్న ప్రాణము నిద్రాణస్థితిలోనే బాధననుభవించి ఆ లోహమును విడచి మరియొక లోహములోనికి ప్రయాణించును. లోహజాతులలో తాదాత్మ్యము నొందిన ఆత్మ పరిణామక్రమములో వృక్షములో ప్రవేశించును. ఇదివరకు నిర్జీవ పదార్థముగా నున్నపుడు నిద్రాణమైయున్న ప్రాణము యిప్పుడు చైతన్యవంతమై నితారుగానో, వాలుగానో ఉండవలెననెడి సంకల్పమును కలిగి యుండును. అయితే ధృడత్వమునకు ఏర్పాటైన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొనిపోయి దాని పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఈ విధముగా అనేక రకముల వృక్ష జాతులలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుచూ సగము జీవనసహితముగను, సగము జీవనరహితముగను ఉండెడి స్థితి నుండి వెలువడి క్రిమికీటకములుగా పరిణతి చెందును. ఈ దశలో చలనము కావలెననెడి దాని సంకల్పము నెరవేరును. ఈ విధముగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచూ మత్స్య రూపమును పొందును. ఆ తర్వాత పక్షిరూపమును పొందును. అనేక రకముల పక్షుల రూపములలో అనుభవము పొందిన తదుపరి నాలుగు కాళ్ళు కలిగిన జంతువులుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందును. మానవులకు తల్లివలె క్షీరమునొసంగుట చేత తనకు తెలియకుండగనే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహారధాన్యముల ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సముపార్జితమగును. తరువాత జన్మమునందు మానవ శరీరమును పొందును. సంస్కారముల వలన ఆలోచనలు కలుగును. అవి చేతలుగా మారును. ఈ విధముగా పుణ్య కర్మలు, పాపకర్మలు చేయబడుచుండును.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;"><b>సాధన పథమున సప్తభూమికల విచారణ</b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
మానవుడు తన పరిణామక్రమములో సప్తభూమికలందుండును. మొదటి భూమికయందు స్థూల దేహేంద్రియములు, సూక్ష్మ దేహేంద్రియములు ఏకకాలములో ఉపయోగించబడును. రెండవ భూమికయందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవమును పొందుచూ చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందును. మూడవ భూమిక యందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతములకు ప్రయాణము చేయగల శక్తిని పొందును. మూడు, నాలుగు భూమికల మధ్య వశీకరణ కేంద్రమొకటి ఉన్నది. వశీకరణకు లోనయినప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాల దిగ్భ్రాంతికి లోనయింది. అపుడు ఆమె తాను శిలా చైతన్యములో నున్నట్లు భావించుకొన్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము వరకు అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే మూడు, నాలుగు భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రములో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగనే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజస్థితిని పొందినది.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
నాలుగవ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగాశాక్తులు లభించును. తమ యోగశక్తులను లోకకళ్యాణార్థము అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితిలోనికి పోయే వీలుంటుంది. అట్లుగాక పాపకార్యముల నిమిత్తము, తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం యీ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలాచైతన్యములోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలనెత్తిన గాని మానవజన్మలోనికి అడుగు పెట్టే అవకాశం ఉండదు. అయిదవ భూమికలో నున్నవారు సంకల్పజ్ఞానులు. ఆరవ భూమికలో నున్నవారు భావజ్ఞానులు. సంకల్పజ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపములను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస చాల తక్కువగా ఉంటుంది. ఏడవభూమికలో నున్నవారు పరమాత్మ యందుండే అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందగలుగుతారు." అని తెలియపరచెను.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: center;">
<span style="color: #38761d; font-size: large;"><b>అవతార పురుషులకు, సాధకులకు గల వ్యత్యాసము </b></span></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
బంగారప్ప చెప్పిన మాటలను ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకొను నిమిత్తం యిట్లు ప్రశ్నించితిని. "అయ్యా! జీవులకు మాత్రమే పరిణామ క్రమముండునా? లేక అవతారములకు కూడా యివి వర్తించునా? " అంతట బంగారప్ప "<b><span style="color: #674ea7;">అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన యెడల సమర్థ సద్గురువని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన యెడల అవతారమనబడును. </span></b>మత్స్యము నీటిలో వడిగా పరిగెత్తగలదు. కూర్మము నీటిలోనూ, భూమిమీద వాడిగా ఉండగలదు. వరాహము అనగా ఖడ్గమృగము, భూమిమీద వాడిగా పరిగెత్తగల జంతువు. నారసింహము, మృగములలో శ్రేష్ఠమైన సింహపు ముఖాకృతితోను, మిగిలిన భాగము మనుష్య రూపముతోను ఉన్న అవతారము. <b><span style="color: #674ea7;">యాచనాప్రవృత్తిని గల తమోగుణ ప్రధానముగా వచ్చినది వామనావతారము. రజోగుణ ప్రధానముగా వచ్చినది పరశురామావతారము. సత్త్వగుణ ప్రధానముగా వచ్చినది రామావతారము. </span></b><b><span style="color: #674ea7;">త్రిగుణములకు అతీతమైన నిర్గుణ తత్త్వ ప్రధానముగా </span></b><b><span style="color: #674ea7;">వచ్చినది శ్రీకృష్ణావతారము. కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారము. సమస్త సృష్టిలోని ఏకత్వము నందలి అనేకత్వమును, అనేకత్వము నందలి ఏకత్వమును తన యందె నిలుపుకొనివచ్చిన అత్యంత అద్భుతమైన, అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారము. శ్రీపాదుల వారికి </span></b><b><span style="color: #674ea7;">ఋణానుబంధము లేని యోగసంప్రదాయములు గాని, మతములు గాని, ధర్మములు గాని సృష్టిలో లేనేలేవు. శ్రీపాదులవారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరము </span></b><b><span style="color: #674ea7;">కానిది. వారికి </span></b><b><span style="color: #674ea7;">వారే సాటి. అన్ని సిద్ధాంతములునూ, అన్ని సంప్రదాయములును వారి యందు సమన్వయము చెందును. ఈ సృష్టికంతటికినీ ఆది బిందువు, అన్త్యబిండువు వారే. స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారము నంతయునూ పర్యవేక్షించునది, సంకల్పించునది, గతి </span></b><b><span style="color: #674ea7;">నొందించునది వారే.</span></b> ఇది నిగూఢమైన దైవ రహస్యము. సప్త ఋషులకే అంతు పట్టని వారి స్థితిని నేనేమని వర్ణించగలను? నాయనా! శంకరభట్టూ! నీవు ధన్యుడవు! వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు, అన్యజీవులు వ్యర్థజీవులు." అని చెప్పెను.<br />
<br />
<div style="text-align: center;">
<b><span style="color: #38761d; font-size: large;">సత్కర్మ, దుష్కర్మల ఫల వివరణ </span></b></div>
<br />
"అయ్యా! నాకొక సందేహము కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినపుడు లోకములో కొందరిని మంచివారు గానూ, మరికొందరిని చెడ్డవారుగాను పుట్టించనేల? అని నేనడిగితిని.<br />
<br />
దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, "నాయనా! నీవు మంచి ప్రశ్ననే అడిగిటివి. సృష్టి యంతయునూ ద్వంద్వముల సాయము చేతనే ఏర్పడినది. మృత్యు భయము లేకపోతే కన్నతల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనే అర్థములో వాడబడినది. అంతేగాని పురుషాధిక్యతను సూచించు అర్థములో కాదు. మానవధర్మములకు, జంతుధర్మములకు ఎంతటి వ్యత్యాసము కలదో మానవ ధర్మములకు, దేవతా ధర్మములకు కూడా అంతటి వ్యత్యాసముండును. ద్వంద్వములే లేకున్న వికాసముగాని, పరిణామముగాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడనిన యెడల, అన్నియునూ మంచిశక్తులు మాత్రమే వారియందు కలవని అర్థము కాదు. నీవు యీ ప్రపంచములో చూచేది మోసము, దగా, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖము కోరుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానము లేనిదే సుఖానుభవము అనునది తెలియరాదు. మనము చూచెడి యీ కోటానుకోట్ల నక్షత్ర రాశులన్నియు మొట్టమొదట అస్త్యవ్యస్తముగా ఏర్పడినవే! అవి పరస్పరము డీకొని మరికొన్ని నక్షత్ర రాశులేర్పడినవి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతము మనకు దృగ్గోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్రరాశులు ఏర్పడినవి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధృవుడు ఆధారము. ఈ రకముగా <b><span style="color: #674ea7;">పరస్పర ఆకర్షణ </span></b><b><span style="color: #674ea7;">వికర్షణలలో సృష్టి నడుచుచున్నది. పరమాత్మ యందు ఆకర్షణ కలిగినవాడు ఆస్తికుడై, సత్కర్ముడగుచున్నాడు. వికర్షణ కలిగినవాడు నాస్తికుడై, దుష్కర్ముడగుచున్నాడు. </span></b>ఆస్తికులకునూ, నాస్తికులకునూ వారే ఆధారము. సత్కర్ములకునూ, దుష్కర్ములకునూ వారే ఆధారము. <b><span style="color: #674ea7;">ఈ సృష్టిలీలలో ఏదియునూ స్థిరము కాదు. నీవు యీనాడు ఎవరిని సత్కర్ములుగా ననుకొనుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలనాచరించిన వారే! అందువలననే యీ జన్మలో ధర్మతత్పరులైయున్నను వారికి దుఖములు తప్పుటలేదు. అటులనే దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా వారి పూర్వజన్మకృత పుణ్యఫలానుభవము కాని </span></b><b><span style="color: #674ea7;">వేరు కాదు. సామాన్య పాపముకాని, పుణ్యము కాని వెంటనే ఫలితముల నీయవు. అయితే తీవ్రమైన పాపముగాని, మహాపుణ్యముగాని చేసిన యెడల శీఘ్రముగనే ఫలించును. మానవుడు ఏ విధముగా నడుచుకొన్నయెడల సుఖముగా జీవింపవచ్చునో సద్గ్రంథములు తెలియజేయుచున్నవి.</span></b> మంచి పని చేయుటకుగాని, చెడుపని చేయుటకుగాని వానికి పరిమితమైన స్వేచ్ఛ యీయబడినది.<b><span style="color: #674ea7;"> అధర్మము మితిమీరి ధార్మికులు దిక్కు తోచని స్థితిలో నున్నపుడు పరమాత్మ తన మాయచేత అవతరించుచున్నాడు.</span></b> చావు, పుట్టుకలు లేని దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్యనుండుట అద్భుతమైన విషయము." అని చెప్పిరి. <br />
<br />
<span style="text-align: left;">(ఇంకా ఉంది..)</span><span style="text-align: left;"> </span></div>
</div>jayagurudattahttp://www.blogger.com/profile/03448057633933234884noreply@blogger.com0